HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Center Orders 8 More Ias Officers For Ap

IAS Officers : ఏపీకి మరో 8 మంది ఐఏఎస్ లు కేంద్రం ఆదేశాలు.!

  • Author : Vamsi Chowdary Korata Date : 09-12-2025 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ias
Ias

ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు మరో 8 మంది ఐఏఎస్ అధికారులను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారికంగా లేఖ రాసింది. కాగా, ఈ కొత్త అధికారుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినవారితో పాటు ఇతర రాష్ట్రాలవారు కూడా ఉన్నారు. ఏపీతో పాటు వివిధ క్యాడర్లకు 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్లను కేటాయించింది కేంద్రం.

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన సౌలభ్యం మెరుగుపర్చడానికి, ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి మరో 8 మంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారులను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు కేంద్రం అధికారికంగా లేఖ రాసింది. ఈ కొత్త అధికారులంతా 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు. ఏపీతో పాటు 2024 బ్యాచ్‌కు ఎంపికైన అధికారులను వివిధ రాష్ట్రాల క్యాడర్లకు కేటాయించింది.

ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించిన 8 మంది అధికారుల్లో బన్నా వెంకటేష్, ఏఆర్ పవన్ తేజ (ఆంధ్రప్రదేశ్), కే ఆదిత్య శర్మ, చింతకింది శ్రవణ్ కుమార్ రెడ్డి (తెలంగాణ), హరి ఓం పాండియా (రాజస్థాన్), నమ్రతా అగర్వాల్ (హర్యానా), ప్రియ (ఢిల్లీ), సుయశ్ కుమార్ (ఉత్తర్‌ప్రదేశ్) ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారులను ఇతర రాష్ట్రాల క్యాడర్లకు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో చెన్నం రెడ్డి శివగణేష్ రెడ్డిని ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, యూనియన్ టెర్రిటరీస్) క్యాడర్‌కు, పీ సురేష్‌ను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించింది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 సైకిల్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శక్తి దుబే ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఆమెకు తన సొంత రాష్ట్ర క్యాడర్ కేటాయించారు. ఇక హర్యానాకు చెందిన రెండో ర్యాంక‌ర్‌ హర్షిత గోయల్‌ను గుజరాత్ క్యాడ‌ర్‌కు, మహారాష్ట్రకు చెందిన మూడో ర్యాంక‌ర్ డోంగ్రే అర్చిత్ పరాగ్‌ను క‌ర్ణాట‌క క్యాడ‌ర్‌కు కేటాయించారు. నాలుగో ర్యాంక‌ర్ షా మార్గి చిరాగ్ (గుజ‌రాత్‌), ఐదో ర్యాంక‌ర్ ఆకాష్ గార్గ్ (ఢిల్లీ)కు తమ రాష్ట్రాల క్యాడర్లు దక్కాయి. కాగా, టాప్ పది మంది ర్యాంకర్లలో ఆరుగురికి తమ సొంత రాష్ట్ర కేడర్ కేటాయించడం గమనార్హం.

కాగా, 2024 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో సైకిల్‌లో మహిళలు అదరగొట్టారు. 2025 ఏప్రిల్‌లో వెల్లడైన ఫలితాల్లో 1,009 మంది అభ్యర్థులు వివిధ స‌ర్వీసుల‌కు ఎంపిక‌య్యారు. వీరీలో 725 మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. అయితే టాప్ 25 ర్యాంకర్లలో 11 మంది మహిళలే ఇండటం గమనార్హం. ఇక టాప్ 5‌లో ర్యాంక‌ర్లలో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్నారు. కాగా, దేశంలో అత్యంత క్లిష్టమైన ప‌రీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఒక‌టి. ఏటా లక్షల మంది ఈ పరీక్షలకు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh cadre
  • Andhrapradesh
  • Centre Allocated
  • IAS Officers

Related News

Farmers

Farmers : పెట్రల్, డీజిల్‌తో పని లేకుండా..ఆ యంత్రంతో ఆరు పనులు రైతులకు గుడ్ న్యూస్!

రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు రీగ్రో అనే సంస్థ ఓ కొత్త యంత్రాన్ని తీసుకువచ్చింది. క్రాప్ సిక్సర్ పేరుతో ఓ కొత్త యంత్రం రూపొందించింది. ఈ యంత్రం సాయంతో ఆరు రకాల వ్యవసాయ పనులు చేసుకోవచ్చు, పైగా పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. విశాఖలో జరిగిన ఆర్గానిక్ మేళా కార్యక్రమంలో దీనిని ప్రదర్శించారు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ క్రాప్ సిక్సర్ తోడుంటే.. రైతులను సహాయకారిగా ఉంటుందని అధికారుల

  • Chandrababu

    Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదురోజుల దావోస్‌ టూర్!

  • Sabrimala Temple

    Sabrimala Temple: శ‌బరిమల ఆలయంలో భక్తులపై దాడి!

  • MLA Yarlagadda

    MLA Yarlagadda: యువ‌కుడ్ని ఆపదలో ఆదుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ.. ఏం చేశారంటే?

  • Mopidevi Subramanyeswara Sw

    Mopidevi Subrahmanyeshwara Swamy Temple : 50 కిలోల వెండితో పానపట్టం..మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హైదరాబాద్ భక్తుడి విరాళం

Latest News

  • Indigo Crisis: ఇండిగో సంక్షోభం.. దేశవాళీ క్రికెట్ సీజన్‌పై తీవ్ర ప్రభావం!

  • Deputy CM Bhatti: పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడు కావాలి: డిప్యూటీ సీఎం భ‌ట్టి

  • Sonia Gandhi : స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారు – రేవంత్

  • TVK Meeting : విజయ్ సభకు తుపాకీతో వచ్చిన వ్యక్తి!

  • IAS Officers : ఏపీకి మరో 8 మంది ఐఏఎస్ లు కేంద్రం ఆదేశాలు.!

Trending News

    • Aadhaar Card: ఆధార్ కార్డుపై కీలక అప్‌డేట్.. ఇక‌పై అలా చేస్తే!!

    • Rithu Chowdary: రీతూ చౌదరి రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    • CM Revanth Reddy: తెలంగాణ ఎదుగుదలను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు: సీఎం రేవంత్

    • Top Google Searches: గూగుల్ సెర్చ్ 2025.. భారత్‌లో వైభవ్ సూర్యవంశీ, పాకిస్తాన్‌లో అభిషేక్ శర్మ హవా!

    • JioHotstar: జియోహాట్‌స్టార్ నుండి ఐసీసీకి భారీ షాక్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd