HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ex Mla Dhulipalla Narendra Fires On Cm Jagan

TDP vs YSRCP : కసాయి ముఖ్యమంత్రికి రైతుల దుస్థితి క‌నిపించ‌దా..?

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర ఫైర్ అయ్యారు. ఈ సంవత్సరం రైతాంగం లక్షలాది

  • Author : Prasad Date : 02-11-2023 - 5:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర ఫైర్ అయ్యారు. ఈ సంవత్సరం రైతాంగం లక్షలాది ఎకరాల్లో పంటలు వేయకపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. రైతాంగం విషయంలో పాలకుల వైఖరి చాలా దారుణంగా ఉందని, డ్రాట్ మాన్యువల్ (కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలు) ప్రకారం క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ కు సంబంధించి ప్రతివారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితి.. సాగునీరు.. విద్యుత్ .. వేసిన పంటలపై సమీక్ష చేయాలని.. కానీ జగన సర్కార్ మొత్తం వ్యవసాయ రంగాన్నే గాలికి వదిలేసిందని ఆయ‌న ఆరోపించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు రైతుల్ని ఆదుకోవడానికి అనేక చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడమే మర్చిపోయిందని.. ఒక్కమాట చెప్పాలంటే వ్యవసాయశాఖ రాష్ట్రంలో చచ్చిపోయిందన్నారు. ముఖ్యమంత్రి అనే పదవిపై వ్యామోహం తప్ప.. ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి ఏం చేయాలో.. రైతుల విషయంలో ఎలా వ్యవహరించాలో కూడా జగన్ రెడ్డికి తెలియదని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి తన శాఖకు సంబంధించిన నిజాలు బయటకు చెబితే.. తన తల వెయ్యి ముక్కలవుతుందేమో అన్నంతగా భయపడిపోతున్నార‌న్నారు. వ్యవసాయశాఖ మంత్రి అయితే మాట మాత్రంగా కూడా రైతుల గురించి స్పందించడం లేద‌ని.. అసలు ఆయన రాష్ట్రంలో ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో 470 మండలాల్లో వర్షాభావ పరిస్థితులుంటే.. ప్రభుత్వం మొక్కుబడిగా 103 మండలాలు ప్రకటించి చేతులు దులుపుకుందన్నారు. ఆ 103 మండలాల్లో 80 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నట్టు చెబుతున్నా రని.. రాష్ట్రంలో ప్రాంతాలవారీగా పడాల్సిన వర్షం…పడిన వర్షాన్ని లెక్కలోకి తీసుకోకుం డా ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించడం బాధాకరమ‌న్నారు. జీవో నెం- 4ద్వారా కరువు మండలాలు ప్రకటించడం తప్ప.. రైతులకోసం.. కరువు పరిస్థితుల నివారణ కోసం ప్రభుత్వం పైసా కూడా నిధులు ఇవ్వలేదన్నారు. జీవో- 4 నాలుక గీసుకో వడానికి తప్ప దేనికి పనికిరాదని.. డ్రాట్ మాన్యువల్ ప్రకారం కరువు మండలాల ప్రకటన అనేది అక్టోబర్ 30 లోపు జరగాలని కేంద్రప్రభుత్వ నిబంధనలు చెబుతుంటే, జగన్ ప్రభుత్వం మాత్రం నింపాదిగా 31 అక్టోబర్ న ప్రకటించింద‌న్నారు. టీడీపీ-జనసేన నేతలు రైతుల్ని కలిసి వారి కష్టాలు, బాధలు తెలుసుకొని ప్రభుత్వం కళ్లు తెరిపిస్తారన్నారు. రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడి నేత్రత్వంలో టీడీపీ రైతు విభాగం సమావే శమైంది. ఆ సమావేశంలో కరువు మండలాల్లో టీడీపీ రైతు విభాగం పర్యటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. రైతుల్ని కలిసి.. వారి బాధలు కష్టాలు ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యాచరణతో టీడీపీ ముందుకెళ్తుందని ధూళిపాళ్ల న‌రేంద్ర తెలిపారు. ఈ ప్రక్రియలో జనసేన ను కూడా కలుపుకొని తెలుగుదేశం ముందుకెళుతుంద‌ని తెలిపారు.

Also Read:  AP : క‌న్నీరు పెడుతున్న మిర్చి రైతులు.. గుంటూరులో వంద‌ల ఎక‌రాల్లో ఎండిపోయిన పంట‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • cm jagan
  • Dhulipalla Narendra
  • tdp
  • ycp
  • ysrcp

Related News

CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఈ పర్యటనలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఆయన వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాల ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం, అనుమతులు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు.

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

  • Btechravi

    జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత

  • Botsa Satyanarayana Daughte

    YCP : రాజకీయాల్లోకి మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె ..?

Latest News

  • పోలీసుల జోక్యంతో న్యాయం గెలిచింది.. ఎస్పీకి మహిళ పాలాభిషేకం

  • నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

  • జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

  • తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

  • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

Trending News

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd