అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!
- Author : Vamsi Chowdary Korata
Date : 11-03-2026 - 4:51 IST
Published By : Hashtagu Telugu Desk
Amaravati Velagapudi ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమరావతిలోని వెలగపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన మంటలు చెలరేగటంతో ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు కాలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు భయపడిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో అగ్నిప్రమాదం జరిగింది. వెలగపూడి సీడ్ యాక్సిస్ రెడ్డులోని ఎన్9 జంక్షన్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎల్అండ్టీ సంస్థకు చెందిన పైపులు కాలిపోయాయి. భారీ శబ్ధంతో పైపులు తగలబడిపోయాయి. పెద్దఎత్తున మంటలు, దట్టమైన పొగ విస్తరించటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ పరిసర ప్రాంతమంతా నల్లని పొగ కమ్మేసింది. దీంతో భయపడిపోయిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను నియంత్రించే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.