HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Govt Suspends Three Officials In Madanapalle Incident

Madanapalle : మదనపపల్లె ఫైళ్ల దగ్ధం కేసు..ముగ్గురి పై వేటు

ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా.

  • By Latha Suma Published Date - 05:24 PM, Mon - 29 July 24
  • daily-hunt
Govt-suspends-three-officials-in-madanapalle-incident
Govt-suspends-three-officials-in-madanapalle-incident

Madanapalle: ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో(Sub Collector Office) ఫైళ్ల దగ్ధం (Burning files)అయిన విషయం విదితమే. అయితే ఈ ఘటన పై చర్యలు మొదలయ్యాయి. దస్త్రాల దహనం కేసులో కొందరు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. పాత ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. భూ సమస్యల పైనే 80 శాతం అర్జీలు వస్తున్నాయని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం భూమిని అడ్డం పెట్టుకుని దందా చేశారు.. రెవెన్యూ విషయంలో ప్రక్షళాన జరగాలని పేర్కొన్నారు. అధికారులకు బాధ్యతతో పాటు భయం కూడా ఉండాలని చెప్పారు. మదనపల్లె ఫైల్స్ ఘటనలో కొందరు అధికారులు బరి తెగించారని.. అందుకే మాజీ, ప్రస్తుత ఆర్డీవోలను, సీనియర్ అసిస్టెంటుని సస్పెండ్ చేశామని అన్నారు. అసైన్డ్ భూములపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రూపకల్పనకు చర్యలు చేపట్టామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయి.. ఇళ్ల పట్టాల కోసం భూ పంపిణీ పేరుతోనూ అక్రమాలు చేపట్టారని అన్నారు. పాసు పుస్తకాలు, సర్వే రాళ్లపై బొమ్మలు వేయించుకున్నారనే అంశంపై చర్చించామని తెలిపారు. 75 లక్షల సర్వే రాళ్లున్నాయి.. వాటిని తొలగించాలంటే రూ. 15 కోట్లు ఖర్చు అయ్యేలా ఉందన్నారు. మరోవైపు.. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రూపొందిస్తున్నాం.. తాము ఇచ్చే పట్టాదార్ పాసు పుస్తకాలపై రాజముద్ర ఉంటుందని తెలిపారు. విశాఖ, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు ఉమ్మడి జిల్లాల్లో భూ సమస్యలు ఉన్నాయి.. త్వరలో ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో భూ సమస్యల పరిష్కారంపై సమావేశాలు పెడతామని చెప్పారు.

కాగా.. రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ.. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రమాదం కాదని అన్నారు. కుట్రలో భాగంగానే ఫైళ్లను తగులబెట్టారని తెలిపారు. ఫైళ్లపై ఏదో కెమికల్ చల్లారు.. కెమికల్ చల్లకుండా ఇంత పెద్ద ఎత్తున ఫైళ్లు త్వరగా దగ్దం కావని ఆయన చెప్పారు. కానీ మదనపల్లె ఫైల్స్ ఘటనలో కేవలం 17 నిమిషాల్లో ఫైళ్లన్నీ దగ్దం అయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు.. ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ చేశారు.. ఆ ఫైళ్లను దగ్దం చేశారనే ఆరోపణ ఉందని తెలిపారు. 14 వేల ఎకరాల చుక్కల భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు.. ఇదెలా సాధ్యం..? అని ప్రశ్నించారు. ఎంతటి వారైనా సరే ఫైళ్ల దగ్దం ఘటనలో వదిలిపెట్టమని తెలిపారు. ఫైళ్ల దగ్దం ఘటన వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు.. మొత్తం 2200 ఫైళ్లను దగ్దం చేశారని ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు.

Read Also: Health Tips: నోరు తెరిచి నిద్రపోతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • madanapalle incident
  • Suspension

Related News

Ap Egg

Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

Production of Eggs : మాంసం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో, పాల ఉత్పత్తిలో ఐదవ స్థానంలో, మరియు గేదెల ఉత్పత్తిలో ఆరవ స్థానంలో ఉందని దామోదర్ నాయుడు తెలిపారు

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • Ap Universal Health Policy

    Universal Health Policy : యూనివర్సల్ హెల్త్ పాలసీ పూర్తి వివరాలు!

  • New bar policy implemented in AP

    AP : ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త బార్ పాలసీ

  • Ap Assembly Sessions

    AP Assembly Sessions : వచ్చే నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd