HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Botsa Satyanarayana Says Ap Capital Hyderabad By 2024

Botsa Satyanarayana: 2024 వ‌ర‌కు ఏపీ రాజ‌ధాని హైద‌రాబాదే.. బొత్స కీల‌క వ్యాఖ్య‌లు..!

  • Author : HashtagU Desk Date : 07-03-2022 - 3:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Botsa Satyanarayana Ap Three Capitals
Botsa Satyanarayana Ap Three Capitals

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని పై జ‌రుగుతున్న ర‌గ‌డ పై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ స‌ర్కార్ అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా మాత్ర‌మే ప‌రిగ‌ణిస్తుంద‌ని బొత్స తేల్చి చెప్పారు. 2024 వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మాత్రమేనని అన్నారు. దానిని దృష్టిలో పెట్టుకునే న్యాయస్థానం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటుందని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్దారు. ఇప్ప‌టికీ తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని బొత్స మరోసారి స్పష్టం చేశారు.

ఇక జిల్లాల విభజనతో పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుదని చెప్పారు. శివరామకృష్ణ కమిటీ ప్రధాన సూచన వికేంద్రీకరణ అని బొత్స సత్యనారాయణ మరోసారి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. శాసనసభను చట్టాలను చేయొద్దంటే ఎలా కుదురుతుంద‌ని బొత్సా ప్ర‌శ్నించారు. రాజ్యాంగానికి లోబడే ఏ వ్యవస్థ అయినా పని చేయాల‌ని బొత్స తెలిపారు. పునర్విభజన చట్టం ప్రకారం 2024 వరకు మన రాజధాని హైదరాబాదే అని.. దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టులు మాట్లాడి ఉంటాయని బొత్స పేర్కొన్నారు.

ఏ రాష్ట్ర‌మైనా రాజధానిని గుర్తించిన తర్వాత పార్లమెంట్‌కు పంపి అక్కడ ఆమోదం పొందిన తర్వాతే అది రాజ‌ధాని అని తెలుస్తుందని బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. ఇప్పుడు అమరావతి, హైదరాబాద్ అని రెండు రాజధానులు లేవ‌ని, వైసీపీ ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమే అని బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని విషయంలో కోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలా వద్దా అనేది బీఏసీలో నిర్ణయిస్తామని చెప్పుకొచ్చారు. చ‌ట్టాలు చేయ‌డానికే శాసనసభలు, పార్లమెంటులు ఉన్నాయ‌ని, చట్టాలు చేసే అధికారం చట్టసభలకు లేదని కోర్టు చెప్పలేదని అన్నారు. కోర్టు కేవలం సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేసే అంశంపైనే వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు.

ఇక శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రధాన సూచన ప్రకారమే తాము రాజధానుల వికేంద్రీకరణ చేపట్టామని బొత్స అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక విధానం అంటూ ఏమీ లేదని బొత్స సత్యనారాయణ మండి పడ్డారు. తొలుత సభకు రానని చెప్పిన టీడీపీ తర్వాత వ‌చ్చి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుందని, సభలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు చెప్పారు. టీడీపీ నేతలకు ఆవేశం ఎక్కువని, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఎప్పుడు ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు తీసుకోరని విమర్శించారు. దూర దృష్టితో తీసుకునే నిర్ణయాలను మాత్రమే ప్రజలు ఆమోదిస్తార‌ని టీడీపీ నేతలపై బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. మ‌రి బొత్స వ్యాఖ్య‌ల‌పై టీడీపీ బ్ర‌ద‌ర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravathi
  • ap assembly
  • ap capital
  • ap three capitals
  • hyderabad
  • minister botsa satyanarayana
  • tdp
  • ysrcp

Related News

Chief Election Commissioner Gyanesh Kumar's visit to Telugu states

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

ఎన్నికల నిర్వహణలో బీఎల్‌వోల పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొంటూ, ఓటర్ల జాబితాల ఖచ్చితత్వం, కొత్త ఓటర్ల నమోదు, పారదర్శక ప్రక్రియల అమలుపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Btechravi

    జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత

  • Bullet Railway Andhra Prade

    ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

Latest News

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd