HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababus Media Conference Instructions To Officials

CM Chandrababu : సీఎం చంద్రబాబు మీడియా సమావేశం..అధికారులకు ఆదేశాలు

వరద తగ్గిన తర్వాత ఆస్తి, పంట నష్టం వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో పరిస్థితులపై ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎస్‌, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు ఇందులో పాల్గొన్నారు.

  • Author : Latha Suma Date : 01-09-2024 - 10:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu's media conference..Instructions to officials
CM Chandrababu inspected the gates of Prakasam Barrage

CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపిలో భారీ వర్షాల పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ కలెక్టరేట్‌లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వరద తగ్గిన తర్వాత ఆస్తి, పంట నష్టం వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో పరిస్థితులపై ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎస్‌, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతులు, బాధితులకు వెంటనే సాయం అందించాలన్నారు. నష్టం అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. పంట నష్టం అంచనా వేసి అన్నదాతలకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పారు.

దెబ్బతిన్న ఇళ్లు, పశునష్టాన్ని మదింపు చేయాలని సూచించారు. వర్షాలు, వరదల వల్ల ఆహారం, నీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో వరదలపై ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కార్యాలయంలో అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. హోం మంత్రి, సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావం, వర్షపాతం నమోదు తదితర అంశాలు సీఎంకు సీఎస్ వివరించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, బుడమేరు వరద బాధితుల కష్టాలు తీర్చే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి తీవ్రత చెప్పడంలో అధికారులు విఫలమయ్యారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలు, ఆహారం, తాగునీరు, కొవ్వొత్తులు, టార్చ్‌లు వెంటనే అన్ని ప్రాంతాల నుంచి తెప్పించాలని సూచించారు. లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి అదనపు బోట్లు, ట్రాక్టర్లు తక్షణం తెప్పించాలని ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం కావాలన్న సీఎం.. తక్షణం అందుబాటులో ఉన్న ప్యాక్డ్‌ ఫుడ్‌ బాధితులకు అందించాలన్నారు. వృద్ధులు, చిన్నారులను వరద ప్రాంతాల నుంచి వెంటనే తరలించాలని సూచించారు.

విజయవాడలో ఉన్న అన్ని దుకాణాల నుంచి వాటర్‌ బాటిల్స్‌ తెప్పించాలన్నారు. బుడమేరులో ఊహించని స్థాయి వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందిద్దాం.. సాయంలో ప్రతి రెండు గంటలకు మార్పు కనిపించాలని ఆదేశించారు. అక్షయ పాత్ర నుంచి, సరఫరా చేయగలిగిన ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించాలని, ఖర్చు గురించి ఆలోచన చెయ్యవద్దని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు, మంత్రులకు ఎవరి బాధ్యతలు వారికి అప్పగించి పంపించారు. నిముషాలు లెక్కన అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో వెంటనే అన్ని దుకాణాల నుంచి బిస్కట్లు, పాలు తెప్పించాలని సూచించారు. విజయవాడలో సాధారణస్థితి వచ్చే వరకు కలెక్టరేట్‌లోనే ఉంటానని సీఎం స్పష్టం చేశారు. దీంతో విజయవాడ కలెక్టరేట్‌ సీఎం.. తాత్కాలిక కార్యాలయంగా మారింది. సీఎం బస్సు కూడా కలెక్టరేట్‌ వద్దకు చేరుకుంది. అవసరమైతే ఈరోజు బస్సులోనే సీఎం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Read Also: President Murmu : కోర్టుల్లో వాయిదాల పద్ధతిని మార్చేందుకు కృషి చేయాలి: రాష్ట్రపతి ముర్ము


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • CM Chandrababu
  • heavy rains
  • Media conference
  • Vijayawada Collectorate

Related News

CM Chandrababu Naidu gets ‘Business Reformer of the Year’ award: Minister Lokesh tweets

సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

దేశంలో ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ప్రతి సంవత్సరం వ్యాపార మరియు పారిశ్రామిక రంగంలో గౌరవనీయులైన వ్యక్తులను అవార్డులు ఇస్తుంది. ఈ ఏడాది ఆవార్డు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేయబడింది.

  • CM Chandrababu Naidu participated in the Collectors' Conference on the second day

    విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

  • Big announcement at 12 noon..Nara Lokesh's interesting post

    మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన..నారా లోకేశ్‌ ఆసక్తికర పోస్ట్‌

  • Nagababu

    Nagababu : ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని నాగబాబు క్లారిటీ

  • Pawan Kalyan Gift To Bcrick

    Blind Cricketers : అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు నింపిన పవన్ కళ్యాణ్

Latest News

  • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

  • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd