HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Is The Color Of The Sea Changing In The Coast Of Andhra Pradesh Why

Sea Color : ఏపీలో సముద్రం రంగు ఎందుకు మారుతోంది ? కారణాలివీ

సాధారణంగా సముద్ర జలం(Sea Color) నీలిరంగులోనే ఉంటుంది. అయితే ఈ రంగు మారిపోవడానికి  కొన్ని కారణాలు ఉంటాయని సముద్ర శాస్త్రవేత్తలు అంటున్నారు.

  • Author : Pasha Date : 27-02-2025 - 2:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sea Color Change In Andhra Pradesh Coast

Sea Color : ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని సముద్ర జలాల రంగులు మారుతున్నాయి.. ఇలా ఎందుకు జరుగుతోంది ? కారణం ఏమిటి ? అనేది ఈ కథనంలో  తెలుసుకుందాం..

Also Read :Shah Rukh Khan: ‘మన్నత్’ నుంచి అద్దె ఇంట్లోకి షారుఖ్.. ఎందుకో తెలుసా ?

గతేడాది విశాఖ జిల్లా భీమిలి సమీపంలో సముద్ర జలం ఎరుపు రంగులో కనిపించింది.

ఇటీవలే పెదజాలరిపేటలో సముద్ర జలం పసుపు రంగులో కనిపించింది.

తాజాగా విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో సముద్ర జలం ఆకుపచ్చ రంగులో కనిపించింది.

కొన్ని చోట్ల సముద్రంలో 10 నుంచి 100 మీటర్లు మేర, కొన్ని సార్లు ఇంకా చిన్నఏరియాలో రంగు మార్పు కనిపిస్తోంది. 

రాష్ట్రంలో పలుచోట్ల సముద్ర తీరంలోని ఇసుక కూడా వివిధ రంగుల్లో సందర్శకులను కనిపిస్తోంది. 

ఇలా సముద్రం ఎందుకు రంగులు మారుతోంది ? అనే దానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆసక్తి నెలకొంది.  

Also Read :Chandra Shekhar Azad: తెల్లదొరలపై రివేంజ్ తీర్చుకున్న చంద్రశేఖర్ ఆజాద్.. జీవిత విశేషాలివీ

ఖనిజ ధాతువుల ఎఫెక్ట్ పెద్దదే

సాధారణంగా సముద్ర జలం(Sea Color) నీలిరంగులోనే ఉంటుంది. అయితే ఈ రంగు మారిపోవడానికి  కొన్ని కారణాలు ఉంటాయని సముద్ర శాస్త్రవేత్తలు అంటున్నారు. నదుల నీళ్లు వచ్చి సముద్రంలో కలుస్తుంటాయి. నదీ జలాల్లో ఖనిజ ధాతువులు పుష్కలంగా ఉంటాయి. వాటి స్వభావాన్ని బట్టి సముద్రంలోని నీళ్ల రంగులో మార్పులు జరుగుతుంటాయని సైంటిస్టులు అంటున్నారు. ప్రత్యేకించి కొండ ప్రాంతాల నుంచి వచ్చే నదీజలాల్లో ఎక్కువగా ఖనిజ ధాతువులు ఉంటాయి. ఐరన్ ఎక్కువగా ఉండే నీటి ప్రవాహాలు సముద్రంలో కలిస్తే సముద్రం ఎర్రగా మారుతుంది. భీమిలి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల్లో ఉన్న మట్టిలో హెమటైట్‌లో ఫెర్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. ఇందులో ఐరన్ ఎక్కువ. అది ఎక్కువ మొత్తంలో సముద్రంలో కలిస్తే, సముద్రపు నీరు ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ ఎరుపు రంగు క్రమంగా గోధుమరంగులోకి, ఆ తర్వాత లేత నీలి రంగులోకి మారిపోతుంది.

వ్యర్థ పదార్థాలు కలిస్తే ఈ రంగులోకి 

వ్యర్థ పదార్థాలతో కూడిన నదీ జలాలు సముద్రంలో కలిస్తే సముద్రపు నీరు లేత ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగులోకి మారుతుంది. పెదజాలరిపేటలో ఇదే జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నదీ జలాల ద్వారా భార ఖనిజాలు వచ్చి సముద్రంలో కలిస్తే సముద్ర జలాలు నలుపురంగులో ఉన్నట్లు కనిపిస్తాయి. స్థానికంగా జరిగిన ఒక చర్య వల్ల ఈవిధమైన మార్పు  స్థానికులకు కనిపిస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఆ రంగు సముద్రం నీటిలో కలిసిపోయి, సముద్రం మళ్లీ సాధారణ రంగులోకి వచ్చేస్తుంది.

ఇసుక రంగుకు ఏమైంది ? 

సముద్రతీరంలోని ఇసుక గోధుమ రంగులో ఉంటుంది. అయితే ఇది కొన్నిసార్లు నలుపు, ఎరుపు రంగుల్లో కనిపిస్తుంది. వాస్తవానికి ఇసుక రంగు అనేది మారదు. కానీ వివిధ రకాల రంగుల్లో ఇసుక ఉంటుంది. కొంత ఇసుక నలుపు, ఎరుపు రంగుల్లో ఉంటుంది. దీనికి కారణం అందులోని ఆయా  రంగుల ఖనిజ ధాతువులే. సముద్ర తీరానికి సమీపంలో అగ్నిపర్వతాలున్నా, గనులున్నా తీరంలోని ఇసుక కూడా ఆ రంగులోనే ఉంటుంది. విశాఖ సముద్ర తీరం పొడవునా ఖనిజ ధాతువులు ఉన్నాయి. అందుకే ఆ నీటి రంగులు మారుతుంటాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Andhra Pradesh coast
  • AP Coast
  • Coastal Area
  • Sea Color
  • Sea Color Change

Related News

New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

మనీలాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం–2002 (PMLA) కింద సమర్పించిన ఈ అభియోగ పత్రాన్ని కోర్టు స్వీకరించడంతో కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • నాని-సుజిత్ మూవీ క్రేజీ అప్డేట్!

  • అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

  • మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

  • మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

  • ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd