HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Center Orders 8 More Ias Officers For Ap

IAS Officers : ఏపీకి మరో 8 మంది ఐఏఎస్ లు కేంద్రం ఆదేశాలు.!

  • Author : Vamsi Chowdary Korata Date : 09-12-2025 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ias
Ias

ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు మరో 8 మంది ఐఏఎస్ అధికారులను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారికంగా లేఖ రాసింది. కాగా, ఈ కొత్త అధికారుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినవారితో పాటు ఇతర రాష్ట్రాలవారు కూడా ఉన్నారు. ఏపీతో పాటు వివిధ క్యాడర్లకు 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్లను కేటాయించింది కేంద్రం.

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన సౌలభ్యం మెరుగుపర్చడానికి, ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి మరో 8 మంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారులను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు కేంద్రం అధికారికంగా లేఖ రాసింది. ఈ కొత్త అధికారులంతా 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు. ఏపీతో పాటు 2024 బ్యాచ్‌కు ఎంపికైన అధికారులను వివిధ రాష్ట్రాల క్యాడర్లకు కేటాయించింది.

ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించిన 8 మంది అధికారుల్లో బన్నా వెంకటేష్, ఏఆర్ పవన్ తేజ (ఆంధ్రప్రదేశ్), కే ఆదిత్య శర్మ, చింతకింది శ్రవణ్ కుమార్ రెడ్డి (తెలంగాణ), హరి ఓం పాండియా (రాజస్థాన్), నమ్రతా అగర్వాల్ (హర్యానా), ప్రియ (ఢిల్లీ), సుయశ్ కుమార్ (ఉత్తర్‌ప్రదేశ్) ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారులను ఇతర రాష్ట్రాల క్యాడర్లకు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో చెన్నం రెడ్డి శివగణేష్ రెడ్డిని ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, యూనియన్ టెర్రిటరీస్) క్యాడర్‌కు, పీ సురేష్‌ను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించింది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 సైకిల్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శక్తి దుబే ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఆమెకు తన సొంత రాష్ట్ర క్యాడర్ కేటాయించారు. ఇక హర్యానాకు చెందిన రెండో ర్యాంక‌ర్‌ హర్షిత గోయల్‌ను గుజరాత్ క్యాడ‌ర్‌కు, మహారాష్ట్రకు చెందిన మూడో ర్యాంక‌ర్ డోంగ్రే అర్చిత్ పరాగ్‌ను క‌ర్ణాట‌క క్యాడ‌ర్‌కు కేటాయించారు. నాలుగో ర్యాంక‌ర్ షా మార్గి చిరాగ్ (గుజ‌రాత్‌), ఐదో ర్యాంక‌ర్ ఆకాష్ గార్గ్ (ఢిల్లీ)కు తమ రాష్ట్రాల క్యాడర్లు దక్కాయి. కాగా, టాప్ పది మంది ర్యాంకర్లలో ఆరుగురికి తమ సొంత రాష్ట్ర కేడర్ కేటాయించడం గమనార్హం.

కాగా, 2024 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో సైకిల్‌లో మహిళలు అదరగొట్టారు. 2025 ఏప్రిల్‌లో వెల్లడైన ఫలితాల్లో 1,009 మంది అభ్యర్థులు వివిధ స‌ర్వీసుల‌కు ఎంపిక‌య్యారు. వీరీలో 725 మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. అయితే టాప్ 25 ర్యాంకర్లలో 11 మంది మహిళలే ఇండటం గమనార్హం. ఇక టాప్ 5‌లో ర్యాంక‌ర్లలో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్నారు. కాగా, దేశంలో అత్యంత క్లిష్టమైన ప‌రీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఒక‌టి. ఏటా లక్షల మంది ఈ పరీక్షలకు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh cadre
  • Andhrapradesh
  • Centre Allocated
  • IAS Officers

Related News

Featherlight

Featherlight : విజయవాడలో ‘ఫెదర్‌లైట్’ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను ప్రారంభం

రాజధాని ప్రాంతంలోని వ్యాపారవేత్తలు, వాస్తుశిల్పులు (Architects) మరియు ప్రభుత్వ రంగ ప్రతినిధులకు అత్యుత్తమ సేవలందించడమే తమ లక్ష్యమని ఫెదర్‌లైట్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీ కిరణ్ ధీరేన్ చెల్లారం తెలిపారు

  • Manufacture Of Fighter Airc

    DRDO : పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ.. !

  • Pawancbn1

    Pawankalyan : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో చూడండి !!

  • amaravati farmers land allotment

    Amaravati : అమరావతి రైతులకు గొప్ప శుభవార్త..

  • Andhra Paper Mill Lokout

    Rajahmundry: రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్..

Latest News

  • Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

  • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

  • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

  • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

  • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

Trending News

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd