HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jamili Elections Complete Nationwide Support Needed For Joint Elections Cm Chandrababu

Jamili Elections: జమిలి ఎన్నికలకు దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు కావాలి: సీఎం చంద్రబాబు

  • Author : Kode Mohan Sai Date : 11-10-2024 - 2:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Cm Chandrababu Supports Jamili Elections
Ap Cm Chandrababu Supports Jamili Elections

Jamili Elections: జమిలి ఎన్నికలకు దేశం మొత్తం సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో సుస్థిరమైన పాలన ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి అతిపెద్ద సవాలుగా జగన్‌ను పేర్కొన్నారు. విజయవాడలో మీడియాతో సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు, ఈ విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా, ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజీ ధ్వంసం చేయాలని కుట్ర పన్నినవాళ్లు వరదల్లో మా పనితీరును విమర్శిస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో ₹75 వేల కోట్లతో రైల్వే మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. బెంగళూరు-చెన్నై-అమరావతి-హైదరాబాద్ నగరాలను కలిపేందుకు బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెట్టే ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన తెలిపారు. కేంద్రం వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లుతున్నప్పుడు, అభినందించడం తన బాధ్యత అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ప్రణాళికలు రూపొందించడం మాత్రమే కాదు:

దేశంలో 7% వృద్ధి రేటు ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయని ఆయన తెలిపారు. పీపీపీ విధానంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని, సుస్థిరమైన పాలన ఉంటే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని అన్నారు.

గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమాలను ప్రవేశపెట్టడమే కాకుండా, పీఎం సూర్య ఘర్ ద్వారా ఇంటింటికీ సౌరశక్తి అందించేందుకు కృషి చేస్తున్నారు. కొందరు వ్యక్తులు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. వనరులను సరిగ్గా వినియోగిస్తే అద్భుతాలు సాధ్యం అని చెప్పారు.

ప్రణాళికలు వేయడమే కాకుండా, వాటిని సరిగ్గా అమలు చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి మనదేశం అన్నింటిలో అగ్రగామిగా ఉండాలని ఆయన కోరారు.

జగన్ విధ్వాంసాకార పాలనా:

విధ్వంసకర పాలన వల్ల ఏపీ ఎలా ధ్వంసమైందో గత ఐదేళ్లుగా చూశామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. హరియాణాలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని, సుపరిపాలన వల్ల ప్రజలు పొందే లాభాలను వారు చూస్తున్నారని చెప్పారు. బీజేపీ అగ్రనాయకత్వం పని చేసే విధానం హరియాణాలో గెలుపుకు కారణమైందని పేర్కొన్నారు.

హరియాణాలో ఈ విజయం ఎన్డీఏకు శుభ సంకేతమని, మోదీ పాలనపై ప్రజలు నమ్మకం ఉంచారని చంద్రబాబు అన్నారు. సుస్థిరత, అభివృద్ధికి హరియాణా ప్రజలు ఓటేశారు అని ఆయన వివరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu
  • election commission of india
  • Jamili Elections
  • narendra modi

Related News

Chandrababu Family

ఒక్కసారిగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు.. చంద్రబాబు సతీమణికి రూ. 80 కోట్లకుపైగా లాస్!

Heritage Company  భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం సెషన్‌లోనూ ఒడుదొడుకుల్లోనే ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఇవాళ ఇంట్రాడేలో 10 శాతం వరకు తగ్గడంతో ఇన్వెస్టర్లకు నష్టాలు వస్తున్నాయి. ఇదే సమయంలో సంస్థ ప్రమోటర్లుగా ఉన్న నారా భువనేశ్వరి, నారా లోకేష్‌ సంపద కూడా ఆవిరైంది. క్యూ3లో బలహీన ఫలితాల నేపథ్యంలో షేర్లలో అమ్మకాల ఒ

  • Chandrababu

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ

Latest News

  • నాని-సుజిత్ మూవీ క్రేజీ అప్డేట్!

  • అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

  • మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

  • మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

  • ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd