Jana Sena Anniversary: జనసేన ఎనిమిదేళ్ల ప్రస్థానం
జనసేన ఎనిమిది ఏళ్ళు పూర్తి చేసుకుంది. తొమ్మిదో ఏడాదిలోకి ప్రవేశించింది. అధికారం కోసం కాకుండా 25 ఏళ్లపాటు ప్రజాపక్షాన ప్రశ్నించడానికి జనసేన స్థాపించాడు పవన్ కళ్యాణ్. ఆ పార్టీ సిద్దాంతాన్ని చేగు వీర తో ప్రారంభించి కాన్షిరాం మీదగా మోడీ వరకు మారింది.
- By CS Rao Published Date - 09:57 PM, Sun - 13 March 22
జనసేన ఎనిమిది ఏళ్ళు పూర్తి చేసుకుంది. తొమ్మిదో ఏడాదిలోకి ప్రవేశించింది. అధికారం కోసం కాకుండా 25 ఏళ్లపాటు ప్రజాపక్షాన ప్రశ్నించడానికి జనసేన స్థాపించాడు పవన్ కళ్యాణ్. ఆ పార్టీ సిద్దాంతాన్ని చేగు వీర తో ప్రారంభించి కాన్షిరాం మీదగా మోడీ వరకు మారింది. కులాలను కలిపే, మతాల ప్రస్తావన లేని మూల సిద్ధాంతం జనసేనకు ఉందని ఆ పార్టీ చెబుతోంది. కాపులకు రిజర్వేషన్, హిందూ వాదం ప్రస్తుతం వినిపిస్తోంది. పార్టీ పెట్టిన తరువాత 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ సంస్థాగతంగా నిర్మాణం ఇప్పటికీ లేదు. తెలంగాణలో ఆ పార్టీ ఉనికి కూడా కనిపించదు. కానీ యుద్ధం ఆగదని పవన్ చెబుతున్నాడు.
2014 మార్చి 14న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రకటించాడు.
హైదరాబాద్లోని ఓ హోటల్లో పార్టీని లాంచ్ చేశాడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – టీడీపీతో కలసి పేరుకు జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పోటీ చేయగా అప్పటికి జనసేనకు పవన్ తప్ప ఎవరూ లేరు. 2014 – 19 మధ్య మారిన రాజకీయాలు తెలుగుదేశం పార్టీతో పొత్తు నుంచి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, బీఎస్పీతో కలసి బరిలో దిగాడు. ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. జనసేన తరఫున కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గెలిచాడు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా ఓడిపోయాడు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ తో పొత్తు అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు కదిలాడు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు పొత్తు ఉన్నట్టు కనిపితున్నా, భేదాభిప్రాయాలు బోలెడు.
సోమవారం గుంటూరు కేంద్రంగా జనసేనాని సమరశంఖం పూరించబోతున్నారా? ఇది కేవలం ఆవర్భావసభ మాత్రమే కాదన్న పవన్ ప్రకటన వెనుక వ్యూహం ఏంటి? ఇంతకీ పవన్ ఏం చెప్పబోతున్నాడు? పార్టీ శ్రేణులు, రాష్ట్ర పజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నాడు..? భీమ్లానాయక్ మూవీ లోని సాంగ్ స్టైల్లో..
అదే ట్యూన్తో సోమవారం జరిగే అవిర్భావ సభ కోసం సాంగ్ రిలీజ్ చేసింది జనసేన పార్టీ. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామ సమీపంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ వేదికకు దామోదరం సంజీవయ్యగారి పేరు పెట్టారు. ఇదే సభలో సోమవారం కీలక ప్రసంగం పవన్ చేయబోతున్నాడు .
ఇది తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం జరిగే సభ అని చెప్పాడు. ప్రజల ఇబ్బందులపై గళమెత్తడంతోపాటు.. సభా వేదిక నుంచే భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తానని ప్రకటించాడు. భవిష్యత్తు జెండాని మోయటంకంటే బాధ్యత ఏముంటుంది.? ఒకతరం కోసం యుద్ధం చేయటంకంటే సాహసం ఏముంటుంది అంటూ పార్టీ శ్రేణులకు సందేశమిచ్చాడు. మొత్తానికి సోమవారం జరగబోయే సభ ఇతర ఆవిర్భావ సభలకు పూర్తి భిన్నంగా ఉండనుంది. ఈ విషయాన్ని స్వయంగా పవనే చెప్పాడు. ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్న వేళ… ముందస్తు ముచ్చట్లు జోరుందుకున్న సమయాన.. పవన్ ఎలాంటి అంశాలు మాట్లాడుతాడు. ఏం ప్రకటించబోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది.
Related News
AP : ఓటర్ల ప్రేమకు జనసేనాధినేత ఫిదా..
సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ది, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యులు అయినందుకు నా అభినందనలు. అత్యధికంగా 81.86 శాతం ఓటర్లు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది