HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Write A Letter To Ap Dgp

Chandrababu : డీజీపీకి చంద్ర‌బాబు లేఖ‌.. ప‌ట్టాభి, దొంతు చిన్నాల భ‌ద్ర‌త‌కు చ‌ర్య‌లు తీసుకోండి

గన్నవరంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు, హింసాత్మక ఘటనలపై డీజీపీ కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ

  • Author : Prasad Date : 21-02-2023 - 7:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CBN Trend
CBN

గన్నవరంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు, హింసాత్మక ఘటనలపై డీజీపీ కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నేతలు దొంతు చిన్నా, పట్టాభి ల భద్రత కు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో వైసీపీ గుండాల‌కు పోలీసులు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తుంద‌ని చంద్ర‌బాబు అన్నారు. వైసీపీ కార్యకర్తలు, నేతలు దాడులుచేస్తుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని.. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ రౌడీలు దాడి చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేసి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసి అద్దాలను పగులగొట్టార‌ని తెలిపారు. అంత విధ్వంసం జరుగుతున్నా అక్కడ ఉన్న పోలీసులు రౌడీమూకను నియంత్రించకుండా ప్రేక్షక పాత్ర పోషించారని లేఖ‌లో చంద్ర‌బాబు పేర్కొన్నారు.

దాడిలో టీడీపీ కార్యకర్తలతో పాటు పోలీసులు గాయపడ్డారని.. బీసీ నాయకుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా ఇంటిపై వైఎస్సార్సీపీ గూండాలు దాడి చేశారని తెలిపారు. చిన్నా, అతని కుటుంబ సభ్యులను ఫోన్లు చేస్తూ బెదిరించారని.. చిన్నాకు చెందిన వాహనాలు, రెండు బైక్‌లకు నిప్పు పెట్టారని చంద్ర‌బాబు లేఖ‌లో ప్ర‌స్తావించారు. బీసీ నాయకుడు దొంతు చిన్నా ప్రాణాలకు ముప్పు ఉందని.. ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ ను గన్నవరం పోలీస్ స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని.. పట్టాభి డ్రైవర్, అతని భద్రతా సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వారి ఫోన్ లు ఆఫ్ చేశారు. అప్పటి నుండి పట్టాభి ఆచూకీ తెలియలేదన్నారు.

పట్టాభిని నిజంగా పోలీసులు అరెస్టు చేశారా…లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? పట్టాభిపై గతంలో కూడా వైసీపీ నేతలు వివిధ సందర్భాల్లో దాడి చేశారని.. అతని ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో అతని భద్రత పోలీసుల బాధ్యతని చంద్ర‌బాబు తెలిపారు. పట్టాభి భార్య తన భర్త భద్రత గురించి ఆందోళన చెందుతోందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా బాధితుల పై మీరు కేసులు పెడతారా అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. మీ నాయకత్వంలోని పోలీసు విభాగం ఇలా ప్రవర్తిస్తుంది. ఇది బాధితులను మరింత బలిపశువులను చెయ్యడమేన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం దోషులను అరెస్టు చేయడం తో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • gannavaram
  • kommareddy pattabhi
  • tdp
  • ysrcp

Related News

    Latest News

    • Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్‌

    • Nara Lokesh: రాయలసీమలో రత్నాలు పడేలా చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి నారా లోకేష్

    • AP Jobs: ఏపీ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త

    • Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత.. కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

    • Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd