HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Govt Suspends Three Officials In Madanapalle Incident

Madanapalle : మదనపపల్లె ఫైళ్ల దగ్ధం కేసు..ముగ్గురి పై వేటు

ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా.

  • By Latha Suma Published Date - 05:24 PM, Mon - 29 July 24
  • daily-hunt
Govt-suspends-three-officials-in-madanapalle-incident
Govt-suspends-three-officials-in-madanapalle-incident

Madanapalle: ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో(Sub Collector Office) ఫైళ్ల దగ్ధం (Burning files)అయిన విషయం విదితమే. అయితే ఈ ఘటన పై చర్యలు మొదలయ్యాయి. దస్త్రాల దహనం కేసులో కొందరు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. పాత ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. భూ సమస్యల పైనే 80 శాతం అర్జీలు వస్తున్నాయని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం భూమిని అడ్డం పెట్టుకుని దందా చేశారు.. రెవెన్యూ విషయంలో ప్రక్షళాన జరగాలని పేర్కొన్నారు. అధికారులకు బాధ్యతతో పాటు భయం కూడా ఉండాలని చెప్పారు. మదనపల్లె ఫైల్స్ ఘటనలో కొందరు అధికారులు బరి తెగించారని.. అందుకే మాజీ, ప్రస్తుత ఆర్డీవోలను, సీనియర్ అసిస్టెంటుని సస్పెండ్ చేశామని అన్నారు. అసైన్డ్ భూములపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రూపకల్పనకు చర్యలు చేపట్టామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయి.. ఇళ్ల పట్టాల కోసం భూ పంపిణీ పేరుతోనూ అక్రమాలు చేపట్టారని అన్నారు. పాసు పుస్తకాలు, సర్వే రాళ్లపై బొమ్మలు వేయించుకున్నారనే అంశంపై చర్చించామని తెలిపారు. 75 లక్షల సర్వే రాళ్లున్నాయి.. వాటిని తొలగించాలంటే రూ. 15 కోట్లు ఖర్చు అయ్యేలా ఉందన్నారు. మరోవైపు.. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రూపొందిస్తున్నాం.. తాము ఇచ్చే పట్టాదార్ పాసు పుస్తకాలపై రాజముద్ర ఉంటుందని తెలిపారు. విశాఖ, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు ఉమ్మడి జిల్లాల్లో భూ సమస్యలు ఉన్నాయి.. త్వరలో ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో భూ సమస్యల పరిష్కారంపై సమావేశాలు పెడతామని చెప్పారు.

కాగా.. రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ.. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రమాదం కాదని అన్నారు. కుట్రలో భాగంగానే ఫైళ్లను తగులబెట్టారని తెలిపారు. ఫైళ్లపై ఏదో కెమికల్ చల్లారు.. కెమికల్ చల్లకుండా ఇంత పెద్ద ఎత్తున ఫైళ్లు త్వరగా దగ్దం కావని ఆయన చెప్పారు. కానీ మదనపల్లె ఫైల్స్ ఘటనలో కేవలం 17 నిమిషాల్లో ఫైళ్లన్నీ దగ్దం అయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు.. ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ చేశారు.. ఆ ఫైళ్లను దగ్దం చేశారనే ఆరోపణ ఉందని తెలిపారు. 14 వేల ఎకరాల చుక్కల భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు.. ఇదెలా సాధ్యం..? అని ప్రశ్నించారు. ఎంతటి వారైనా సరే ఫైళ్ల దగ్దం ఘటనలో వదిలిపెట్టమని తెలిపారు. ఫైళ్ల దగ్దం ఘటన వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు.. మొత్తం 2200 ఫైళ్లను దగ్దం చేశారని ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు.

Read Also: Health Tips: నోరు తెరిచి నిద్రపోతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • madanapalle incident
  • Suspension

Related News

Ap Govt

Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

Ration Cards Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులందరికీ ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని సూచించినప్పటికీ, ఇంకా లక్షల సంఖ్యలో కార్డులు అప్‌డేట్ కాలేదు.

  • It Companies Amravati

    IT Companies : ఏపీకి క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు

  • Investment In Ap

    Investments : ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ పెట్టుబడులు

  • Sri Charani Cricketer

    Sree Charani: శ్రీ చరణికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

  • CM Chandrababu

    New Rules : ఏపీ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..లేదంటే పథకాలు కట్

Latest News

  • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

  • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

  • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

  • Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

  • ‎Friday: శుక్రవారం రోజు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో అంతే సంగతులు!

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd