HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Investment By Major Companies In Kuppam

Investment : కుప్పంలో భారీ కంపెనీలు ఇన్వెస్ట్‌మెంట్ 8 వేల మందికి ఉపాధి

Investment : కుప్పంలో శ్రీజ మహిళా పాల ఉత్పత్తిదారుల సంస్థ (MMPCL) మరియు మదర్ డెయిరీ తమ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించేందుకు ముందుకొచ్చాయి

  • Author : Sudheer Date : 28-05-2025 - 7:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Huge Companies Invest In Ku
Huge Companies Invest In Ku

స్వర్ణాంధ్ర విజన్‌(Swarnandhra Vision)ను సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu)నడిపిస్తున్న అభివృద్ధి యాత్రలో తాజాగా మరో కీలక అడుగు పడింది. సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పంలో శ్రీజ మహిళా పాల ఉత్పత్తిదారుల సంస్థ (MMPCL) మరియు మదర్ డెయిరీ తమ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించేందుకు ముందుకొచ్చాయి. సోమవారం చిత్తూరులోని సీఎం నివాసంలో ఈ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలుసుకుని, తమ ప్రణాళికలపై చర్చించారు. ప్రభుత్వం ఈ యూనిట్ల కోసం అవసరమైన భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలోని 8,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించనున్నాయని సీఎం తెలిపారు.

Yuvraj Singh: గుజ‌రాత్ టైటాన్స్‌లోకి యువ‌రాజ్ సింగ్‌.. మెంటార్‌గా అవ‌తారం?

ఈ రెండు కంపెనీలు తమ ఉత్పత్తులకు అవసరమైన పాలు, పండ్ల గుజ్జును నేరుగా రైతుల నుంచే సేకరించనున్నాయి. ఈ విధానం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ముఖ్యమంత్రి నమ్మకం వ్యక్తం చేశారు. మహిళల పాల ఉత్పత్తులు, ఉద్యానవన ఉత్పత్తుల ప్రాసెసింగ్ ద్వారా రైతులకు స్థిర ఆదాయం, గ్రామీణులకు ఉపాధి లభించనుంది. శ్రీజ సంస్థ పాల ప్రాసెసింగ్ యూనిట్, మదర్ డెయిరీ పండ్ల గుజ్జు ప్రాసెసింగ్ యూనిట్‌ను వచ్చే 18 నెలల్లో ప్రారంభించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ యూనిట్లు కుప్పం ప్రాంత అభివృద్ధి అథారిటీ (KADA)తో గతంలో కుదిరిన ఒప్పందాల అనుసంధానంలో ఉంటాయని పేర్కొన్నారు.

CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఫుల్ అల‌ర్ట్‌!

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తోంది. పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎరువులు, రసాయనాల ఉత్పత్తి, కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు, రిలయన్స్ సంస్థ 500 బయో గ్యాస్ యూనిట్ల స్థాపన వంటి పలు ప్రాజెక్టులు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకెళ్తున్నాయి. ఈ ప్లాంట్లు హరిత ఇంధనంపై ఆధారపడి ఉండటంతో విదేశాల్లో భారీ డిమాండ్ ఉండనుందని చంద్రబాబు తెలిపారు. రైతులకు గడ్డి పెంపకానికి ఎకరాకు రూ.30 వేల చొప్పున కౌలు చెల్లించి, గ్రామీణ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వం పేర్కొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • investment
  • kuppam
  • Srija Women Milk Producers Association

Related News

Stable gold prices.. What is the exchange rate today?

పెళ్లిళ్ల సీజన్ ముందు పసిడి ధరలకు రెక్కలు..పది గ్రాముల ధర తెలిస్తే షాక్ ..

Gold Price  అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఇవాళ‌ రికార్డు స్థాయికి చేరాయి. ఇరాన్‌పై సైనిక చర్యకు దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు భారీగా మొగ్గుచూపారు. దీంతో పసిడి, వెండి ధరలు ఆల్-టైమ్ గరిష్ఠాన్ని తాకాయి. భారత మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈరోజు ఉదయం 10.45 గంటల స

  • Ap Sanjeevani Scheme

    త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు

  • Jal Jevaan

    జలజీవన్ మిషన్ కింద ఏపీకి రూ.13 వేల కోట్లు

  • 3 Years of Yuva Galam Padayatra Nara Lokesh

    నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఘనంగా సంబరాలు

  • Budget 2026 Amaravati Bill

    బడ్జెట్ సమావేశాల్లో జమిలి, అమరావతి బిల్లులు!

Latest News

  • రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం

  • ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. 7.2 శాతం వృద్ధి హైలెట్స్ ఇవే

  • చెవిరెడ్డి భాస్కర్‌ కు భారీ ఊరట ! 226 రోజుల తర్వాత బెయిల్‌

  • ఒక్కసారిగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు.. చంద్రబాబు సతీమణికి రూ. 80 కోట్లకుపైగా లాస్!

  • మేడారం భక్తులకు శుభవార్త..మగవారికి ఉచిత బస్సు ప్రయాణం

Trending News

    • ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

    • పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ

    • అజిత్ పవార్‌ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!

    • అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !

    • స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd