HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ex Mla Dhulipalla Narendra Fires On Cm Jagan

TDP vs YSRCP : కసాయి ముఖ్యమంత్రికి రైతుల దుస్థితి క‌నిపించ‌దా..?

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర ఫైర్ అయ్యారు. ఈ సంవత్సరం రైతాంగం లక్షలాది

  • By Prasad Published Date - 05:41 PM, Thu - 2 November 23
  • daily-hunt
TDP
TDP

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర ఫైర్ అయ్యారు. ఈ సంవత్సరం రైతాంగం లక్షలాది ఎకరాల్లో పంటలు వేయకపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. రైతాంగం విషయంలో పాలకుల వైఖరి చాలా దారుణంగా ఉందని, డ్రాట్ మాన్యువల్ (కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలు) ప్రకారం క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ కు సంబంధించి ప్రతివారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితి.. సాగునీరు.. విద్యుత్ .. వేసిన పంటలపై సమీక్ష చేయాలని.. కానీ జగన సర్కార్ మొత్తం వ్యవసాయ రంగాన్నే గాలికి వదిలేసిందని ఆయ‌న ఆరోపించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు రైతుల్ని ఆదుకోవడానికి అనేక చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడమే మర్చిపోయిందని.. ఒక్కమాట చెప్పాలంటే వ్యవసాయశాఖ రాష్ట్రంలో చచ్చిపోయిందన్నారు. ముఖ్యమంత్రి అనే పదవిపై వ్యామోహం తప్ప.. ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి ఏం చేయాలో.. రైతుల విషయంలో ఎలా వ్యవహరించాలో కూడా జగన్ రెడ్డికి తెలియదని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి తన శాఖకు సంబంధించిన నిజాలు బయటకు చెబితే.. తన తల వెయ్యి ముక్కలవుతుందేమో అన్నంతగా భయపడిపోతున్నార‌న్నారు. వ్యవసాయశాఖ మంత్రి అయితే మాట మాత్రంగా కూడా రైతుల గురించి స్పందించడం లేద‌ని.. అసలు ఆయన రాష్ట్రంలో ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో 470 మండలాల్లో వర్షాభావ పరిస్థితులుంటే.. ప్రభుత్వం మొక్కుబడిగా 103 మండలాలు ప్రకటించి చేతులు దులుపుకుందన్నారు. ఆ 103 మండలాల్లో 80 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నట్టు చెబుతున్నా రని.. రాష్ట్రంలో ప్రాంతాలవారీగా పడాల్సిన వర్షం…పడిన వర్షాన్ని లెక్కలోకి తీసుకోకుం డా ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించడం బాధాకరమ‌న్నారు. జీవో నెం- 4ద్వారా కరువు మండలాలు ప్రకటించడం తప్ప.. రైతులకోసం.. కరువు పరిస్థితుల నివారణ కోసం ప్రభుత్వం పైసా కూడా నిధులు ఇవ్వలేదన్నారు. జీవో- 4 నాలుక గీసుకో వడానికి తప్ప దేనికి పనికిరాదని.. డ్రాట్ మాన్యువల్ ప్రకారం కరువు మండలాల ప్రకటన అనేది అక్టోబర్ 30 లోపు జరగాలని కేంద్రప్రభుత్వ నిబంధనలు చెబుతుంటే, జగన్ ప్రభుత్వం మాత్రం నింపాదిగా 31 అక్టోబర్ న ప్రకటించింద‌న్నారు. టీడీపీ-జనసేన నేతలు రైతుల్ని కలిసి వారి కష్టాలు, బాధలు తెలుసుకొని ప్రభుత్వం కళ్లు తెరిపిస్తారన్నారు. రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడి నేత్రత్వంలో టీడీపీ రైతు విభాగం సమావే శమైంది. ఆ సమావేశంలో కరువు మండలాల్లో టీడీపీ రైతు విభాగం పర్యటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. రైతుల్ని కలిసి.. వారి బాధలు కష్టాలు ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యాచరణతో టీడీపీ ముందుకెళ్తుందని ధూళిపాళ్ల న‌రేంద్ర తెలిపారు. ఈ ప్రక్రియలో జనసేన ను కూడా కలుపుకొని తెలుగుదేశం ముందుకెళుతుంద‌ని తెలిపారు.

Also Read:  AP : క‌న్నీరు పెడుతున్న మిర్చి రైతులు.. గుంటూరులో వంద‌ల ఎక‌రాల్లో ఎండిపోయిన పంట‌


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • cm jagan
  • Dhulipalla Narendra
  • tdp
  • ycp
  • ysrcp

Related News

If you don't come to the assembly, there will be by-elections: Raghuramakrishna Raju warns Jagan

AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

అసెంబ్లీ నిబంధనల ప్రకారం, వరుసగా 60 రోజుల పాటు సభ్యులు సభకు హాజరుకాకపోతే, వారి సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. ఇది సరళమైన నిబంధన దాన్ని విస్మరించలేం అని ఆయన గుర్తు చేశారు.

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

    Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

  • Nara Lokesh

    Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd