Balakrishna : బాలయ్య సతీసమేతంగా ..`ఎన్టీఆర్ ఆరోగ్య రథం`
హిందూపురం నియోజకవర్గానికి బాలయ్య సతీసమేతంగా వెళ్లారు. అక్కడ సంచార వైద్యసేవల కోసం ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరుతో తయారు చేసిన ప్రత్యేక బస్సును ప్రారంభించారు.
- By CS Rao Published Date - 04:52 PM, Wed - 17 August 22
హిందూపురం నియోజకవర్గానికి బాలయ్య సతీసమేతంగా వెళ్లారు. అక్కడ సంచార వైద్యసేవల కోసం ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరుతో తయారు చేసిన ప్రత్యేక బస్సును ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందులను బుధవారం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆస్పత్రిలో 30 వెంటిలేటర్లు వాడకుండా మూలన పడేయడాన్ని తప్పుబట్టారు. ఆసుపత్రికి ఇచ్చిన అనేక పరికరాలు వినియోగించడం లేదని ఆవేదన చెందారు.
రెండేళ్లుగా కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజలకు టీడీపీ కార్యకర్తలు ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. తాము ప్రారంభించిన మొబైల్ వాహనం ద్వారా నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యసేవలు అందిస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆరోగ్య రథం ద్వారా ప్రత్యేక వైద్యబృందం వైద్య పరీక్షలు, ఉచిత వైద్యం అందించనుందని తెలిపారు. వాహనంలో ఒక వైద్యుడు, ఒక నర్సు, ఒక ఫార్మాసిస్ట్, ఆరుగురు వైద్య సిబ్బంది, ఒక మెడిసిన్ కౌంటర్, కంప్యూటర్ ఆపరేటర్లు ఉంటారు. సాధారణ వ్యాధులకు చికిత్స, ఉచితంగా మందులు ఇస్తారు. తీవ్ర వ్యాధులున్న రోగులను
Related News
Balakrishna: ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలి : నందమూరి బాలకృష్ణ
Balakrishna: తెలుగువారి సంవత్సరాది ఉగాది సందర్భంగా దేశ విదేశాల్లోని తెలుగువారందరికీ క్రోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు నందమూరి బాలకృష్ణ. ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలి. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శుభాలు కల్పించాలని అన్నారు. మన పండుగలు తెలుగు సంప్రదాయాలు, ఆచార సంస్కృతులతో అనుసంధానమై ఉండాలని అన్నారు. తెలుగువారి అస్త�