Chandrababu Protest: కుప్పంలో రోడ్డుపై చంద్రబాబు బైఠాయింపు, హై టెన్షన్
టీడీపీ చీఫ్ చంద్రబాబు వైసీపీ దాష్టీకాన్ని నిరసిస్తూ రోడ్డు మీద భైటాయించారు. బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన ప్లేస్ వద్ద చంద్రబాబు నిరసనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
- By CS Rao Published Date - 12:32 PM, Thu - 25 August 22
టీడీపీ చీఫ్ చంద్రబాబు వైసీపీ దాష్టీకాన్ని నిరసిస్తూ రోడ్డు మీద భైటాయించారు. బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన ప్లేస్ వద్ద చంద్రబాబు నిరసనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్తలంతా కుప్పంకు చేరుకోవాలని రెండు పార్టీలు వాట్సాప్ ద్వారా సందేశాలను పంపుతున్నాయి. పరిస్థితిని జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు
కుప్పంలో టీడీపీ నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ వద్దకు వెళ్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాళ్లు వేసేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నం చేశారు. బస్టాండ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ పై వైసీపీ దాడులను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు నాయుడు ధర్నాకు దిగడంతో హై టెన్షన్ నెలకొంది.
జగన్ రెడ్డి కుప్పంలో ఎన్ని కుప్పి గంతులు వేసినా చివరికి భంగపాటు తప్పదు. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఆయన పేదవాళ్లకు అన్నం పెట్టడు ఇతరులను పెట్టనివ్వడు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల పై వైసిపి మూకలు దాడులు చేస్తూనే ఉన్నారు.(1/2) pic.twitter.com/2cEp3UzSvs
— Lokesh Nara (@naralokesh) August 25, 2022
మూడు రోజులు కుప్పం పర్యటన కోసం వెళ్లిన టీడీపీ అధినేత పర్యటన ఆద్యంతమూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. కుప్పం బంద్ కు వైసీపీ పిలుపునివ్వడంతో… వ్యాపారులు దుకాణాలను మూసేశారు. ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పలు చోట్ల బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
గూండాల మార్గంలో మీరు..
గాంధేయ మార్గంలో మేము..ఫ్యూడల్, ఫ్యాక్షనిజం బాటలో మీరు..
ప్రజాస్వామ్య పద్ధతిలో మేము..రాజారెడ్డి రాజ్యాంగంతో మీరు..
అంబేద్కర్ రాజ్యాంగంతో మేము..తమకు, సమాజానికి, తమ భావితరాలకు ఏది శ్రేయస్కరమో, ఎవరు అవసరమో ప్రజలే తేల్చుకుంటారు. (1/2) pic.twitter.com/a5y5v7xMMZ
— Telugu Desam Party (@JaiTDP) August 25, 2022
Related News
YS Sharmila : జగన్తో షర్మిల మళ్లీ పోరాటం..!
ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిల తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం దాడులు చేస్తూనే, అకృత్యాలను బయటపెడుతూనే ఉన్నారు.