Babu@Kuppam: బాబు కుప్పం పర్యటన ఉద్రిక్తం, పోలీసుల లాఠీ ఛార్జ్
చంద్రబాబు పర్యటన వేళ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొల్లుపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. బాబు పర్యటించే ప్రాంతాల్లో అధికార పార్టీ కార్యకర్తలు వైకాపా జెండాలు, తోరణాలు కట్టారు.
- By CS Rao Published Date - 08:41 PM, Wed - 24 August 22
చంద్రబాబు పర్యటన వేళ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొల్లుపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. బాబు పర్యటించే ప్రాంతాల్లో అధికార పార్టీ కార్యకర్తలు వైకాపా జెండాలు, తోరణాలు కట్టారు. దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. ఫలితంగా ఇరుపార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు రాళ్ల దాడికి దిగారు. ఇందులో బోదుగూరు ఎస్సైకి, టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుప్పం నియోజకవర్గం పర్యటనలో భాగంగా బుధవారం రామకుప్పం మండలం కొల్లుపల్లిలో చంద్రబాబు పర్యటించారు. ఆయన పర్యటించే మార్గంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన తోరణాలకు ఆనుకొని వైసీపీ జెండా తోరణాలు కట్టారు. వైసీపీ తోరణాలను తొలగించేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు డౌన్ డౌన్ సీఎం అంటూ ముందుకు రాగా ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పాటు కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
వైసీపీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో వారికే తెలియదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన వైసీపీని ప్రజలు తరిమే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరి పింఛన్లు తొలగించలేదన్నారు. గండికోట జలాశయం ద్వారా పులివెందులకు నీళ్లు తానే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. వైసీపీ నేతలకు కుప్పం నియోజకవర్గం అంటే కక్ష అని మండిపడ్డారు. కుప్పంలో చోటామోటా నాయకులు రౌడీయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వానికి కుప్పం అంటే కక్ష అని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. హంద్రీనీవా ద్వారా వీ.కోట వరకు నీరు తెస్తే కుప్పం వరకు నీరివ్వలేక పోయారని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో చేసిన పనులు తప్ప ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కుప్పంలో చోటామోటా నాయకులు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. ‘‘నేనొస్తే ఎక్కడికక్కడ మీ జెండాలు కడతారా?. ఇకనైనా మీ చిల్లర చేష్టలు మానుకోండి. వైసీపీ దొంగలు జాగ్రత్త..నేనొస్తే మీ తోకలు కట్ చేస్తా. పోలీసులు మీ పని మీరు చేసుకోండి. ఎవరిపై పడితే వారిపై తప్పుడు కేసులు పెడతారా?. ఎఫ్ఐఆర్ అంటే మీ జాగీరనుకున్నారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
వైసిపి రౌడీల తోకలు కత్తిరిస్తా – @ncbn#CBNInKuppam#JaganPaniAyipoyindhi pic.twitter.com/yNFFUymusV
— Telugu Desam Party (@JaiTDP) August 24, 2022
Related News
AP Politics : వైసీపీకి సంక్షోభం తప్పదా..?
ఏపీలో ఎన్నికల జోరు పెరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికల ఎంతో ప్రాధాన్యత ఉంది. అధికార వైసీపీ పాలనను గద్దె దించేందుకు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది.