HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Four Ias Who Were Relieved From Telangana Reported In Ap

IAS officers : ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు..త్వరలో పోస్టింగ్‌లు..!

IAS officers : అయితే తెలంగాణ ప్రభుత్వం .. వారిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి తీర్పు వచ్చే వరకూ రిలీవ్ చేయలేదు. కోర్టు వారి పిటిషన్ కొట్టి వేసిన తర్వాత రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చింది. రిలీవ్ చేయడానికి పది, పదిహేను రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోర్టుకు చెప్పినా సానుకూల నిర్ణయం రాలేదు.

  • Author : Latha Suma Date : 17-10-2024 - 5:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Four-IAS-Who-Were-Relieved-From-Telangana-Reported-In-Ap
Four-IAS-Who-Were-Relieved-From-Telangana-Reported-In-Ap

Reported in AP : తెలంగాణలోనే కొనసాగేందుకు చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలం కావడంతో తెలంగాణలో రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్టు చేశారు. ఏపీ సచివాలయానికి వచ్చిన వారు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు తమ జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. త్వరలోనే వారికి పోస్టింగులు ఇచ్చే అవకాశం ఉంది. కాట అమ్రపాలి, రోనాల్డ్ రాస్, వాణి ప్రసాద్, వాకాటి అరుణ ఏపీలో రిపోర్టు చేశారు. వాస్తవానికి వీరంతా పదహారో తేదీనే ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. ఆ తేదీనే ఫైనల్ చేస్తూ.. డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది.

అయితే తెలంగాణ ప్రభుత్వం .. వారిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి తీర్పు వచ్చే వరకూ రిలీవ్ చేయలేదు. కోర్టు వారి పిటిషన్ కొట్టి వేసిన తర్వాత రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చింది. రిలీవ్ చేయడానికి పది, పదిహేను రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోర్టుకు చెప్పినా సానుకూల నిర్ణయం రాలేదు. డీవోపీటీ ఉత్తర్వుల విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేసింది. దీంతో వారు ఏపీలో రిపోర్టు చేయక తప్పలేదు. మరో వైపు ఏపీ నుంచి ముగ్గురు ఐఏఎస్ అధికారులు డీవోపీటీ ఉత్తర్వుల మేరకు తెలంగాణలో బుధవారమే రిపోర్టు చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత క్యాడర్ విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ ఐఏఎస్‌లకు విభజించింది. తెలంగాణ క్యాడర్ కేటాయించిన కొంత మంది.. ఏపీ కేడర్ కేటాయించిన కొంత మంది ఈ కేటాయింపు సరి కాదని క్యాట్ లో పిటిషన్లు వేయడంతో పాటు న్యాయపోరాటం చేశారు. పదేళ్ల పాటు వారు కోరుకున్న రాష్ట్ర క్యాడర్ లోనే కొనసాగారు. కానీ ఇప్పుడు తుది నిర్ణయం రావడంతో వెనక్కి వెళ్లక తప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగితే కీలక పోస్టింగులు ఉంటాయని ఇప్పుడు ఏపీకి వెళ్తే పెద్దగా పట్టించుకోరన్న అభిప్రాయంతో ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగాలని అనుకున్నట్లగా తెలుస్తోంది.

తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారులు అంజనీకమార్, అభిలాష్ బిస్త్ కూడా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. వారు ఇంకా రిపోర్టు చేయలేదు. డీవోపీటీ నుంచి వారికి ఇంకా ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. ఆదేశాలు వచ్చిన తర్వాత వారు కూడా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. అంజనీకుమార్ గత ఎన్నికలకు ముందు వరకూ తెలంగాణలో డీజీపీగా పని చేశారు.

Read Also: Press Meet : రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ఉద్యోగం..అందరికీ ఉపాధి..మా ప్రభుత్వ ఆలోచన: సీఎం రేవంత్ రెడ్డి

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • CS Nirab Kumar Prasad
  • IAS Officers
  • postings
  • reported
  • telangana

Related News

Telangana Congress Coordina

TG Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త అధ్యాయం

ఈ కమిటీ ప్రధానంగా ప్రభుత్వ నిర్ణయాల అమలులో పార్టీ పాత్రను మరియు పార్టీ అజెండాను ప్రభుత్వ ప్రాధాన్యతలతో అనుసంధానించే పనిని చేస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను నేరుగా ముఖ్యమంత్రి మరియు మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం

  • CM Revanth Reddy, Nara Lokesh Visits Dhulipalla Narendra Daughter Wedding

    Dhulipalla Narendra Daughter Wedding: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరైన సీఎం రేవంత్, మంత్రి లోకేశ్

  • Telangana Petroleum Dealers Association

    Telangana Petroleum Dealers Association: తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన.. ఇంధన కొరత లేదు

  • Seat Increase In Lok Sabha

    Seat Increase in Lok Sabha & Assemblies : ఏపీలో నియోజకవర్గాలు పెరిగితే ఏ పార్టీ కి లాభం ?

  • Jawa Yezdi

    Jawa Yezdi : కోస్తా తీరంలో క్లాసిక్ రైడ్స్ కోసం సిద్ధమైన కొత్త 3S సెంటర్!

Latest News

  • Putin: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన పుతిన్.. రష్యా నుంచి ఇరాన్‌కు డ్రోన్లు..

  • Vijay Mallya: నాడు పెట్టిన పెట్టుబడికి నన్ను చూసి చాలా మంది నవ్వుకున్నారు: విజ‌య్ మాల్యా

  • Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

  • Peddi Tickets : పెద్ది అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్

  • Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

Trending News

    • Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

    • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

    • ఐపీఎల్ 2026.. ఆట‌గాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌లు!

    • పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!

    • రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd