HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Is The Color Of The Sea Changing In The Coast Of Andhra Pradesh Why

Sea Color : ఏపీలో సముద్రం రంగు ఎందుకు మారుతోంది ? కారణాలివీ

సాధారణంగా సముద్ర జలం(Sea Color) నీలిరంగులోనే ఉంటుంది. అయితే ఈ రంగు మారిపోవడానికి  కొన్ని కారణాలు ఉంటాయని సముద్ర శాస్త్రవేత్తలు అంటున్నారు.

  • Author : Pasha Date : 27-02-2025 - 2:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sea Color Change In Andhra Pradesh Coast

Sea Color : ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని సముద్ర జలాల రంగులు మారుతున్నాయి.. ఇలా ఎందుకు జరుగుతోంది ? కారణం ఏమిటి ? అనేది ఈ కథనంలో  తెలుసుకుందాం..

Also Read :Shah Rukh Khan: ‘మన్నత్’ నుంచి అద్దె ఇంట్లోకి షారుఖ్.. ఎందుకో తెలుసా ?

గతేడాది విశాఖ జిల్లా భీమిలి సమీపంలో సముద్ర జలం ఎరుపు రంగులో కనిపించింది.

ఇటీవలే పెదజాలరిపేటలో సముద్ర జలం పసుపు రంగులో కనిపించింది.

తాజాగా విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో సముద్ర జలం ఆకుపచ్చ రంగులో కనిపించింది.

కొన్ని చోట్ల సముద్రంలో 10 నుంచి 100 మీటర్లు మేర, కొన్ని సార్లు ఇంకా చిన్నఏరియాలో రంగు మార్పు కనిపిస్తోంది. 

రాష్ట్రంలో పలుచోట్ల సముద్ర తీరంలోని ఇసుక కూడా వివిధ రంగుల్లో సందర్శకులను కనిపిస్తోంది. 

ఇలా సముద్రం ఎందుకు రంగులు మారుతోంది ? అనే దానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆసక్తి నెలకొంది.  

Also Read :Chandra Shekhar Azad: తెల్లదొరలపై రివేంజ్ తీర్చుకున్న చంద్రశేఖర్ ఆజాద్.. జీవిత విశేషాలివీ

ఖనిజ ధాతువుల ఎఫెక్ట్ పెద్దదే

సాధారణంగా సముద్ర జలం(Sea Color) నీలిరంగులోనే ఉంటుంది. అయితే ఈ రంగు మారిపోవడానికి  కొన్ని కారణాలు ఉంటాయని సముద్ర శాస్త్రవేత్తలు అంటున్నారు. నదుల నీళ్లు వచ్చి సముద్రంలో కలుస్తుంటాయి. నదీ జలాల్లో ఖనిజ ధాతువులు పుష్కలంగా ఉంటాయి. వాటి స్వభావాన్ని బట్టి సముద్రంలోని నీళ్ల రంగులో మార్పులు జరుగుతుంటాయని సైంటిస్టులు అంటున్నారు. ప్రత్యేకించి కొండ ప్రాంతాల నుంచి వచ్చే నదీజలాల్లో ఎక్కువగా ఖనిజ ధాతువులు ఉంటాయి. ఐరన్ ఎక్కువగా ఉండే నీటి ప్రవాహాలు సముద్రంలో కలిస్తే సముద్రం ఎర్రగా మారుతుంది. భీమిలి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల్లో ఉన్న మట్టిలో హెమటైట్‌లో ఫెర్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. ఇందులో ఐరన్ ఎక్కువ. అది ఎక్కువ మొత్తంలో సముద్రంలో కలిస్తే, సముద్రపు నీరు ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ ఎరుపు రంగు క్రమంగా గోధుమరంగులోకి, ఆ తర్వాత లేత నీలి రంగులోకి మారిపోతుంది.

వ్యర్థ పదార్థాలు కలిస్తే ఈ రంగులోకి 

వ్యర్థ పదార్థాలతో కూడిన నదీ జలాలు సముద్రంలో కలిస్తే సముద్రపు నీరు లేత ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగులోకి మారుతుంది. పెదజాలరిపేటలో ఇదే జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నదీ జలాల ద్వారా భార ఖనిజాలు వచ్చి సముద్రంలో కలిస్తే సముద్ర జలాలు నలుపురంగులో ఉన్నట్లు కనిపిస్తాయి. స్థానికంగా జరిగిన ఒక చర్య వల్ల ఈవిధమైన మార్పు  స్థానికులకు కనిపిస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఆ రంగు సముద్రం నీటిలో కలిసిపోయి, సముద్రం మళ్లీ సాధారణ రంగులోకి వచ్చేస్తుంది.

ఇసుక రంగుకు ఏమైంది ? 

సముద్రతీరంలోని ఇసుక గోధుమ రంగులో ఉంటుంది. అయితే ఇది కొన్నిసార్లు నలుపు, ఎరుపు రంగుల్లో కనిపిస్తుంది. వాస్తవానికి ఇసుక రంగు అనేది మారదు. కానీ వివిధ రకాల రంగుల్లో ఇసుక ఉంటుంది. కొంత ఇసుక నలుపు, ఎరుపు రంగుల్లో ఉంటుంది. దీనికి కారణం అందులోని ఆయా  రంగుల ఖనిజ ధాతువులే. సముద్ర తీరానికి సమీపంలో అగ్నిపర్వతాలున్నా, గనులున్నా తీరంలోని ఇసుక కూడా ఆ రంగులోనే ఉంటుంది. విశాఖ సముద్ర తీరం పొడవునా ఖనిజ ధాతువులు ఉన్నాయి. అందుకే ఆ నీటి రంగులు మారుతుంటాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Andhra Pradesh coast
  • AP Coast
  • Coastal Area
  • Sea Color
  • Sea Color Change

Related News

Rising COVID-19 cases in AP

COVID: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో చాప కింద నీరులా కరోనా మళ్లీ విస్తరిస్తోంది. ఒకప్పుడు కరోనా సృష్టించిన విలయతాండవం ఎవ్వరూ మరచిపోలేనిది. తల్లడిల్లుతూ పోయిన ప్రాణాలు ఇప్పటికీ కళ్ల ముందే కదులుతున్నాయి. అలాంటి మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలో వెలుగుచూసిన కోవిడ్ పాజిటివ్ కేసుల నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెర్చ్ సంస్థలో పరీక్షించగా, అవి RF 5

  • 9 arrested in Guntur case involving the stripping of a woman.

    Guntur woman case: గుంటూరులో మహిళను వివస్త్ర కేసులో 9 మంది అరెస్ట్

  • Major twist in the Kadambari Jethwani intimidation case; the net closes in on the YCP leader.

    Kadambari Jethwani: కాదంబరి జెత్వాని బెదిరింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత చుట్టూ ఉచ్చు.

  • YouTuber Ravan's remand extended again.

    Joseph Ravan Remand Report: యూట్యూబర్‌ రావణ్‌కు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

  • COVID-19 scare returns to AP; 12 cases reported across 4 districts.

    Covid: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 4 జిల్లాల్లో 12 కొవిడ్‌ కేసులు

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd