HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cabinet Berths Not Confirmed For These Ministers

AP Cabinet Ministers : వాళ్ల‌కు క్యాబినెట్ హోదా హుళ‌క్కే.!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెబుతోన్న జిల్లా బోర్డుల చైర్మ‌న్ల‌కు క్యాబినెట్ హోదా అసాధ్యంగా క‌నిపిస్తోంది. ఆయ‌న ఇటీవ‌ల జిల్లా, ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల స‌మావేశంలో 2024 దిశానిర్దేశం చేస్తూ మంత్రి ప‌ద‌వులు పోయిన వాళ్ల‌కు ఆ హోదా క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు.

  • Author : CS Rao Date : 02-05-2022 - 1:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR, Jagan
KCR, Jagan

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెబుతోన్న జిల్లా బోర్డుల చైర్మ‌న్ల‌కు క్యాబినెట్ హోదా అసాధ్యంగా క‌నిపిస్తోంది. ఆయ‌న ఇటీవ‌ల జిల్లా, ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల స‌మావేశంలో 2024 దిశానిర్దేశం చేస్తూ మంత్రి ప‌ద‌వులు పోయిన వాళ్ల‌కు ఆ హోదా క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. ప్రొటోకాల్ ప్ర‌కారం మంత్రివ‌ర్గంలోని మంత్రుల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా హోదా క‌ల్పిస్తాన‌ని ప్రామిస్ చేశారు. దీంతో సంతోష ప‌డ్డ వాళ్ల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ 2014లో ఏర్పాటు చేసిన పార్ల‌మెంట‌రీ కార్య‌ద‌ర్శుల ప‌ద‌వుల విష‌యంలో ఏం జ‌రిగిందో గుర్తుకు వ‌స్తుంది.

వైసీపీ జిల్లా అధ్య‌క్షుల‌కు జిల్లా బోర్డు చైర్మ‌న్ల ప‌ద‌వులను ఇవ్వ‌డానికి జ‌గ‌న్ క‌స‌రత్తు చేస్తున్నారు. అంతేకాదు, వాళ్ల‌కు మంత్రి హోదా క‌ల్పించ‌డంతో పాటు జిల్లా ఇంచార్జి మంత్రులు, మంత్రుల కంటే వాళ్లే ప‌వ‌ర్ ఫుల్ అంటూ చెబుతున్నారు. ఆ మేర‌కు ఉత్త‌ర్వులు ఇవ్వ‌డానికి ఆయ‌న ఆదేశించారు. పెరిగిన జిల్లాల సంఖ్య ఆధారంగా 26 మందిని జిల్లా అధ్యక్షులుగా నియ‌మించారు. వాళ్ల‌కు 11 మంది ప్రాంతీయ స‌మ‌న్వ‌యక‌ర్త‌ల‌ను అనుసంధానం చేశారు. ఆ 11 మందికి కూడా క్యాబినెట్ హోదా క‌ల్పిస్తామ‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. జిల్లా అధ్య‌క్షులు 26 ప్ల‌స్ ప్రాంతీయ స‌మన్వ‌య‌క‌ర్త‌లు 11 వెర‌సి 37 మందికి క్యాబినెట్ హోదా క‌ల్పించాలి. పైగా మంత్రివ‌ర్గంలోని మంత్రులు ఆ 37 మంది చెప్పిన‌ట్టు న‌డుచుకోవాల‌ని జ‌గ‌న్ ఇటీవ‌ల సూచించారు.

రాజ్యాంగం ప్ర‌కారం అసెంబ్లీలోని మొత్తం స‌భ్యుల సంఖ్య‌లో సీఎంతో స‌హా 15 శాతం మందికి మించి మంత్రివ‌ర్గం ఉండ‌కూడ‌దు. ఆ ప్ర‌కారం 25 మంది ఏపీ క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. వీళ్ల‌కు అద‌నంగా మ‌రో 37 మందికి మంత్రుల హోదా క‌ల్పించాలంటే రాజ్యాంగాన్ని మార్చాల్సిందే. ఆ విష‌యాన్ని న్యాయ‌స్థానాలు 2019లోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కు చెబుతూ తీర్పు ఇచ్చాయి. తొలి సారి అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్ 2014లో పార్ల‌మెంట‌రీ కార్య‌ద‌ర్శుల‌ను 12 మందిని నియ‌మిస్తూ వాళ్ల‌కు మంత్రుల హోదా క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది. రాజ్యాంగాన్ని ధిక్క‌రించి 15శాతం కంటే ఎక్కువ మందికి క్యాబినెట్‌ హోదా ఇవ్వ‌డానికి లేద‌ని కోర్టుల్లో తీర్పు వ‌చ్చింది. దీంతో కేసీఆర్ నిమ్మండిపోయారు.

న్యాయ పరిశీలనకు నిలబడే విధంగా పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి చట్టాన్ని తీసుకురావాల‌ని 2019లో మ‌రోసారి కేసీఆర్ ప్ర‌య‌త్నం చేశారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కర్నాటక రాష్ట్రాలు అనుస‌రిస్తోన్న విధానాన్ని అధ్య‌య‌నం చేశారు. రాజ్యాంగంలోని 91వ సవరణ ప్ర‌కారం “రాజ్యాంగంలోని ఆర్టికల్ 164లో, క్లాజ్ (1) నిబంధ‌న‌ (1A) నిబంధ‌న‌ల‌పై న్యాయ నిపుణుల‌తో అధ్య‌య‌నం చేయించారు. ఆ నిబంధ‌న‌ల ప్ర‌కారం మొత్తం మంత్రుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదు”.

91వ సవరణకు ముందు రాష్ట్రంలో జంబో క్యాబినెట్‌లు ఉండేవి. వాటిలో, 1980ల ప్రారంభంలో టి అంజయ్య 61 మందితో క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు. ఆ త‌రువాత కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశంతో ఆ సంఖ్యను 45కి తగ్గించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సీట్ల సంఖ్య 119కి తగ్గింది, తదనుగుణంగా మంత్రివర్గం పరిమాణం కూడా తగ్గింది. క్యాబినెట్‌లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తీసుకోలేక డిసెంబర్, 2014లో కోవా లక్ష్మి, వి సతీష్ కుమార్, వి శ్రీనివాస్ గౌడ్, జి కిషోర్ కుక్మార్, జలగం వెంకట్ రావు, డి వినయ్ భాస్కర్‌లను పార్ల‌మెంట‌రీ కార్య‌ద‌ర్శులుగా నియమించారు. అయితే, కాంగ్రెస్ నేతలు సవాల్ చేయడంతో హైకోర్టు కొట్టివేసింది.

మంత్రులకు సహాయం చేయడానికి పార్లమెంటరీ సెక్రటరీల నియామ‌కం ఇంగ్లాండ్‌లో ఉద్భవించింది. ఇదే ధోరణిని జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మణిపూర్, అస్సాం, రాజస్థాన్ త‌దిత‌ర భారతీయ రాష్ట్రాలు అనుస‌రించాయి. అయితే ఆయా హైకోర్టులు పలు కేసుల్లో నియామకాలను కొట్టివేశాయి. తెలంగాణలో పార్లమెంటరీ కార్యదర్శులను GO ద్వారా ద్వారా “తెలంగాణ పార్లమెంటరీ కార్యదర్శుల (నియామకాలు, జీతాలు, అలవెన్సులు మరియు ఇతర నిబంధనలు) చట్టం, 2015” ను తీసుకువచ్చింది. దీనిని కోర్టులో సవాలు చేయగా కోర్టు కొట్టివేసింది.

మార్చి 2015లో, ఢిల్లీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను ప్రభుత్వం నుండి ఎలాంటి పారితోషికం లేదా ప్రోత్సాహకాలు లేకుండా పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించారు. అయితే, ఆర్టికల్ 239 AAని ఉల్లంఘించిందని రాష్ట్రీయ ముక్తి మోర్చా అనే NGO దాఖలు చేసిన PIL ద్వారా దీనిని ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ఆ తర్వాత, ఢిల్లీ ప్రభుత్వం 21 మంది పార్లమెంటరీ కార్యదర్శులను అనర్హత నుండి మినహాయించేందుకు 1997లోని ఢిల్లీ సభ్యుల శాసనసభ (అనర్హత తొలగింపు) చట్టం, 1997ను పునరాలోచన ప్రభావంతో సవరించింది. రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును పంపారు. కానీ, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయలేదు.

ఆయా రాష్ట్రాలు క్యాబినెట్ హోదా ఇచ్చేలా ప‌ద‌వుల‌ను సృష్టించి భంగ‌ప‌డిన అంశాలు తెలిసి కూడా ఇప్పుడు జ‌గ‌న్ ప్రాంతీయ‌, జిల్లా బోర్డు అధ్య‌క్షుల‌కు క్యాబినెట్ హోదా క‌ల్పించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మంత్రివ‌ర్గం నుంచి తొలగించబ‌డిన వాళ్ల‌కు ఆశ‌లు రేకెత్తించేలా జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నం న్యాయ‌స్థానాల్లో నిల‌బ‌డే ప్ర‌స‌క్తేలేద‌ని గ‌త తీర్పులు చెబుతున్నాయి. పైగా కేసీఆర్ చేయ‌లేని ప‌నిని జ‌గ‌న్ చేసి చూపాల‌ని ప్ర‌య‌త్నించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhrapradesh news
  • AP Cabinet Latest News
  • YS Jagan Mohan Reddy
  • ysrcp

Related News

Amaravati

Amaravati: రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

అమరావతి చట్టబద్ధత బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇదివరకే ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈరోజు రాజ్యసభలో చర్చ అనంతరం ఆమోదం తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ

  • Amaravati As Ap Capital

    Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

  • andhra pradesh Release Pending Dues retired employees

    ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

  • Pemmasani Chandrasekhar

    AP Capital: అమరావతి రైతుల కన్నీళ్లకు పునాది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Latest News

  • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

  • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

  • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

  • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd