HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Avinash Reddy Gave Another Jalak To Cbi In Vivekas Murder Case

Avinash Reddy vs CBI : వివేకా హత్య కేసులో సీబీఐ కి అవినాష్ రెడ్డి మరో జలక్

వివేకా హత్య కేసులో సూత్రధారిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash) మరోసారి సీబీఐకి జలక్ ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన రోజుల్లో విచారణకు రాలేనని తేల్చేశారు.

  • By CS Rao Published Date - 01:40 PM, Tue - 16 May 23
  • daily-hunt
Viveka Murder
Avinash Reddy Gave Another Jalak To Cbi In Viveka's Murder Case

Avinash Reddy vs CBI : వివేకా హత్య కేసులో సూత్రధారిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) మరోసారి సీబీఐకి జలక్ ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన రోజుల్లో విచారణకు రాలేనని తేల్చేశారు. బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా సోమవారం విచారణకు రావటం లేదని రాతపూర్వక ఉత్తరువు సీబీఐ కి పంపారు. అందుకు సీబీఐ కూడా ఏమి చేయలేక కోరలు పీకిన పాములా ఆడుతుంది. హత్య కేసులోని సూత్రధారి మాత్రం ఎంచక్కా పులివెందులకు వెళ్లారు. దీంతో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం సీబీఐ ఎదుట హాజరుకాలేదు. నాలుగు రోజుల తరవాత కలుద్దాం అంటూ గడువు కోరారు.

తన పార్లమెంటరీ నియోజకవర్గంలో ముందస్తుగా కార్యక్రమాలు ఉన్నాయని పేర్కొంటూ, షార్ట్ నోటీసుకు తాను హాజరు కాలేనని సీబీఐకి తెలియచేయడం సీబీఐ అధికారులను అవినాష్ విచారిస్తున్నారా? అవినాష్ ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారా? అనే సందహం కలగటం సర్వసాధారణం.

అవినాష్ రెడ్డి (Avinash Reddy) మంగళవారం కడప జిల్లా పులివెందులకు వెళ్లారు. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రాంతీయ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సోమవారం నోటీసులో ఆదేశాలు జారీ చేసింది.ఇప్పటికే నాలుగు సార్లు సీబీఐ విచారించిన కడప ఎంపీ గత నెలలో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 28న హైకోర్టు విచారణను జూన్ 5కి వాయిదా వేసింది. ఈ కేసులో ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది.

ఆయన అరెస్టును ఏప్రిల్ 25 వరకు నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు గతంలో రద్దు చేసింది. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహతో కూడిన ధర్మాసనం కూడా ఈ కేసు దర్యాప్తును పూర్తి చేసేందుకు గడువును జూన్ 30 వరకు పొడిగించింది. సీబీఐకి ఏప్రిల్ 30ని గడువుగా సుప్రీంకోర్టు గతంలో నిర్ణయించింది. ఎన్నికలకు ముందు 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు.

68 ఏళ్ల రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడి హత్య చేశారు. కొంతమంది బంధువులపై అనుమానం వ్యక్తం చేసిన సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు 2020లో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. సునీతారెడ్డి పిటిషన్‌పై గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు కేసును హైదరాబాద్‌కు బదిలీ చేసింది.

గత నెలలో అవినాష్‌ రెడ్డి (Avinash Reddy) తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. పలు మార్గాల ద్వారా విచారణ సందర్భంగా సేకరించిన సమాచారం.ప్రకారం అవినాష్ సూత్రధారిగా హత్య జరిగిందని సీబీఐ తేల్చింది. కానీ ఆయన్ను అరెస్ట్ చేయడానికి ధైర్యం చేయలేక తిప్పలు పడుతుంది. ఆ కోవలోకే మంగళవారం అవినాష్ రాసిన లేఖ కూడా వస్తుంది. అంటే అవినాష్ ఏది చెబితే సీబీఐ అది వింటుందన్నమాట.

మళ్ళీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

Also Read:  BRS Plan: ఏపీలో BRS ఎత్తుగడ! కాంగ్రెస్ తో కలిసి మహా కూటమి దిశగా..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • ap
  • Avinash Reddy
  • case
  • cbi
  • Murder case
  • police
  • politics
  • Viveka
  • Vivekananda Murder Case
  • ycp
  • ysrcp

Related News

Tdp Leaders Ycp

Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

Big Shock to TDP : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి పలువురు టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్, బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్ మురహరిరెడ్డి, బీజేపీ నేత కిరణ్ కుమార్‌తో పాటు వారి అనుచరులు జగన్ సమక్షంలో చేరడం ఆ పార్టీకి ఊతమిచ్చింది

  • Balakrishna Jagan

    Jagan : జగన్ సైకో అంటూ బాలయ్య చేసిన డైలాగ్ కు వైసీపీ ఎదురుదాడి

  • Lokesh supports National Education Policy

    Mega DSC : ప్రతి ఏటా DSC ప్రకటన – లోకేష్

  • Og Tgh

    OG కి బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు…టికెట్స్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి..?

  • Pawan Uppada

    Pawan’s Key Decision : ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు పవన్ చెక్ !!

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd