Montha Cyclone : రాత్రికి తీరం దాటనున్న మొంథా తుపాను..ఏపీలో భారీ వర్షాలు
Montha Cyclone : మొంథా తుపాను ఈరోజు రాత్రి మచిలీపట్నం మరియు కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీర ప్రాంతాలు—శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి
- Author : Sudheer
Date : 28-10-2025 - 10:36 IST
Published By : Hashtagu Telugu Desk
మొంథా తుపాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో క్రమంగా తీవ్రతరం అవుతోంది. నిన్న తీవ్ర వాయుగుండం నుండి తుపానుగా మారిన మొంథా, ఈరోజు ఉదయానికి తీవ్ర తుపానుగా మరింత బలపడింది. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ ప్రకారం.. ఈ తుపాను ప్రస్తుతం మచిలీపట్నం నుండి 230 కి.మీ, కాకినాడ నుండి 310 కి.మీ, విశాఖపట్నం నుండి 370 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన ఆరు గంటల్లో ఇది గంటకు సుమారు 17 కి.మీ వేగంతో కదిలింది. ఈ తుపాను యొక్క దిశ, వేగం, మరియు చుట్టుపక్కల సముద్ర ఉష్ణోగ్రతల ఆధారంగా దీని తీవ్రత ఆగామి గంటల్లో మరింత పెరగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Leaves Benefits: ఈ చిన్ని ఆకులతో షుగర్ తగ్గడం నుంచి జుట్టు పెరగడం వరకు ఎన్నో లాభాలు!
తాజా వాతావరణ నివేదికల ప్రకారం.. మొంథా తుపాను ఈరోజు రాత్రి మచిలీపట్నం మరియు కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీర ప్రాంతాలు—శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, నెల్లూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 90 నుండి 110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు కూలే ప్రమాదం ఉంది. ఇప్పటికే 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం రికార్డయింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు.
తుపాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ముందస్తుగా తరలించి రిలీఫ్ క్యాంపుల్లో ఉంచింది. 11 NDRF, 12 SDRF బృందాలు, ఫైర్ సర్వీసు, స్విమ్మర్లు, లైఫ్ జాకెట్లు, OBM బోట్లు సజ్జం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS) నుండి ఈ తుపానుపై సమీక్షలు నిర్వహిస్తూ, “జీరో రిస్క్” విధానంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ప్రభావిత జిల్లాలో కంట్రోల్ రూమ్లు సిద్ధంగా ఉంచబడ్డాయి. ప్రజలు తుఫాను సమయంలో పాత భవనాలు లేదా చెట్ల కింద తలదాచుకోవడం మానుకోవాలని, అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలను పాటించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.