HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Former Mla Gone Prakashs Open Letter To Pm Modi

Former MLA Gone Prakash: ప్రధాని మోదీకి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ బహిరంగ లేఖ

గతంలో అదానీ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త‌ర‌పున అప్పటి ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసి, ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

  • Author : Gopichand Date : 30-11-2024 - 2:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Former MLA Gone Prakash
Former MLA Gone Prakash

Former MLA Gone Prakash: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి మాజీ ఎమ్మెల్యే గోనె ప్ర‌కాష్ (Former MLA Gone Prakash) బ‌హిరంగ లేఖ రాశారు. ఈ లేఖ‌లోఆయ‌న అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. అందులో గౌతమ్ అదానీ అవినీతితోపాటు గతంలో ఏపీలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో జరిగిన అక్రమాలపై రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి లేదా సీబీఐ లేదా జేపీసీ ద్వారా విచారణ జరిపించాలని ప్రధానిని గోనె ప్రకాష్ కోరింది. అదానీ అక్రమాలు, వాటికి సహకరించిన మాజీ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు అవినీతికి సహకరించిన వారందరిపై చర్యలు తీసుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

గతంలో అదానీ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త‌ర‌పున అప్పటి ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసి, ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అదానీ గ్రూప్ తో జగన్ చేసుకున్న ఒప్పందం వల్ల 25 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పడే భారం రూ.1.50 లక్షల కోట్లు కాబట్టి వెంటనే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.

విదేశాల్లో అవినీతికి పాల్పడి దేశానికి చెడ్డపేరు తెచ్చిన అదానీని మీరు వెనకేసుకొని రాకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయ‌న లేఖ‌లో రాసుకొచ్చారు. అదానీ అవినీతితో అంటకాగిన వైసీపీ అధ్యక్షులు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌తో సహా అందరిపై చర్యలు తీసుకోవాలన్నారు. అదానీపై ఈడీ, సీబీఐ విచారణకు మోదీ ఆదేశించాలని, అదానీతో పాటు జ‌గ‌న్‌పై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాల‌న్నారు.

Also Read: land Acquisition Notification : లగచర్ల మల్టీపర్సస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణకు నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలని డిమాండ్ చేశారు. అదానీకి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీతో 2021లో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా స్వయంగా అప్పటి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి రూ.1750 కోట్లు నేరుగా లంచాలు ముట్టినట్లు అమెరికా కోర్టలో తీవ్ర అభియోగాలు మోపబడ్డాయని ఆయ‌న పేర్కొన్నారు.

దిగ్గజ వ్యాపారవేత్తగా పేరున్న అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని మండిప‌డ్డారు. 2021 డిసెంబర్ 1న 7వేల మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసేందుకు ఒప్పందాలు జరిగాయని, రాష్ట్రంలో రైతుల కోసం ఈ విద్యుత్‌ను వినియోగించనున్నట్లు అప్పుడు ప్రకటించారని, ఈ ఒప్పందం అంత్యంత కారుచౌక అని, విద్యుత్ కొనుగోళ్లలో వైసీపీ ప్రభుత్వం సాధించిన విజయంగా గొప్పలు చెప్పుకున్నారని ఆయ‌న గుర్తుచేశారు. కానీ అదానీ దగ్గర నుంచి గుజరాత్ యూనిట్ ధర రూ.1.99 పైసలకు కొంటుంటే, అంధప్రదేశ్ మాత్రం యూనిట్ ధర రూ.2.49 పైసలుగా అగ్రిమెంట్ చేసుకుంది. గుజరాత్ కంటే 50 పైసలు ఎక్కువ పెట్టి కొన్నారని ఆయ‌న గుర్తుచేశారు.

అంతర్జాతీయంగా దేశం పరువు తీసిన అదానీ చీకటి ఒప్పందాలు, వ్యాపారాలపై విచారణ జరిపించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో జ‌గ‌న్ పాలనలో ప్రభుత్వంతో అక్రమంగా ఒప్పందాలు చేసుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టిన అదానీ అక్రమ వ్యాపారాలను వెలికితీసి అదానీ, జ‌గ‌న్‌ల‌తో పాటు ఈ కుంభకోణంలో పాత్ర ఉన్న అందరిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటేనే ప్ర‌ధాని మోదీ కూడా నిజాయితీకి, విలువలకు కట్టుబడినవారిగా నేను విశ్వసిస్తానని ఆయ‌న త‌న లేఖ‌లో పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Former MLA
  • Former MLA Gone Prakash
  • Gone Prakash
  • pm modi
  • Politicis
  • telangana
  • telugu news

Related News

Minister Uttam Holds High L

Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష

రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి, వినియోగదారులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తోంది

  • Minister Lokesh

    విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • Telangana Agriculture

    ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

  • Kutami Govt

    అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!

  • Andhra Pradesh Funds

    ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్

Latest News

  • ఆరు నెలల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు

  • Janasena Formation Day : ‘జనసేన’కు 13 ఏళ్లు.. సామాన్యుడి గొంతుక నుంచి డిప్యూటీ సీఎం వరకు.. ఒక చారిత్రక ప్రయాణం!

  • Ram Charan Birthday Song : చ‌ర‌ణ్ బర్త్‌డే స్పెషల్.. ఆ పాట ఆపండి మహాప్రభో

  • Watermelon : పుచ్చకాయ కొనేటప్పుడు ఇవి తప్పక గమనించండి!

  • పాక్ కు బంగ్లా షాక్.. పాక్ కెప్టెన్ పరువు తీసిన బంగ్లా కెప్టెన్!

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd