HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Capital Ap Rbi Move To Visakhapatnam The Capital Is In Full Swing

Capital AP : విశాఖ‌కు ఆర్బీఐ త‌ర‌లింపు? శ‌ర‌వేగంగా రాజ‌ధాని హంగులు!

విశాఖ రాజ‌ధాని(Capital AP) హంగుల‌ను సంత‌రించుకుంటోంది.

  • By CS Rao Published Date - 04:43 PM, Tue - 7 February 23
  • daily-hunt
Capital AP
Jagana

సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న స‌మ‌యంలోనే విశాఖ రాజ‌ధాని(Capital AP) హంగుల‌ను సంత‌రించుకుంటోంది. తాజాగా హైద‌రాబాద్ నుంచి ఆర్బీఐ(RBI) ఆఫీస్ ను త‌ర‌లించ‌డానికి రంగం సిద్ధ‌మైయింది. ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ గడువు 2024 నాటికి ముగియ‌నుంది. ఆ లోపు ఆర్బీఐ కార్యాల‌యాన్ని ఏపీకి త‌ర‌లించ‌డానికి సిద్ద‌మ‌యింది. ఏపీ ప్ర‌భుత్వం నుంచి అందుకున్న ప్ర‌తిపాద‌న మేర‌కు విశాఖ‌ప‌ట్నంకు ఆర్బీఐ కార్యాల‌యం వెళ్ల‌నుంది.

విశాఖ రాజ‌ధాని హంగుల‌ను..(Capital AP)

ముంబాయ్ కేంద్ర కార్యాల‌యంగా రిజ‌ర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI)ప‌నిచేస్తోంది. ప్ర‌తి రాష్ట్ర రాజ‌ధానిలోనూ ప్రాంతీయ కార్యాయాల‌ను క‌లిగి ఉంది. ఉమ్మ‌డి ఏపీ ఉన్నప్పుడు హైద‌రాబాద్ కేంద్రంగా ఆర్బీఐ ఉంది. రాష్ట్రం విడిపోయిన‌ప్ప‌టికీ 2024 వ‌ర‌కు హైద‌రాబాద్ రాజ‌ధానిగా ఉంది. అందుకే, ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్బీఐ హైద‌రాబాద్ కేంద్రంగా ఏపీ త‌ర‌పున కూడా కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించింది. ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ప్ర‌తిపాద‌న మేర‌కు విశాఖ‌ప‌ట్నంకు త‌ర‌లివెళ్ల‌నుంది. ఇక మార్చి మూడో వారంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ను విశాఖ‌కు(Capital AP) షిఫ్ట్ చేయ‌బోతున్నారు. ఆ మేర‌కు విశాఖ‌పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర‌స్వామి ముహూర్తం ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలోనూ రెండు ప‌ర్యాయాలు ముహూర్తం పెట్ట‌గా విశాఖ మార‌డానికి కుద‌ర‌లేదు. తొలిసారి హైకోర్టు తీర్పు వ్య‌తిరేకంగా ఉండ‌డంతో ఆగిపోయారు. ఆ త‌రువాత క‌రోనా కార‌ణంగా 2022 వ‌ర‌కు ఆ ప్ర‌స్తావ‌న లేకుండా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న కొన‌సాగించారు.

Also Read : Vizag Capital :`సుప్రీం` విచార‌ణ రోజే AP రాజ‌ధానిపై జ‌గ‌న్‌ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఈసారి మాత్రం మార్చి మూడో వారంలో విశాఖ‌ప‌ట్నం త‌ర‌లివెళ్ల‌నున్నారు. ఆ మేర‌కు విశాఖ‌ప‌ట్నం జిల్లా అధికారుల‌కు ఆదేశాలు జారీ చేయ‌డంతో ఏర్పాట్ల‌ను ముమ్మ‌రం చేశారు. అంతేకాదు, హైద‌రాబాద్ నుంచి త‌ర‌లివెళ్ల‌నున్న లోకాయుక్త‌, హెచ్ ఆర్సీ కార్యాల‌యాల‌ను క‌ర్నూలుకు త‌ర‌లిస్తున్నారు. ఇప్ప‌టికే విజిలెన్స్ ఆఫీస్ ను క‌ర్నూలుకు త‌ర‌లించిన విష‌యం విదిత‌మే. హైకోర్టు మిన‌హా దాని అనుబంధంగా ఉండే ఆఫీస్ ల‌ను క‌ర్నూలుకు తీసుకెళ్ల‌డానికి శ‌ర‌వేగంగా ప‌నులు జ‌రిగిపోతున్నాయి. ఇక విశాఖ కేంద్రంగా కార్యానిర్వ‌హ‌ణ(Capital AP) రాజ‌ధానికి అవ‌స‌ర‌మైన అన్ని హంగుల‌ను ఏర్పాటు చేశారు. శాస‌న రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కొన‌సాగించ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ నిర్ణ‌యించుకుంది. ఆ మేర‌కు కొన్ని ప‌నులు చేస్తోంది.

హైద‌రాబాద్ నుంచి విశాఖ‌కు ఆర్బీఐ కార్యాయాలన్ని..

అమ‌రావ‌తి రాజ‌ధాని అంశం ప్ర‌స్తుతం సుప్రీం కోర్టులో ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. అక్క‌డ విచార‌ణ పిటిష‌న్ స్వీక‌రించిన సుప్రీం కోర్టు రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతుల‌కు నోటీసులు పంపింది. వాటికి తిరుగు స‌మాధానం ఇవ్వ‌డానికి క‌నీసం రెండు వారాల స‌మ‌యం కావాల‌ని కోర‌డంతో ఈనెల 23వ తేదీకి కేసును వాయిదా వేసింది. సుప్రీం కోర్టులో పిటిష‌న్ పెండింగ్ లో ఉన్న స‌మ‌యంలోనే ఢిల్లీ కేంద్రంగా విశాఖ రాజ‌ధాని అంశాన్ని పారిశ్రామికవేత్త‌ల స‌ద‌స్సులో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఆ రోజు నుంచి విశాఖ రాజ‌ధాని ప‌నులు చాలా వేగంగా జ‌రిగిపోతున్నాయి. దానికి అనుగుణంగా ఇప్పుడు ఆర్బీఐ (RBI) కార్యాయాలన్ని హైద‌రాబాద్ నుంచి విశాఖ‌కు త‌ర‌లించ‌డం హాట్ టాపిక్ అయింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravathi
  • ap capital
  • rbi governer
  • Visakha Capital

Related News

Nara Lokesh Google Vizag

Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు క్యూ కట్టాయి.. ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఎంవోయూ కూడా పూర్తైంది. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో గూగుల్‌ ప

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd