HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Naidu Offers Prayers At Tirupati Temple Before Assuming Charge

CBN : తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా – సీఎం చంద్రబాబు

తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తా

  • By Sudheer Published Date - 01:19 PM, Thu - 13 June 24
  • daily-hunt
Babu Tirumala
Babu Tirumala

తిరుమల (Tirumala) నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా.. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తా.. అని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు (AP CM Chandrababu). బుధువారం ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు..నిన్న సాయంత్రం తిరుమలకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసిన ఆయన…ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకి ఇస్తికఫాల్ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు.

అనంతరం ఆయన అక్కడే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. తమది దేశ చరిత్రలోనే చరిత్రత్మక విజయమని.. 93 శాతం స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చామని.. ఈ క్రమంలోనే శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నానని బాబు తెలిపారు. అలాగే గతంలో అలిపిరిలో తనపై జరిగిన దాడిలో నన్ను వెంకటేశ్వర స్వామి బతికించారని గుర్తు చేసుకున్నారు. ఏ పని చేసినా వెంకన్న సంకల్పంతోనే చేస్తానని..తాను రాష్ట్రానికి ఇంకా ఏదో చేయాల్సి ఉంది కాబట్టే ఆ రోజు నన్ను దేవుడు కాపాడారని అన్నారు. ఏపీ రాష్ట్రం మొత్తం శ్రీవారి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవారికి వెళ్లడం కూడా అంతే ముఖ్యమని సీఎం అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రజా పాలన ప్రారంభమైంది. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కావాలి. ప్రసాదాలు, తిరుమల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యం. అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలూ మమేకం కావాలి. నష్టపోయిన, ఇబ్బంది పడిన వర్గాలను ఆదుకోవాలి. రాజధాని అమరావతి, పోలవరం పడకేశాయి.. వాటిని పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. కక్ష సాధింపులు ఉండవు. తితిదేను ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతాం. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం” అని చంద్రబాబు అన్నారు.

ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో చంద్రబాబు.. తనదైన మార్క్ చూపించారు. ఎక్కడా పంతాలు, పట్టింపులకు పోకుండా గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను కంటిన్యూ చేయడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా.. మాజీ సీఎం జగన్ ఫొటో ఉన్నా సరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయవద్దని ఆదేశించారు. కాగా.. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ భవనాలకు అప్పటి ప్రభుత్వం పార్టీ రంగులు వేయించి నానా హడావుడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ బాబు మాత్రం ఆలా చేయద్దంటూ సూచించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం.

తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తా. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదు. తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుంది. తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దు. గత ఐదేళ్లలో తిరుమలను… pic.twitter.com/64HEl8M7Gj

— Telugu Desam Party (@JaiTDP) June 13, 2024

Read Also : Garlic Benefits: వెల్లుల్లి తింటే ఈ సమస్యలన్నీ దూరం..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • tirumala

Related News

Auto Driver Scheme

Auto Drivers : ఆటో, క్యాబ్ డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 వేలు జమ చేయనున్నారు.!

Auto Drivers Scheme అక్టోబర్ 4వ తేదీన ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా అర్హత గల ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందుకోనున్నారు. చంద్రబాబు  కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు కారణంగా ఇబ్బంది పడకూడదని క్యాబ్, ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.   Andhra Pradesh  మొత్తం లబ్దిదారుల ఖాతాల్లో రూ.435

  • Modi Abn

    CBN – Delhi : అమిత్ షాతో చంద్రబాబు భేటీ

  • CM Chandrababu

    AP Govt : చిన్న కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

  • Ap Gst

    GST : GST లాభాలపై రాష్ట్రవ్యాప్త ప్రచారం – సీఎం చంద్రబాబు

  • Ntr Bharosa Pension Scheme

    AP Govt : పెన్షన్ల పంపిణీకి రూ. 2745 కోట్లు విడుదల

Latest News

  • Rohit- Kohli: అంతర్జాతీయ క్రికెట్‌కు రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ కోహ్లీ, రోహిత్!

  • Shoaib Malik: మూడో భార్య‌కు కూడా విడాకులు?!

  • Record Liquor Sales: రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు!

  • AP Inter Schedule: ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు!

  • Sleep Deprivation Heart Risk: మీరు స‌క్ర‌మంగా నిద్ర పోవ‌టంలేదా? అయితే గుండెపోటుకు దగ్గరగా ఉన్న‌ట్లే!

Trending News

    • Gold Jewellery: ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవ‌చ్చు?

    • New Cheque System: చెక్ క్లియరెన్స్‌లో కీల‌క మార్పులు.. ఇకపై కొన్ని గంటల్లోనే డ‌బ్బులు!

    • KL Rahul Hundred: కేఎల్ రాహుల్ సెంచ‌రీ.. భార్య సెలబ్రేషన్ వైర‌ల్‌!

    • Social Media: ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. సోష‌ల్ మీడియాపై మంత్రుల‌తో క‌మిటీ!

    • Youngest Billionaire: భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ ఇత‌నే.. సంపాద‌న ఎంతంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd