TDP vs YSRCP : కసాయి ముఖ్యమంత్రికి రైతుల దుస్థితి కనిపించదా..?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్ అయ్యారు. ఈ సంవత్సరం రైతాంగం లక్షలాది
- By Prasad Published Date - 05:41 PM, Thu - 2 November 23
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్ అయ్యారు. ఈ సంవత్సరం రైతాంగం లక్షలాది ఎకరాల్లో పంటలు వేయకపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. రైతాంగం విషయంలో పాలకుల వైఖరి చాలా దారుణంగా ఉందని, డ్రాట్ మాన్యువల్ (కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలు) ప్రకారం క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ కు సంబంధించి ప్రతివారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితి.. సాగునీరు.. విద్యుత్ .. వేసిన పంటలపై సమీక్ష చేయాలని.. కానీ జగన సర్కార్ మొత్తం వ్యవసాయ రంగాన్నే గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు రైతుల్ని ఆదుకోవడానికి అనేక చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడమే మర్చిపోయిందని.. ఒక్కమాట చెప్పాలంటే వ్యవసాయశాఖ రాష్ట్రంలో చచ్చిపోయిందన్నారు. ముఖ్యమంత్రి అనే పదవిపై వ్యామోహం తప్ప.. ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి ఏం చేయాలో.. రైతుల విషయంలో ఎలా వ్యవహరించాలో కూడా జగన్ రెడ్డికి తెలియదని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి తన శాఖకు సంబంధించిన నిజాలు బయటకు చెబితే.. తన తల వెయ్యి ముక్కలవుతుందేమో అన్నంతగా భయపడిపోతున్నారన్నారు. వ్యవసాయశాఖ మంత్రి అయితే మాట మాత్రంగా కూడా రైతుల గురించి స్పందించడం లేదని.. అసలు ఆయన రాష్ట్రంలో ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్రంలో 470 మండలాల్లో వర్షాభావ పరిస్థితులుంటే.. ప్రభుత్వం మొక్కుబడిగా 103 మండలాలు ప్రకటించి చేతులు దులుపుకుందన్నారు. ఆ 103 మండలాల్లో 80 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నట్టు చెబుతున్నా రని.. రాష్ట్రంలో ప్రాంతాలవారీగా పడాల్సిన వర్షం…పడిన వర్షాన్ని లెక్కలోకి తీసుకోకుం డా ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించడం బాధాకరమన్నారు. జీవో నెం- 4ద్వారా కరువు మండలాలు ప్రకటించడం తప్ప.. రైతులకోసం.. కరువు పరిస్థితుల నివారణ కోసం ప్రభుత్వం పైసా కూడా నిధులు ఇవ్వలేదన్నారు. జీవో- 4 నాలుక గీసుకో వడానికి తప్ప దేనికి పనికిరాదని.. డ్రాట్ మాన్యువల్ ప్రకారం కరువు మండలాల ప్రకటన అనేది అక్టోబర్ 30 లోపు జరగాలని కేంద్రప్రభుత్వ నిబంధనలు చెబుతుంటే, జగన్ ప్రభుత్వం మాత్రం నింపాదిగా 31 అక్టోబర్ న ప్రకటించిందన్నారు. టీడీపీ-జనసేన నేతలు రైతుల్ని కలిసి వారి కష్టాలు, బాధలు తెలుసుకొని ప్రభుత్వం కళ్లు తెరిపిస్తారన్నారు. రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడి నేత్రత్వంలో టీడీపీ రైతు విభాగం సమావే శమైంది. ఆ సమావేశంలో కరువు మండలాల్లో టీడీపీ రైతు విభాగం పర్యటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. రైతుల్ని కలిసి.. వారి బాధలు కష్టాలు ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యాచరణతో టీడీపీ ముందుకెళ్తుందని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. ఈ ప్రక్రియలో జనసేన ను కూడా కలుపుకొని తెలుగుదేశం ముందుకెళుతుందని తెలిపారు.
Also Read: AP : కన్నీరు పెడుతున్న మిర్చి రైతులు.. గుంటూరులో వందల ఎకరాల్లో ఎండిపోయిన పంట
Related News
Chereddy Manjula: ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా చేరెడ్డి మంజుల.. వేటకొడవళ్లతో దాడి చేసిన బెదరని టీడీపీ ఏజెంట్..!
ఏపీలో ఎన్నికల వేళ పోలింగ్ కంటే రక్తపాతమైన ఘటనలే ఎక్కువ వార్తల్లో నిలిచాయి. అయితే టీడీపీ ఏజెంట్లపై వైసీపీ నేతలు కత్తులతో, కర్రలతో దాడులు చేసిన ఘటనలు మనం చూశాం కూడా.