HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cheap Political Strategies Of Parties In Andhra Pradesh

AP Politics : ఏపీ `డ‌ర్టీ` పాలి`ట్రిక్స్`

ఏపీ రాజ‌కీయం ఛండాలంగా మారింది. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌తో ఏ మాత్రం సంబంధంలేని మ‌హిళ‌ల్ని బ‌జారు కీడ్చే `డ‌ర్టీ` పాలిటిక్స్ కు వేదిక‌గా మారింది.

  • By Hashtag U Published Date - 02:04 PM, Wed - 28 September 22
  • daily-hunt
Ap Posters
Ap Posters

ఏపీ రాజ‌కీయం ఛండాలంగా మారింది. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌తో ఏ మాత్రం సంబంధంలేని మ‌హిళ‌ల్ని బ‌జారు కీడ్చే `డ‌ర్టీ` పాలిటిక్స్ కు వేదిక‌గా మారింది. గాసిప్స్, వ్య‌క్తిత్వ హ‌న‌నం, నిరాధార ఆరోప‌ణ‌లు, అశ్లీల పోస్ట‌ర్ల‌తో ఏపీ రాజ‌కీయం నిండిపోయింది. ఒక‌ప్పుడు స‌గ‌ర్వంగా పిలుచుకునే అన్న‌పూర్ణ‌లాంటి ఏపీ ప‌రువు కృష్ణా, గోదాట్లో క‌లిసిపోతోంది. ఎనిమిదేళ్ల క్రితం జ‌నసేన సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రారంభ‌మైన బూతు, అశ్లీల సాహిత్యం 2019 ఎన్నిక‌ల నాటికి వైసీపీ, టీడీపీ ప‌తాక‌స్థాయికి చేర్చాయి. ప్ర‌స్తుతం టీడీపీ, వైసీపీ మ‌ధ్య న‌డుస్తోన్న రాజ‌కీయ యుద్ధం ఏపీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి పే, టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు కోడ‌లు బ్ర‌హ్మ‌ణి పే అంటూ పోస్ట‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న వ‌ర‌కు దిగ‌జారింది.

ఏపీ, తెలంగాణాల్లోని ప్ర‌ధాన మీడియా `పింక్, ఎల్లో, బ్లూ, బ్లాక్` విభాగాలుగా మారిపోయింది. టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న మీడియాకు పింక్, వైసీపీ సొంత మీడియాకు బ్లూ, టీడీపీ సానుభూతి మీడియాకు ఎల్లో, సమాజాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ పీక్కుతినే మీడియాకు చీక‌టి( బ్లాక్‌) మీడియాగా ప్రాచుర్యం ఉంది. ఫ‌లితంగా సోష‌ల్ మీడియా ఆధిపత్యం తెలుగు రాష్ట్రాల్లో బాగా క‌నిపిస్తోంది. అందుకే, సోష‌ల్ మీడియా వేదిక‌ల‌ను ఆయా రాజ‌కీయ పార్టీలు ఇప్పుడు సొంతం చేసుకుంటున్నాయి. వాటి నిర్వాహ‌కులుగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను పెట్టుకుంటున్నారు. దీంతో ప‌ర‌స్ప‌రం రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు బ‌దులుగా ప్రైవేటు వ్య‌వ‌హారాలు, ఇళ్ల‌లోని మ‌హిళ‌ల్ని టార్గెట్ చేసి న్యూస్ ను వండివార్చుతున్నారు. గౌర‌వంగా ఇళ్ల‌లో ఉండే మ‌హిళ‌లపై పోస్టుల‌ను క్రియేట్ చేస్తూ వాళ్ల భ‌ర్త‌ల్ని బ‌జారుకీడ్చ‌డంతో ఏపీ రాజ‌కీయాల్లోని స‌రికొత్త ట్రెండ్ గా క‌నిపిస్తోంది.

ప్ర‌ధాన మీడియా, సోష‌ల్ మీడియాను దాటుకుని ఇప్పుడు పోస్టర్ల వ‌ర‌కు బూతు, అశ్లీల రాజ‌కీయం చేరింది. గోడ‌లు, హోర్డింగ్ లపై పోస్ట‌ర్ల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ప్ర‌త్య‌ర్థి పార్టీల అధిప‌తుల‌ను మానసిక ఆందోళ‌న‌కు గురిచేసే రాజ‌కీయం వ‌చ్చేసింది. రెండు రోజులుగా వైఎస్ భార‌తి, నారా బ్ర‌హ్మ‌ణి ఫోటోల‌తో ఉన్న పోస్ట‌ర్లు ఏపీలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో భార‌తి ఉన్నార‌ని తొలి నుంచి టీడీపీ ఆరోపిస్తోంది. ఆ మేర‌కు ఆ పార్టీ సానుభూతి మీడియా, సోష‌ల్ మీడియా వేదిక‌గా డామేజ్ చేస్తూ ప్ర‌చారం చేసింది. తాజాగా `భార‌తి పే` లిక్క‌ర్ మ‌నీ యాక్స‌ప్టెడ్ హియ‌ర్ అంటూ టైటిల్ తో ఒక క్యూ ఆర్ కోడ్ ను చిత్రీక‌రించి గోడ‌ల‌పై ప్ర‌ద‌ర్శించిన‌ పోస్ట‌ర్ ఏపీలో క‌ల‌క‌లం సృష్టించింది. ప్ర‌తిగా బ్ర‌హ్మ‌ణి పే- తాజ్ హోట‌ల్ బిల్స్ యాక్స‌ప్టెడ్ హియ‌ర్ అంటూ ఒక క్యూ ఆర్ కోడ్ బ్ర‌హ్మ‌ణి ఫోటోతో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్ నాలుగు పెళ్లిళ్లు వ్య‌వ‌హారంతో ప్రారంభ‌మై శ్రీరెడ్డి, క‌త్తి మ‌హేష్ వ‌ర్సెస్ జ‌న‌సేన యుద్ధం అప్ప‌ట్లో న‌డిచింది. ఆ స‌మ‌యంలో అశ్లీల ప‌ద‌జాలం విస్తృతంగా న‌డిచింది. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద నిర‌స‌న వ్య‌క్తం చేసిన అంశాన్ని అప్ప‌ట్లో చూశాం. అదే ఒర‌వ‌డిని జన‌సేన కొన‌సాగిస్తోంది. ఆ పార్టీని త‌ల‌ద‌న్నే విధంగా 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా వైసీపీ, టీడీపీ ప‌ర‌స్ప‌రం గాసిప్స్ తో హోరెత్తించాయి. ప్ర‌భాస్-ష‌ర్మిల‌, కోటి- లక్ష్మీపార్వ‌తి, రాహుల్‌-బ్ర‌హ్మ‌ణి ఇలా ఎన్నో అంశాల‌ను సోష‌ల్ మీడియా కూడా సిగ్గుప‌డేలా పోస్టులు పెట్టారు. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి ఏ మాత్రం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు సంబంధంలేని భార‌తి, బ్ర‌హ్మ‌ణి పోస్ట‌ర్ల‌ను అశ్లీలంగా ప్ర‌ద‌ర్శిస్తూ వైసీపీ, టీడీపీ `సోష‌ల్ యోధులు` ప‌ర‌స్పరం ఏపీ ప‌రువును బ‌జారుకీడ్చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • itdp
  • social media
  • telugu desam party
  • ysrcp

Related News

Nara Lokesh Google Vizag

Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు క్యూ కట్టాయి.. ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఎంవోయూ కూడా పూర్తైంది. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో గూగుల్‌ ప

    Latest News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali 2025 Discount: దీపావళికి ముందే టయోటా నుంచి మ‌రో కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    • Rohit Sharma- Virat Kohli: రోహిత్, విరాట్ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

    • Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

    Trending News

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

      • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd