CBN : మదమెక్కి, కొవ్వెక్కిన ఉన్మాది, సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి : చంద్రబాబు
కొవ్వెక్కి , మదమెక్కి, సైకో గా జగన్మోహన్ రెడ్డి వ్యవహరింస్తున్నారని చంద్రబాబు(CBN)మండిపడ్డారు.
- By CS Rao Published Date - 05:56 PM, Thu - 9 February 23
కొవ్వెక్కి , మదమెక్కి, సైకో మాదిరిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరింస్తున్నారని చంద్రబాబు(CBN) మండిపడ్డారు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసి సిగ్గులేకుండా బరితెగించిపోయాడని ఆగ్రహించారు. ఏపీ రాష్ట్రానికి రాజధాని(Capital) అమరావతి, పోలవరం రెండు కళ్లు. వాటిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైకో మాదిరిగా పొడిచేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. గత రెండేళ్లుగా అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టీకాలను మీడియాముఖంగా వివరించారు. రాజధాని అమరావతిని మార్చడానికి చట్టాలు ఒప్పుకోవని తెలిసి కూడా సీఎం డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం చేసిన విభజన చట్టాన్ని కాదని రాజధాని అమరావతిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. మూడు రాజధానులు ఎలా పెడతారని ప్రశ్నించారు. అమరావతి ప్రాజెక్టు కోల్పోవడం కారణంగా లక్షల కోట్ల రూపాయాలను నష్టపోయామని ఆవేదన చెందారు.
సైకో మాదిరిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరింస్తున్నారని చంద్రబాబు(CBN)
కార్పొరేట్ లాబీయింగ్ కోసం పరిమళ నత్వానికి రాజ్యసభ ను జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని చంద్రబాబు(CBN) ఆరోపించారు. తెలంగాణకు చెందిన అడ్వకేట్ గా ఉన్న పెద్ద బ్రోకర్ నిరంజన్ రెడ్డికి రాజ్యసభ ఇవ్వడం ఏమిటిని ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలను ఉద్ధరించే వాళ్లు ఎవరూ లేనట్టు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ ఇచ్చారని విమర్శించారు. చట్టం మంటే భయంలేదు, రాజ్యాంగం అంటే గౌరవంలేని సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. విభజన చట్టం కారణంగా ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం కంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత జరిగిన నష్టం అపారంగా ఉందని అన్నారు.
చట్ట ప్రకారం విశాఖ రాజధాని రాదని తెలిసి కూడా డ్రామాలు
బోస్టన్ కమిటీ, జీఎన్ రావ్ కమిటీ అంటూ రాజధానిపై ఒక కమిటీని వేసి చట్టాన్ని ఉల్లంఘించారని చంద్రబాబు ఆరోపించారు. సైకో చేతుల్లోకి వెళ్లిన ఏపీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు చైతన్య వంతులుగా మారాలని కోరారు. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, ఇప్పుడు ఇంకా జరుగుతుందని ఆవేదన చెందారు. ప్రతిపక్షం, మేధావులు చెప్పినా వినకుండా ఇష్టానుసారం ధ్వంసం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి(Capital) రాజధానికి నిధులను ఇచ్చారు. వాటితో నిర్మాణాలను చేపట్టారు. ప్రస్తుతం వాటిలోనే పాలన సాగిస్తున్నారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మరవద్దని చంద్రబాబు అన్నారు. చట్ట ప్రకారం విశాఖ రాజధాని రాదని తెలిసి కూడా డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమకెత్తారు.
Also Read : CBN-PM : మోడీ విజన్ 2040కి చంద్రబాబు సహకారం! PMO నుంచి సంకేతాలు!
కేంద్ర ప్రభుత్వం మినహా రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని(Capital) మార్చే అధికారం లేదని చంద్రబాబు వివరించారు. మదం, గర్వంతో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు. సైకోలాగా వ్యవహరిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తం కావాలని కోరారు. లేదంటే, రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని అన్నారు. పైరవీల కోసం రాజ్యసభలను అమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధిగా పనికిరాడని చంద్రబాబు అన్నారు. బెదిరిండం, కేసులు పెట్టడం, పైరవీలు , ధ్వంసం చేయడం మాత్రమే వైసీపీ కి తెలుసన్నారు. రాజకీయాలకు అర్హతలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అలాగే వైసీపీని నిషేధించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపు నిచ్చారు.
Also Read : CBN Giotag : జగన్ ఎత్తుగడకు టెక్నాలజీతో చెక్ పెట్టేలా చంద్రబాబు చతురత
నిఘాధిపతి సీతారామాంజనేయులు, ఇతర ఐపీఎస్ అధికారులు ఎలా ఉన్నారో తెలుసని చంద్రబాబు అన్నారు. అమరావతిలో గుప్పిగంతులు వేసిన విధంగా బాబాయ్ మర్డర్ కేసులో గుప్పిగంతులు వేసిన జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి అనర్హుడని చంద్రబాబు(CBN) అన్నారు. ప్రశాంతంగా జరుగుతోన్న పాదయాత్రను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
Related News
Pawan Kalyan : ఆమె కోసం చంద్రబాబుని సహాయం అడిగిన పవన్.. నిర్మాత కామెంట్స్..
ఆమె కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి చంద్రబాబుని సహాయం అడిగారు. తాజా ఇంటర్వ్యూలో నిర్మాత ఆసక్తికర కామెంట్స్..