HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Botsa Satyanarayana Comments On Amaravathi

Botsa Satyanarayana : అమ‌రావ‌తిపై క‌పిరాజు ‘బొత్సా’

ఏపీ మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ ప్ర‌స్తుతం జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడు. ఒక‌ప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని హంత‌కునిగా అనుమానించాడు. మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ మ‌ర‌ణం వెనుక జ‌గ‌న్ హ‌స్తం ఉంద‌ని అప్ప‌ట్లో సందేహించాడు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ‌ను క‌న్నీళ్లు పెట్టించాడు.

  • Author : CS Rao Date : 17-12-2021 - 12:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Botsa Satyanarayana
Botsa Satyanarayana

ఏపీ మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ ప్ర‌స్తుతం జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడు. ఒక‌ప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని హంత‌కునిగా అనుమానించాడు. మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ మ‌ర‌ణం వెనుక జ‌గ‌న్ హ‌స్తం ఉంద‌ని అప్ప‌ట్లో సందేహించాడు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ‌ను క‌న్నీళ్లు పెట్టించాడు. ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని జ‌య‌హో అంటూ ఆకాశానికి ఎత్తేయ‌డానికి అమ‌రావ‌తిని `స్మ‌శానం` అన్నాడు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని `ఎడారి`గా అభివ‌ర్ణించాడు. ప‌శువులు, పందులు తిరిగే బీడుభూమిగా అమ‌రావ‌తిని ప్ర‌చారం చేశాడు. భూములు ఇచ్చిన రైతుల‌ను రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల్ని చేశాడు.

తిరుప‌తిలో జ‌రుగుతోన్న అమ‌రావ‌తి రైతుల స‌భ‌ను రాజ‌కీయ స‌భ‌గా బొత్సా భావిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ప్ర‌మోట్ చేస్తోన్న ఈవెంట్ గా చెబుతున్నాడు. న్యాయ‌స్థానం టూ దేవ‌స్థానం మ‌హాపాద‌యాత్ర టీడీపీ కార్య‌క‌ర్త‌లు చేసిన ఈవెంట్ గా భావిస్తున్నాడు. అదే విష‌యాన్ని ప్ర‌జ‌ల ముందుకు తీసుకెళుతున్నాడు. ఏపీ రాజ‌ధాని ప్ర‌స్తుతం ఏది అంటే మాత్రం మౌనంగా ఉండిపోతున్నాడు. మూడు రాజ‌ధానులు ఉండాల‌ని కోరుకుంటున్నాడు. విశాఖ‌ ప‌రిపాల‌న రాజ‌ధానిగా ఉండాల‌ని అక్క‌డి ప్ర‌జ‌ల్ని కూడ‌గ‌ట్ట‌డంలో విజ‌య‌వంతం అయ్యాడు. ఇప్పుడు రాయ‌ల‌సీమ న్యాయ రాజ‌ధానిగా ఉండాల‌ని కోరుకుంటున్న వాళ్ల‌కు మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నాడు.
ఇవాళ తిరుప‌తి కేంద్రంగా అమ‌రావ‌తి రైతులు నిర్వ‌హిస్తోన్న‌ మ‌హాస‌భ‌కు చంద్ర‌బాబు హైలెట్ గా నిలుస్తున్నాడు. ఆయ‌న‌తో పాటు బీజేపీ, వామ‌ప‌క్షాలు, జన‌సేన లీడ‌ర్లు కూడా ఈ సభ‌కు సంఘీభావం తెలప‌డం విశేషం. కానీ, మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ మాత్రం టీడీపీ నిర్వ‌హిస్తోన్న స‌భ‌గా చూస్తున్నాడు. తిరుప‌తి కేంద్రంగా శ‌నివారం రోజు జ‌ర‌గ‌నున్న మూడు రాజ‌ధానుల మ‌హాస‌భ‌కు వైసీపీ హాజ‌రు కావాలా? వ‌ద్దా? అనే దానిపై ఆలోచ‌న‌లో ప‌డింది. ఆ మేర‌కు క్లారిటీని బొత్సా ఇవ్వలేక‌పోతున్నాడు.

మూడు రాజధానుల మ‌హాస‌భ‌కు హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. తిరుప‌తి కేంద్రంగా శుక్ర‌వారం రోజున జ‌రిగే అమ‌రావ‌తి రైతుల మ‌హాస‌భ‌ను ఏపీ ప్ర‌భుత్వం క్లోజ్ గా ప‌రిశీలిస్తోంది. దానికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా శ‌నివారం నాడు జ‌రిగే మూడు రాజ‌ధానుల స‌భ‌కు జ‌నాన్ని త‌ర‌లించే ప్ర‌య‌త్నం వైసీపీ చేస్తోంది. ఎవ‌రు అవున్న‌న్నా..కాద‌న్నా..ప్ర‌త్య‌క్షంగానో..ప‌రోక్షంగానో…రాజధానుల అంశాన్ని రాజ‌కీయ పార్టీలు అనుకూలంగా మ‌లుచుకునే ఎత్తుగ‌డ‌లు వేస్తున్నాయి. ఆ క్ర‌మంలో వైసీపీ, టీడీపీ పాత్ర ప్ర‌త్య‌క్షంగా కనిపిస్తుంటే ప‌రోక్షంగా బీజేపీ, జ‌నసేన‌, వామ‌ప‌క్షాల వ్యూహాలు ఉన్నాయి. రైతుల్ని, సెంటిమెంట్ ను ఎవ‌రికి తోచిన విధంగా వాళ్లు వాడేసుకుంటున్నారు. ప్ర‌త్యేక హోదా త‌ర‌హాలోనే రాజ‌కీయ అస్త్రంగా రాజ‌ధాని అంశాన్ని హైలెట్ చేయ‌డానికి పూనుకున్నారు. ఆ ప్ర‌యత్నాల్లో మునిగేది ఎవ‌రు? తేలేది ఎవ‌రో..ఇప్పటికే అంచ‌నా వేసిన బొత్సా స‌త్య‌నారాయ‌ణ ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప‌క్షాన నిలిచాడు. ఎన్నిక‌ల నాటికి ఆయ‌న నాలుక ఎటు తిరుగుతుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravathi
  • AP CM Jagan
  • botsa satyanarayana
  • ys jagan

Related News

Acham Naidu Vs Botsa Satyanarayana

బొత్స పై అచ్చెన్నాయుడు ఫైర్

Acham Naidu Vs Botsa Satyanarayana  వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసనమండలిని శాసించాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం మండలిలో రాష్ట్ర అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క కంపెనీని కూడా తీసుకురా

    Latest News

    • Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు

    • Condoms : కండోమ్స్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీకు ఈ సమస్య వచ్చినట్లే ? నిజమా ?

    • డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

    • PEPAIR : శ్వాసకోశ రోగులకు ‘పిపెయిర్’ వరం

    • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd