Kodali Nani: కొడాలి నాని ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ముంబైకి తరలింపు!
ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కి తరలించే అవకాశం ఉంది. కొడాలికి గుండెలో మూడు వాల్స్ క్లోజ్ కావడంతో సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు.
- Author : Gopichand
Date : 31-03-2025 - 11:39 IST
Published By : Hashtagu Telugu Desk
Kodali Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు (Kodali Nani) ఆరోగ్య పరిస్థితి గురించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఆయనను మెరుగైన వైద్యం కోసం ముంబై తరలించనున్నట్లు తెలుస్తోంది. కొడాలి నాని మార్చి 25న ఛాతీ నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యల కారణంగా హైదరాబాద్లోని ఏఐజీ (AIG) ఆస్పత్రిలో చేరారు. ప్రారంభంలో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు పుకార్లు వచ్చినప్పటికీ ఆస్పత్రి వైద్యులు ఆయన పరిస్థితిని గ్యాస్ట్రిక్ సమస్యగా నిర్ధారించారు. అయితే గుండె సంబంధిత సమస్యలను కూడా పరీక్షించారు. మార్చి 26, 2025 నాటికి ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
మార్చి 27, 2025న వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా కొడాలి నానిని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఏఐజీ వైద్యులు ఆయనకు గుండె సంబంధిత అసాధారణతలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా గుండెపోటు అని నిర్ధారించలేదు. కొన్ని వార్తా సంస్థలు సర్జరీ అవసరం కావచ్చని పేర్కొన్నప్పటికీ, ఈ విషయంలో అప్పటికి స్పష్టత రాలేదు.
Also Read: Important Festivals: కొత్త ఏడాది ఉగాది నుంచి ముఖ్యమైన పండగలు ఇవీ!
తాజా నివేదికల ప్రకారం.. కొడాలి నాని ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు ఆశిస్తున్నారు. ఆస్పత్రి లేదా కుటుంబం నుండి మరిన్ని అధికారిక నవీకరణలు రావాల్సి ఉంది.
కొడాలి నానిని ముంబైకి తరలించే అవకాశం
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నానికి హార్ట్ స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం ముంబై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కి తరలించే అవకాశం ఉంది. కొడాలికి గుండెలో మూడు వాల్స్ క్లోజ్ కావడంతో సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. మెరుగైన చికిత్స కోసం.. హార్ట్ స్పెషల్ హాస్పిటల్ అయిన ముంబై బాంద్రాలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో సర్జరీ చేయించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.