IMD Issues Red Alert: ఏపీకి రెడ్ అలర్ట్, 14 రాష్ట్రాల్లో కుండపోత, 3 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్
IMD Issues Red Alert: సెప్టెంబరు 8న ఒడిశా, తెలంగాణ, మధ్య మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్ మినహా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కాగా వాతావరణ శాఖ మొత్తం 14 రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
- By Praveen Aluthuru Published Date - 09:29 AM, Sun - 8 September 24

IMD Issues Red Alert: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వరదల పరిస్థితి నెలకొంది. గుజరాత్లోనూ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. కొండ ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. దీంతో కొండచరియలు విరిగిపడి వినాశనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఐఎండీ మూడు రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
ఈ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్:
సెప్టెంబరు 8న ఒడిశా, తెలంగాణ(Telangana), మధ్య మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్ మినహా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కాగా వాతావరణ శాఖ మొత్తం 14 రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో భారీ వర్ష సూచన:
సెప్టెంబర్ 14 వరకు మధ్యప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో సెప్టెంబర్ 12 వరకు భారీ వర్షాలు కురుస్తాయి. గోవా, ఛత్తీస్గఢ్లలో సెప్టెంబర్ 12 వరకు వర్షాలు కురుస్తాయని అంచనా. సెప్టెంబర్ 8న యానాం, ఆంధ్రప్రదేశ్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
సెప్టెంబర్ 10న ఈ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్:
అసోం, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో సెప్టెంబర్ 10న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
సెప్టెంబర్ 11న యూపీలో కుండపోత:
సెప్టెంబర్ 11న తూర్పు ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది. కోస్టల్ కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, విదర్భ, కొంకణ్ మరియు గోవా మరియు అరుణాచల్ ప్రదేశ్లలో సెప్టెంబర్ 11న ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Also Read: Munneru Floods Threat: మున్నేరుకు మరోసారి వరద గండం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ