HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Naidu Meeting In Tuni

TDP : వైసీపీ నేతలు మెక్కిందంతా కక్కిస్తాం.. తుని రా.. కదలి రా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు

జగన్ సినిమా అయిపోయిందని మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడూ కూడా గెలిచే పరిస్దితి లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా

  • Author : Prasad Date : 11-01-2024 - 6:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

జగన్ సినిమా అయిపోయిందని మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడూ కూడా గెలిచే పరిస్దితి లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి తూ.గో జిల్లా తునిలో నిర్వహించిన రా.. కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నీతి నిజాయితీ మంచితనానికి మారుపేరు తూ.గో జిల్లా అని.. రాష్ట్రంలో రాజకీయం మారిందనేదానికి ఈ తుని సభే సాక్ష్యమ‌న్నారు. మరో 3 నెలల తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయమ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారని.. అహంకారం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడ‌న్నారు. జగన్ రెడ్డి అహంకారమే అతని అంతానికి దారి తీసే పరిస్ధితి నెలకొందని.. ఎన్నికల ముందు మీ కాళ్లు పట్టుకుని ఒక్క చాన్స్ అన్న జగన్ రెడ్డి నేడు పిడిగుద్దులు గుద్దుతున్నాడ‌ని ఆరోపించారు. ఊర్లు, ఊర్లు ఏకమై వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుదంతో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. జగన్ రెడ్ది రాతియుగం పోయి తెలుగుదేశం జనసేన స్వర్ణయుగం తెలుగుజాతికి రావాలని నూతన సంవత్సరంలో సంకల్పించాన‌న్నారు. వచ్చే ఎన్నికలు అహంభావంతో విర్రవీగుతున్న జగన్ కి 5 కోట్ల మందికి జరుగుతున్న పోరాటం. ఈ ఎన్నికల్లో సైకో జగన్ ని ఓడించి రాష్ట్రాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

5 ఏళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు గానీ నిత్యావసర ధరలు అన్నీ పెరిగాయన్నారు. టీడీపీ హయాంలో రూ. 70 ఉన్న పెట్రోల్ నేడు రూ. 110కి పెరిగిందని.. డీజిల్ రూ. 70 నుంచి రూ. 99 కి పెరిగిందన్నారు.నిత్యవసర ధరలు మండిపోతుంటే ప్రజలు పండుగ చేసుకునే పరిస్ధితిలో లేరన్నారు. సంక్షేమం, అభివృద్దితో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది టీడీపీనేన‌ని.. పేదల్ని ఆదుకునే బాధ్యత త‌న‌దేన‌న్నారు. అన్న క్యాంటీన్లు మళ్లీ ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చుతామ‌ని… టీటీడీలో కూడా భక్తులకు నాసిరకం భోజనం పెట్టడం దుర్మార్గమైన చ‌ర్య అని తెలిపారు. త్వరలోనే పేదల ప్రభుత్వం, రైతు రాజ్యం వస్తుందని భ‌రోసా ఇచ్చారు. వచ్చే సంక్రాంతికి ప్రజల ముఖాల్లో వెలుగులు నింపుతామ‌ని.. మహాశక్తి పథ‌కం కింద మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తామ‌ని తెల‌పారు. అమ్మకు వందనం కింద ఎంత మంది విద్యార్దులున్నా.. ఒక్కొక్కరికీ ఏడాదికి రూ. 15 వేలిస్తామ‌ని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామ‌ని.. ఆటోడ్రైవర్లు అధైర్యపడొద్దని..వారిని కూడా ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామ‌ని.. యువత ప్రజల్ని చైతన్యం చేయాలన్నారు. అన్నధాత పథ‌కం కింద రైతులకు ఏడాదికి రూ. 20 వేలిస్తామ‌ని తెలిపారు. ఆక్వా రైతుల్ని ఆదుకుంటాం. వైసీపీ పాలనలో ఆక్వా రైతులు, రైతులు చితికిపోయారని.. రైతులు, కౌలు రైతులు అన్ని విధాల ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

Also Read:  TDP vs YCP : ఎంపీ కేశినేని నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్‌.. ఎంపీ పదవికోసం ఇంతగా దిగజారాలా..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • chandrababu naidu
  • tdp

Related News

Egg prices soar, burden on the nutritional needs of the common man

కోడిగుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి పౌష్టికాహారంపై భారం

ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 మధ్య లభించిన ఒక్కో గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కి చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో అయితే ఒక్క గుడ్డు ధర రూ.7.30కు మించి ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.

  • CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

    రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

  • Btechravi

    జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత

Latest News

  • ప్ర‌ధాని రేసులో సీఎం చంద్ర‌బాబు?!

  • టెస్ట్ క్రికెట్‌కు విలియ‌మ్స‌న్‌ రిటైర్మెంట్?!

  • కొత్త పథకాలను ప్రవేశ పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు

  • పిల్లలతో అలాంటి పనులేంటి జగన్ – మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

  • ‘పదేళ్ల పాలనకు స్వస్తి చెప్పి ప్రజలు మీ తోలు తీశారు’ అంటూ కేసీఆర్ పై పొన్నం ఫైర్

Trending News

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

    • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd