HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Former Ap Cm Chandrababu Meets Cji Nv Ramana

Chandrababu meets CJI: మూడేళ్ల త‌రువాత అపూర్వ క‌ల‌యిక‌

సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలుఉన్నాయి.

  • Author : CS Rao Date : 20-08-2022 - 5:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
Chandrababu

సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలుఉన్నాయి. కానీ, మూడేళ్లుగా ఒక‌చోట వాళ్లిద్ద‌రూ క‌నిపించ‌లేదు. ఇటీవ‌ల ఆయ‌న కృష్ణా జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబును క‌లుసుకోలేక‌పోయారు. ఒక‌టిరెండు సంద‌ర్భాల్లో హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ కేంద్రంగా క‌లుసుకోవ‌డానికి అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ వాళ్లిద్ద‌రూ ఏకాంతంగా క‌లిసిన సంద‌ర్భాలు లేవు. కానీ, శ‌నివారం వాళ్లిద్ద‌రూ క‌లుసుకోవ‌డం పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది.

విజ‌య‌వాడలో కొత్తగా నిర్మించిన కోర్టు భవనాలను ముఖ్యమంత్రితో కలిసి సీజేఐ ప్రారంభించారు. ఆ సంద‌ర్భంగా సీజేఐ ఒక ప్రైవేటు హోటల్ లో బ‌స చేశారు. అక్క‌డే జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన చంద్రబాబు ఆయనకు వెంకటేశ్వరుని ప్రతిమను అందించి సత్కరించారు. అక్క‌డే సీఎం జగన్ మర్యాద పూర్వకంగా కలిశారు. అదే సమయంలో చంద్రబాబు సీజేఐతో సమావేశ‌మై ఉన్నారు. ఆ సంద‌ర్భంగా అక్క‌డ క‌నిపించిన దృశ్యం, ప్రోటోకాల్ టెన్ష‌న్ నెల‌కొంది. అమరావతి శంకుస్థాపన జ‌రిగిన రోజు ప్రధాని మోదీ వ‌చ్చిన రోజు జస్టిస్ ఎన్వీ రమణ కూడా హాజరయ్యారు. ఆ తరువాత అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవం 2019 ఫిబ్రవరిలో జరిగింది. నాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ హైకోర్టు భవనాలను ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారి హైదరాబాద్ – అమరావతి వచ్చిన సందర్భాల్లోనూ చంద్రబాబు ఆయనతో సమావేశం కాలేదు.
హైదరాబాద్ లో సీజేఐ హోదాలో తొలి సారి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. రాజ్ భవన్ లో బస చేసిన సీజేఐ ను అనేక పార్టీల నేతలు క‌లిసిన‌ప్ప‌టికీ చంద్రబాబు దూరంగా ఉన్నారు. ఇక, ఏపీ పర్యటన సమయంలో పూర్తిగా అధికారిక కార్యక్రమాలే షెడ్యూల్ చేశారు. ఇప్పుడు విజయవాడ వచ్చిన సీజేఐ అధికారిక కార్యక్రమాలతో పాటుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు.

సీజేఐ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం అనంతరం ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ సీజేఐ గౌరవార్ధం విందు ఏర్పాటు చేశారు. విందులో గవర్నర్ తో పాటుగా హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. ఆ తరువాత వ్యక్తిగత పర్యటన నిమిత్తం గుంటూరు వెళ్తారు. సాయంత్రం స్వగ్రామం పొన్నవరం వెళ్లి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. మొత్తం మీద ఈనెల 27న ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తోన్న జ‌స్టిస్‌ ఎన్వీ ర‌మ‌ణను మూడేళ్ల త‌రువాత చంద్ర‌బాబు క‌ల‌వ‌డం హైలెట్ గా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • chandrababu
  • CJI NV Ramana

Related News

ఏపీలోని డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే లోన్

ఏపీలోని డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే లోన్

గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన పడి అధిక వడ్డీలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు 'స్త్రీ నిధి' (Stree Nidhi) పథకాన్ని మరింత బలోపేతం చేస్తోంది

  • Amaravati

    అమరావతిలో ఏఐ యూనివర్సిటీ!

  • Quantum Valley

    క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ? నిరుద్యోగులకు లాభం ఏంటి?

  • 'corrupt' Politics In Ap

    ఏపీలో ‘కల్తీ’ రాజకీయాలు!

  • APs Development

    ఎంత రెచ్చగొట్టిన కాపులు సైలెంట్ గా ఉంటున్నారా ? వైసీపీ ప్లాన్ వర్క్ కావడం లేదా ?

Latest News

  • రేపు స్పీకర్ పై అవిశ్వాస అస్త్రం!

  • అంబటి రాంబాబుపై ఏకంగా 52 కేసులు నమోదు !!

  • రైతులకు గుడ్ న్యూస్..గోద్రేజ్ ఆగ్రోవెట్ నుండి ‘TAKAI’ వచ్చేసింది

  • హైదరాబాద్ లో మరో స్కామ్ బట్టబయలు.. ఏకంగా రూ.5 వేల కోట్లు!

  • ‘ఒరేయ్ పొట్టోడా’ అంటూ మరోసారి సీఎం రేవంత్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు

Trending News

    • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

    • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd