Visakhapatnam : సాకేతపురంలో మానవ `స్కావెంజింగ్`
విశాఖపట్నం మహానగరంలోని సాకేతపురం దళిత కాలనీలోని రెల్లి వీధి `మాన్యువల్ స్కావెంజింగ్ ` చేసే వాళ్లకు కేంద్రం. అ
- By CS Rao Published Date - 03:49 PM, Fri - 30 September 22
విశాఖపట్నం మహానగరంలోని సాకేతపురం దళిత కాలనీలోని రెల్లి వీధి `మాన్యువల్ స్కావెంజింగ్ ` చేసే వాళ్లకు కేంద్రం. అక్కడే భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నీలం రంగు విగ్రహం ప్రముఖమైనది. విశాఖ నావల్ ఆర్మమెంట్ డిపోకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం షెడ్యూల్డ్ కులాల వర్గానికి చెందిన రెల్లిస్ ఎక్కువగా ఉండే నివాస ప్రాంతం.
మాన్యువల్ స్కావెంజింగ్ ను 1993లో నిషేధించారు. అయినప్పటికీ విశాఖ జిల్లాల్లో ఎక్కువగా కొనసాగుతోంది. మాన్యువల్ స్కావెంజర్స్ నిషేధం మరియు వారి పునరావాస చట్టం 1993 ప్రకారం నిషేధించబడినప్పటికీ అక్రమంగా జిల్లా యంత్రాంగమే చేయిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువగా ఒరిస్సా నుంచి వచ్చిన రెల్లీ సామాజికవర్గం ఈ వృత్తిని నమ్ముకుంది. సాకేతాపురంలో 200 రెల్లి కుటుంబాలు ఉండగా అందులో కనీసం 20 కుటుంబాలు మాన్యువల్ స్కావెంజింగ్ మీద ఆధారపడ్డాయి. వారిలో 48 ఏళ్ల ఎం మూర్తి కనీసం 20 ఏళ్లుగా సెప్టిక్ ట్యాంక్లను శుభ్రం చేస్తున్నాడు.
సొంత ప్రాంతాలలో స్కావెంజింగ్ ఉద్యోగాలు చేయడానికి దళితులు ఇష్టపడలేదు. అందుకే ఒరిస్సాకు చెందిన రెల్లిస్ విశాఖపట్నం సరిహద్దులో ఉత్తర కోస్తా ఆంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు వలస వెళ్లారని రచయిత రామస్వామి తన పుస్తకంలో పొందుపరిచారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఈ పని చేస్తున్నప్పటికీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) కేవలం 64 మందిని మాన్యువల్ స్కావెంజర్లుగా గుర్తించింది. మాన్యువల్ స్కావెంజర్లుగా గుర్తించిన 64 మందిలో 18 మంది రెల్లి వర్గానికి చెందిన వారు. మిగిలిన వారు మాదిగ, మాల, యాదవ, సెట్టిబలిజ, తెలగ తదితర వర్గాలకు చెంది ఉన్నారు.
ఇప్పటి వరకు 32 మంది మాత్రమే పునరావాసం పొందారని జిల్లా ఎస్సీ సేవా సహకార సంఘం (డీఎస్సీఎస్సీఎస్) తెలిపింది. వీరికి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఒక్కొక్కరికి రూ.40,000 అందించారు. వారికి “టిప్పర్లు, వాక్యూమ్ లోడర్లు, సానిటరీ పరికరాలు, అధునాతన ఉపకరణాలు అందించడంతో పాటు జీవనోపాధి పథకాలు కూడా అందించబడ్డాయని DSCSCS వారి ప్రతిస్పందనలో తెలిపింది.
క్లీనింగ్ జాబ్స్లో మాన్యువల్ స్కావెంజర్లను కొనసాగించడం కేంద్ర ప్రభుత్వ అధికారిక విధానం. ప్రభుత్వంలో ఎవరూ వారికి ప్రత్యామ్నాయ వృత్తిని అందించాలని భావించడం లేదు. ఇందులో మురికిని శుభ్రం చేయడం లేదని సఫాయి కరాంచారి ఆందోళన్ (SKA) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజర్ సి పెన్నోబిలేసు ఆరోపించారు.మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం, 2013 ప్రకారం ఇది శిక్షార్హమైన నేరంగా పరిగణించబడింది. ఈ పద్ధతిని తొలగించడానికి, GVMC ఇంటింటికీ సర్వేలు నిర్వహించి 1,772 మరుగుదొడ్లను గుర్తించి కూల్చివేసింది. వారు 339 కమ్యూనిటీ టాయిలెట్లను కూడా నిర్మించారు. అయితే కార్పొరేషన్లో మాన్యువల్ స్కావెంజింగ్ను నిర్మూలించేందుకు యంత్రాల సేకరణలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజీ విభాగం, ఇంజినీరింగ్ విభాగం తమ వద్దే ఉన్నాయని పేర్కొంటూ వాటిని పంచుకోవడానికి జివిఎంసి నిరాకరించింది.
Related News
Visakhapatnam: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విశాఖ నుంచి బ్యాంకాక్ కు డైరెక్ట్ ఫ్లైట్
Visakhapatnam: ఎయిర్ ఏషియా విశాఖపట్నం-బ్యాంకాక్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించింది. కోవిడ్ -19 మహమ్మారి తర్వాత విశాఖపట్నం నుండి విదేశీ విమానాన్ని ప్రవేశపెట్టిన రెండవ అంతర్జాతీయ విమానయాన సంస్థగా నిలిచింది. విశాఖపట్నం నుంచి సింగపూర్ కు తొలి అంతర్జాతీయ విమానం స్కూట్. వారానికి మూడు సార్లు (మంగళ, గురు, శనివారాలు) బ్యాంకాక్ కు ఎయిర్ ఏషియా విమానాలను నడపనుంది. బ్యాంకాక్ ను�