HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Chandrababu Vijayasai Reddy Photo Political Viral Angle Ap Politics

AP Politics: చంద్రబాబు, విజయసాయిరెడ్డి ఫోటో, రాజకీయ వైరల్ కోణం!

తారకరత్న భౌతిఖాయం సాక్షిగా చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • By CS Rao Published Date - 03:07 PM, Mon - 20 February 23
  • daily-hunt
Chandrababu, Vijayasai Reddy Photo, Political Viral Angle! AP Politics
Chandrababu, Vijayasai Reddy Photo, Political Viral Angle!

తారకరత్న భౌతిఖాయం సాక్షిగా చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసి ఉన్న ఫోటో రాజకీయ (Politics) చర్చకు, వ్యక్తిత్వాల పొలికకు దారి తీసింది. దానికి ఆజ్యం పోస్తూ టాలీవుడ్ నిర్మాత , కాంగ్రెస్ లీడర్ బండ్లగణేష్ ట్వీట్ కామెంట్ చేశారు. అది వైరల్ గా మారడంతో టీడీపీ సోషల్ టీం రంగంలోకి దిగింది. వివరణాత్మక కథనాన్ని , సంఘటనలను గుర్తు చేస్తుంది.

చంద్రబాబు నాయుడుకి సిగ్గులేదా?

ఈ జన్మలో రాదా? అనే నెటీజన్లకు ఇదో పెద్ద న్యూస్. మొన్న వైజాగ్ భూముల విషయంలో, తన కూతురు, అల్లుడి పేరున భూములు కొంటే సర్వే నంబర్లతో సహా మీడియాలో వస్తే.. రామూ అని రామోజీరావును ఏకవచనంతో దూషిస్తూ.. చంద్రబాబును కూడా చేర్చి ఇటీవల చెడమడా
విజయసాయిరెడ్డి తిట్టారు.

చంద్రబాబుకు మతిస్థిమితం లేదనే వరకూ.. లోకేశ్ నూ వదలక వైకాపా చేసిన వ్యక్తిత్వ హననం క్రతువుకు నాయకత్వం వహించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఎక్కడికి వెళ్లినా చుట్టుముట్టే వారందరినీ పలకరించరిడం సరికదా.. అభివాదం చెయ్యడం కూడా నాయుడికి సాధ్యపడనంత జనం. తెలిసిన నాయకులు, అభిమానులు, రాజకీయేతర (Politics) రంగాల ప్రముఖులు చుట్టుముడతారు. అలాంటి నాయుడు సినీ, రాజకీయ (Politics) ప్రముఖులు ఆంధ్రా తెలంగాణా పార్టీ అభిమానులు చివరిచూపు చూడడానికి విపరీతంగా వచ్చిన తారకరత్న ఇంటి వద్ద “అరగంటకు పైగా” విజయసాయిరెడ్డితో మాట్లాడడం పైగా నాయుడి వెంట విజయసాయిరెడ్డి వుండడం చూసి.. చావింట అయినా సరే.. బంధువులు అయినా సరే.. సగటు నాయుడి అభిమానికి మనసులో కలిగే అభిప్రాయం నాయుడుకి సిగ్గులేదా.. ఇక రాదా అనే.అందులో అభిమానుల తప్పులేదు.కానీ నాయుడు ఎందుకిలా మొహం ఇచ్చాడు విజయసాయిరెడ్డికి అనే ఆలోచన రాకమానదు.

నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం.
అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!! pic.twitter.com/ENGbX3oRP5

— BANDLA GANESH. (@ganeshbandla) February 20, 2023

మోసపోయిన వారు, పశ్చాత్తాపంతో శరణు కోరితే, అన్నీ మరిచిపోయి కరిగిపోయే ఔదార్యం నాయుడికి ఉంది.ఆ కోణంలో ఆలోచిస్తే ఎవరు మోసపోయారో, విజయసాయిరెడ్డి కోణం నుండి ఆలోచించాలి. చెన్నైలో అత్యంత కష్టమైన చార్టెడ్ అకౌంటెన్సీ చదువు పూర్తి చేసి, అక్కడే పనిచేసి అనుభవం సంపాయించి, రాజారెడ్డి కాలంలో సంధింటి ఆడిటర్ గా చేరాడు. ఒకసారి మాఫియాలో చేరితే బయటకు రాలేనట్లు సంధింటి పాపపు లెక్కల్లో భాగమై ఏ1 జగన్ రెడ్డి వెన్నంటి ఏ2గా విజయసాయిరెడ్డి కూడా చంచల్ గూడలో జైలుజీవితం గడపాల్సి వచ్చింది. అప్రూవర్ గా మారే అవకాశం వున్నా సంధింటి ఉప్పుతిన్నామనే కృతజ్ఞత, నమ్మకం, ఆయన్ని ఆ పనిచేయించలేదు.

జగన్ వెంట వున్నాడు. ముందుండి సోషల్మీడియా బాధ్యతల నుండి ఢిల్లీ వరకు లాబీయింగ్ చేసి విజయవంతంగా జగన్ రెడ్డికి జనం ఒక్క ఛాన్స్ ఇచ్చేవరకు, మడమతిప్పలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక విజయసాయిరెడ్డిని గట్టిగా ఆలింగనం చేసుకొన్న దృశ్యాలు మనం చూసిందే.జగన్ రెడ్డికి అధికారం వచ్చాక కూడా విజయసాయిరెడ్డి కృతజ్ఞత కొనసాగింది. సంధింటి గొడ్డలిపోట్లను కాపాడడానికి పురమాయించగానే.. సాక్షి ముందుకు వచ్చి గుండెపోటు అని మొదటి సంతాపంను వైకాపా మరియు సంధింటి తరపున వ్యక్తం చేశారు లోకానికి.

వైకాపా ప్లీనరీలో శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా జగన్ను ప్రకటించమని చెబితే, ముఖ్య కార్యదర్శి హోదాలో ప్రకటించి, ఆ తీర్మాణం నెగ్గిందని పార్టీ చేత చప్పట్లు కొట్టించారు.కానీ జగన్ రెడ్డి మారాడో.. వేరే ఎవ్వరైనా మార్చారో.. అప్పటి వరకు రెండో స్థానంలో వున్న విజయసాయిరెడ్డిని దూరంగా ఉత్తరాంధ్రకు పంపారు. ఏ1 జగన్ రెడ్డి ఆర్జనకు పావైన తాను, మళ్లీ శిక్షపడక ముందే వున్న ఏకైక కూతురి కోసం భూములు కొనుగోలు చేశాడు, వారి డబ్బులతో దగ్గరుండి చేశాడు.

మీడియాలో సర్వే నంబర్లతో సహా వచ్చే సరికి విస్తుపోయాడు. కోపం నసాలానికి తాకి, ఆలోచన నశించి నోటికొచ్చింది తిట్టాడు నాయుడిని, రామోజీరావును ,ఆర్కేని.

మళ్లీ స్థిమితంగా ఆలోచించి వుంటాడు కదా. తానొక్కడి భూముల సర్వే నంబర్లు మాత్రమే ఎందుకు వచ్చాయి అని. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పినట్లు, ఎమ్మెల్యేల ఫోన్లతో సహా నిఘా వుంచే తాడేపల్లి హస్తం వుందేమో అనే ఆలోచన రాకుండా మనసును
నియంత్రించుకోవడం కష్టం కదా. దానికి తోడు.. వైజాగ్ లో ప్రధాని మోదీ సభకు జనాన్ని తరలించడానికి రమ్మని, ఆయన ముందు జగన్ వెంట వైజాగ్ లో కనిపించే ఆఖరి అదృష్టం కలిగింది విజయసాయిరెడ్డికి.

అదవ్వంగానే ఉత్తరాంధ్ర ఆధిపత్యం కూడా విజయసాయిరెడ్డికి పీకేసి, వైవీ సుబ్బారెడ్డికి పట్టం కట్టారు. ఒక విధంగా వైజాగ్ నుండి తరిమేశారు.
అక్కడితో ఆగకుండా పార్టీలో ఆయన పాత్రను అనుబంధ సంఘాల సమన్వయ పదవికి కుదించారు. అయినా సహిస్తూ కొన్ని కార్యక్రమాలు చేశాడు. ఆ తరువాత అవీ ఆగిపోయాయి అనేకన్నా సహకారం అందకుండా చేశారు.

ఇసి నుండి పార్టీ శాశ్వత అధ్యక్షుడు ఏంది.. విచారణ చేసి నివేదిక ఇవ్వమని కార్యదర్శిగా విజసాయిరెడ్డిని ఆదేశిస్తే.. ఆయన స్పందించకముందే.. మీడియా ముఖంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఈసీ లేఖపై స్పందిస్తూ.. జగన్ ఒప్పుకోలేదు అని తానే ప్రకటించేశారు.అయినా సాయిరెడ్డి సహించాడు.

సోషల్మీడియా ఇంచార్జ్ గా వున్న విజయసాయిరెడ్డిని పీకేసి, సజ్జల ముద్దుల పుత్రరత్నాన్ని వైకాపా ప్రకటించింది. ఆఖరికి తన ఫోన్ కూడా తాడేపల్లిలో ఇచ్చేసి వెళ్లమన్నారు అనే వార్తలు హల్చల్ చేయంగానే.. జగన్ పురమాయించగానే తన ఫోన్ పోయింది అని ఆంధ్రాలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెళ్లిపోయారు.

మూడు దశాబ్దాలకు పైగా సంధింటి సేవలో అనుభవంచిన దానికంటే వ్యక్తిగత జీవితం కోల్పోయిందే ఎక్కువ. రెండో స్థానం నుండి ఫోన్ కూడా పోగొట్టుకొని పార్టీలో ఏ స్థానమూ లేని పరాభవం. ఆ బాధను కూడా బయటకి వ్యక్తం చెయ్యకుండా.. ట్వీట్లలో బూతులు, కఠిన తిట్లు, శాపనార్థాలు స్థానంలో సౌమ్యత వచ్చి చేరింది. లోకేశ్ పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పడంతో అంతా
ఆశ్చర్యపోయారు.

ఎక్కడ ఎవరు ఎదురుపడ్డా.. శత్రువునైనా నాయుడు పలకరిస్తాడు లేదా అభివాదానికి స్పందించి తిరిగి అభివాదం చేస్తాడు. ఇందులో బేషజాలకు పోరు. కానీ కానివారితో రాసుకుపూసుకు మాట్లాడరు.

విజయసాయిరెడ్డితో అరగంటకు పైగా సిగ్గులేకుండా మాట్లాడలేదు. బాలయ్యకు కృతజ్ఞతలు చెబుతూ మీడియా ముఖంగా అంతకుముందు కొన్ని రోజులకు ముందే మాట్లాడారు. నేరుగా ఫోన్ చేసి చెప్పవచ్చు గానీ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చెప్పారు. ఇప్పుడు కూడా అందరికీ & తెలవాల్సిన వారికి తేలిసేలా నాయుడితో మాట్లాడడమే కాకుండా వెంట తిరుగుతూ తెలిసేలా చేశాడు.

వైఎస్సార్ నీడ సూరీడు లెక్కన
వైఎస్సార్ ఆత్మ కెవిపి లెక్కన

జగన్ వెంట నమ్మి నిలిచి జీవితాన్ని దారపోసిన రెండో వ్యక్తిగా జరిగిన ద్రోహం గురించి కరివేపాకు అయినామనే కల్లోల అంతరంగంలో చెలరేగిన ఘర్షణలో.. పావుగా మారి చేసిన పాపాలకు పశ్చత్తాపంతో కొంత కొంత బయటపడుతున్నాడు విజయసాయిరెడ్డి.

ఆయన తన మనసు భారాన్ని దింపుతూ ముందే ఫోన్లో మాట్లాడి, ఇప్పుడు బాహాటంగా మాట్లాడడానికి వైకాపా నుండి సాహసించి వుండవచ్చు. జాలితో నాయుడు కూడా విని అర్థం చేసుకొని వుండవచ్చు, జనం కోసం.

తనకు తానే కూలబోతున్న జగన్ విషయంలో బాహాటంగా ఏమీ వ్యతిరేకంగా చేయకపోయినా విజయసాయిరెడ్డి తన భద్రత చూసుకొంటూ జాగ్రత్తగా అడుగులు వెయ్యడం మంచిదని సోషల్ మీడియా వేదికగా బాబు అభిమానులు సలహాలు ఇస్తున్నారు.

Also Read:  Delivery Agent: ఐఫోన్ కి డబ్బులు లేవని డెలివరీ ఏజెంట్ ని చంపేసిన ఓ వ్యక్తి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • Chandra Babu Naidu
  • politics
  • Vijaya Sai Reddy
  • viral

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • Cable Bridge

    Cable Bridge: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి!

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • Nara Lokesh

    Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd