HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Inter Linking Of Godavari Krishna Penna Rivers What Is The Benefit For Andhra Pradesh

Rivers Inter Linking : గోదావరి – కృష్ణా – పెన్నా నదుల అనుసంధానం.. ఏపీకి ప్రయోజనమిదీ

ప్రస్తుతానికి గోదావరి నుంచి పోలవరం ద్వారా ప్రకాశం బ్యారేజీ(Rivers Inter Linking) వరకు జలాలు వస్తున్నాయి.

  • Author : Pasha Date : 16-11-2024 - 9:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Godavari Krishna Penna Rivers Inter Linking Andhra Pradesh

Rivers Inter Linking : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి రావడంతో గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టుపై మళ్లీ కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీకి ఆర్థికసాయం చేయాలని కేంద్ర సర్కారును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే కోరారు. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తయితే దక్షిణ కోస్తాలోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలకు మేలు కలుగనుంది. ఈ మూడు నదుల అనుసంధాన ప్రాజెక్టుకు దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని ఏపీ సర్కారు అంచనా వేస్తోంది. ఈ ఖర్చును ఏపీ ప్రభుత్వం ఒక్కటే భరించలేదని, కేంద్రం కూడా సహకరించాలని చంద్రబాబు ఇటీవలే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. త్వరలో డీపీఆర్‌ సిద్ధంచేసి పంపుతామని ఆమెకు తెలిపారు.

Also Read :Old Vehicles : కాలం చెల్లిన వాహనాలు @ 42 లక్షలు.. వీటిలో టూవీలర్స్ 31 లక్షలు

పోలవరం కుడి ప్రధాన కాలువ కెపాసిటీని పెంచి.. 

పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్‌‌ను నిర్మించి, అక్కడి నుంచి బనకచర్లకు జలాలను తీసుకెళ్లి రాయలసీమను అనుసంధానించాలన్నది గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు లక్ష్యం. ప్రస్తుతానికి గోదావరి నుంచి పోలవరం ద్వారా ప్రకాశం బ్యారేజీ(Rivers Inter Linking) వరకు జలాలు వస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి నాగార్జునసాగర్‌ కుడికాలువలోకి నీరు ఎత్తిపోయడానికి 2015-16లోనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత ప్రాజెక్టు ముందుకు సాగలేదు. పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి, సమీపాన వైౖకుంఠపురం ఎత్తిపోతల పథకం నుంచి బొల్లాపల్లి రిజర్వాయరు-బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌కు గోదావరి జలాలను తరలించే అంశాన్ని ఏపీ జల వనరుల శాఖ పరిశీలిస్తోంది. గోదావరి జలాలను పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించేందుకు గత టీడీపీ హయాంలో పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారు. పోలవరం కుడి ప్రధాన కాలువ ప్రస్తుత సామర్థ్యం ప్రకారం దాని ద్వారా కృష్ణా డెల్టాకు 17,561 క్యూసెక్కుల నీటిని మాత్రమే తరలించవచ్చు. ఈ కాలువ లోతును ఆరు మీటర్లకు తవ్వితే రోజూ 40,674 క్యూసెక్కుల నీటిన తరలించే ఛాన్స్ ఉంటుంది.

Also Read :10 Children Died: పండ‌గ‌పూట విషాదం.. 10 మంది చిన్నారులు సజీవదహనం!

ప్రతిపాదన ఇదీ.. 

వర్షకాలం సీజన్‌లో పోలవరం ప్రధాన కుడి కాలువ నుంచి గోదావరి మిగులు జలాలను రోజుకు 2 టీఎంసీల చొప్పున కృష్ణా నదికి తరలిస్తారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలోని వైకుంఠపురం నుంచి కొత్త కాలువల ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లికి పంపుతారు. అక్కడ రిజర్వాయర్‌ను నిర్మించి, దాని ద్వారా నల్లమల మీదుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బనకచర్లకు తీసుకెళ్తారు. బనకచర్ల నుంచి సోమశిల, తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీనీవాకు పంపి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశామలం చేస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Godavari Krishna Penna
  • Inter Linking of rivers
  • Rivers Inter Linking

Related News

CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఈ పర్యటనలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఆయన వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాల ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం, అనుమతులు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు.

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

Latest News

  • అవతార్-3 మూవీ ఎలా ఉందంటే !!

  • టీం ఇండియా హెడ్ కోచ్ పై కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు గంభీర్‌ కోచ్‌ కాదు!

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కౌశలం తో ఐటీ ఉద్యోగం

  • ఛాంపియన్ స్టోరీ ఇదే !!

  • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd