HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cbn Pm Chandrababus Contribution To Modis Vision 2040 Signals From Pmo

CBN-PM : మోడీ విజ‌న్ 2040కి చంద్ర‌బాబు స‌హ‌కారం! PMO నుంచి సంకేతాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విజ‌న్ 2040 (CBN-PM)దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు.

  • By CS Rao Published Date - 03:54 PM, Thu - 2 February 23
  • daily-hunt
CBN-PM
Modi Babu

విజ‌న్ త‌యారు చేయ‌డం, దాని ప్ర‌కారం అభివృద్ధికి పునాదులు వేయ‌డం భ‌విష్య‌త్ గురించి ఆలోచించే లీడ‌ర్లు చేసే ప‌ని. ఆ దిశ‌గా అడుగులు వేసిన తొలి సీఎం చంద్ర‌బాబునాయుడు. ఆ త‌రువాత గుజ‌రాత్ సీఎంగా ప‌నిచేసిన మోడీ పేరు తెర‌పైకి వ‌స్తోంది. ఇప్పుడు ప్ర‌ధాన మంత్రిగా ఉన్న న‌రేంద్ర మోడీ విజ‌న్ 2040 (CBN-PM)దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు. దాన్ని త‌యారు చేయ‌డానికి నిపుణుల‌తో పాటు విజ‌న్(Vision) ఉన్న నాయ‌కుల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటున్నారు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విజ‌న్ 2040 (CBN-PM)

దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక‌, వ్య‌వ‌సాయం, టెక్నాల‌జీ త‌దిత‌ర రంగాల్లోని నిపుణుల స‌ల‌హాల‌ను తీసుకుంటున్నారు. వాటిని క్రోడీక‌రించ‌డం ద్వారా విజ‌న్ 2040ను(CBN-PM) రూప‌క‌ల్ప‌న చేయ‌డానికి నిష్ణాతుల‌ను మోడీ నియ‌మించార‌ని తెలుస్తోంది. ఆ టీమ్ అవ‌స‌ర‌మైన ఇన్ ఫుట్స్ ఇవ్వ‌డానికి దేశంలోని కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల పేర్ల‌ను ప్ర‌ధాని సూచించార‌ని తెలుస్తోంది. ఆ జాబితాలో చంద్ర‌బాబునాయుడు ఉన్నార‌ని పీఎంవో వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. విజ‌న‌రీగా పేరున్న చంద్ర‌బాబు ఇచ్చే విలువైన స‌మాచారాన్ని తీసుకోవాల‌ని సూచించారట‌. ఆ మేర‌కు మోడీ అనుచ‌రులు, పీఎంవో వ‌ర్గాల నుంచి టీడీపీ చీఫ్ కు సందేశం అందింద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

Also Read : CBN Giotag : జ‌గ‌న్ ఎత్తుగ‌డ‌కు టెక్నాల‌జీతో చెక్ పెట్టేలా చంద్ర‌బాబు చ‌తుర‌త‌

ఉమ్మ‌డి ఏపీ సీఎంగా చంద్ర‌బాబునాయుడు విజ‌న్ 2020ని త‌యారు చేయించారు. ఆయ‌న సీఎంగా రెండోసారి 1999లో బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత విజ‌న్ దిశ‌గా అడుగులు వేశారు. ఆ క్ర‌మంలో హైద‌రాబాద్ కు ప‌ట్టిన మ‌హ‌ర్ధ‌శ‌ను ఇప్పుడు చూస్తున్నాం. ఆనాడు ఆయ‌న త‌యారు చేసిన విజ‌న్ ను ప్ర‌త్య‌ర్థి పార్టీలు త‌ప్పుబ‌ట్టాయి. దాన్నో 420 విజ‌న్ (Vision) గా తీసిపారేశారు. సీన్ క‌ట్ చేస్తే, 2004లో అధికారంలోకి వ‌చ్చిన రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ప్ర‌స్తుతం తెలంగాణకు సీఎంగా ఉన్న కేసీఆర్ కూడా ఆనాడు చంద్ర‌బాబు వేసిన విజ‌న్ పునాదుల‌పై పాల‌న సాగిస్తున్నారు.

విజ‌న్ 2040, 2050ని రూప‌క‌ల్ప‌న చేయ‌డానికి చంద్ర‌బాబు

ఉమ్మ‌డి రాష్ట్ర విడిపోయిన త‌రువాత తొలి సీఎంగా చంద్ర‌బాబునాయుడు ఏపీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ప్ర‌పంచంలోనే మొద‌టి స్థానంలో ఏపీని నిల‌పాల‌ని క‌ల‌లు క‌న్నారు. ఆ దిశ‌గా విజ‌న్ 2050ని రూపొందించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా ఉండేలా ప్లాన్ చేశారు. నెంబ‌ర్ 1 రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిల‌పడానికి విజ‌న్ 2029 రూపొందించారు. ప్ర‌పంచంలోనే ఏపీని నెంబ‌ర్ 1గా నిలిపేలా విజ‌న్ 2050ను త‌యారు చేయించారు. దాన్ని అమ‌లు చేసే క్ర‌మంలో సింగ‌పూర్ క‌న్సార్టియంతో ఒప్పందాలు చేసుకున్నారు.

Also Read : ChandraBabuNaidu: బీజేపీ వద్దంటే..కాంగ్రెస్ కావాలంటుంది! రాహుల్ సభకు బాబుకు ఆహ్వానం

ఆర్థిక కేంద్రంగా విశాఖ‌, హార్డ‌వేర్ హాబ్ గా రాయ‌ల‌సీమ‌, కోస్ట‌ల కారిడార్ ఏర్పాటుతో కోస్తాకు సింగ‌పూర్ లుక్, ఆధ్యాత్మిక హ‌బ్ గా తిరుప‌తిని వినూత్నంగా తీర్చిదిద్దాల‌ని విజ‌న్ రూప‌క‌ల్ప‌న చేశారు. కానీ, 2019 ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు ఆయ‌న్ను తిర‌స్క‌రించారు. ఒక్క ఛాన్స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇచ్చారు. ఫ‌లితంగా చంద్ర‌బాబు ర‌చించిన విజ‌న్ 2029, 2050 కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయి. కానీ, ఆయ‌న విజ‌న్ ఎంత విలువైన‌దో ప్ర‌ధాని మోడీ గ్ర‌హించారు. దేశానికి విజ‌న్ 2040, 2050ని రూప‌క‌ల్ప‌న చేయ‌డానికి చంద్ర‌బాబు స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. ఆ మేర‌కు విజ‌న్ రూప‌క‌ర్త‌ల‌ను ఆదేశించార‌ని ఢిల్లీ వ‌ర్గాల ద్వారా అందుతోన్న స‌మాచారం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh TDP
  • bjp
  • cbn
  • india 2040
  • modi pm
  • vision 2050

Related News

Bjp Ramachandra

CM Revanth : రేవంత్ ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది – రామచందర్ కీలక వ్యాఖ్యలు

CM Revanth : ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విషయానికొస్తే.. ఆయనపై నిరంతరం విమర్శలు చేయడం రేవంత్ అలవాటు చేసుకున్నారని రామచందర్ ఎద్దేవా చేశారు. రేవంత్ (CM Revanth) కు ఢిల్లీ వెళ్లి రావడమే సరిపోతుంది అని వ్యాఖ్యానించారు

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd