HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Sarkar Introduces 3 Capitals Bill In Assembly

Three capitals of Andhra Pradesh: హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా.. అసెంబ్లీలో 3 రాజ‌ధానుల బిల్లు..?

  • Author : HashtagU Desk Date : 05-03-2022 - 11:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Three Capitals Of Andhra Pradesh
Three Capitals Of Andhra Pradesh

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మూడు రాజధానుల విషయంలో, సీఆర్డీఏ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో హైకోర్టు తీర్పు నేపధ్యంలో ఏం చేయలనే విషయంపై ఏపీ ప్ర‌భుత్వం స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తుంది. ఈ క్ర‌మంలో తాజాగా ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై, హోంమంద్రి సుచ‌రిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టిటీ తాము వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సుచ‌రిత వెల్ల‌డించారు.

ఇక రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర పరిధిలోని అంశమని గతంలోనే కేంద్రం చెప్పిందని సుచరిత గుర్తుచేశారు. అమరావతి ప్రాంతం శాసన రాజధానిగానే ఉంటుందని, అయితే మొత్తం తరలిస్తున్నట్లు కొన్ని పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నారని సుచరిత మండిపడ్డారు. రాజధానిపై వైసీపీ ప్ర‌భుత్వానికి స్పష్టత ఉందని సుచ‌రిత తేల్చిచెప్పారు. ఇక రాజ‌ధాని విష‌యంలో ప్రభుత్వానికి శాసనాధికారం లేదని తాజాగా హైకోర్టు వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. సీఆర్డీఏ చట్ట ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని, ఆరు నెలల్లో పూర్తి చేసి ఇవ్వాలని ప్రభుత్వానికి, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇక హోంమంత్రి సుచ‌రిత‌ మాత్రమే కాదు, రాజ‌ధాని అంశం రాష్ట్ర ప‌రిధిలోనిదే అని వైసీపీ నేతలంతా చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా ఈ విష‌యం పై క్లారిటీగా ఉన్నారు. విశాఖ‌పట్ట‌ణం ప‌రిపాలన రాజ‌ధానిగా, అమరావతి – శాసన, కర్నూలు – న్యాయ రాజధానులుగా చేయాలని వైసీపీ ప్ర‌భుత్వం భావిస్తున్న సంగ‌తి తెల‌సిందే. అంటే విశాఖ‌ప‌ట్ట‌ణంలో సెక్రటేరియట్, గవర్నర్ కార్యాలయం, అమ‌రావ‌తిలో అసెంబ్లీ, క‌ర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామ‌ని వైసీపీ ప్ర‌భుత్వం గ‌తంలోనే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో, మూడు రాజ‌ధానుల విష‌యంలో మ‌రింత‌ మెరుగైన ప్రతిపాదనలతో సభ ముందుకు కొత్త బిల్లును తీసుకువచ్చేందుకు ఏపీ ప్ర‌భుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్ర‌మంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగానూ, న్యాయపరంగానూ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరుస్తామని వైసీపీ ప్ర‌భుత్వం అంటుంది. అయితే మ‌రోవైపు హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా, మార్చి 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో జ‌గ‌న్ స‌ర్కార్.. మూడు రాజధానుల కొత్త బిల్లు ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం. ఏది ఏమైనా ఏపీలో రాజ‌ధాని అంశం వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీల‌క అస్త్రం కానుంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Three capitals of Andhra Pradesh
  • ys jagan
  • ysrcp

Related News

Massive Fire Accident In Amaravati

అమరావతిపై మళ్లీ అవే కుట్రలు.. L&T పైపులకు నిప్పు…!!

L&T pipes  అమరావతి నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో జీర్ణించుకోలేని శక్తులు కుట్రలకు తెరలేపాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతి పనులు శరవేగంగా సాగుతుండటాన్ని తట్టుకోలేక, కొందరు దుండగులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. గతంలో భూసమీకరణ సమయంలో చెరకు తోటలకు నిప్పు పెట్టి రైతులను భయాందోళనలకు గురిచేసిన తరహాలోనే, ఇప్పుడు నిర్మాణ సామాగ్రిని ధ్వంసం చేస్తూ నీచమైన రాజకీయానికి ఒడిగ

  • Jagan

    వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

Latest News

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

  • రూ. 26,000 కోట్ల నెట్‌వర్త్.. SRH యజమాని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

  • పచ్చిమిర్చి కేవలం రుచి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు!

Trending News

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd