APSRTC : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ నుంచి…?
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్
- By Prasad Published Date - 09:49 AM, Wed - 24 August 22
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖతో ఆర్టీసీ అధికారులు జరిపిన సంప్రదింపులు సఫలమయ్యాయి. ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 51,500 మంది ఉద్యోగులు ఉండగా, వారిలో దాదాపు 2,000 మంది ఇటీవలే పదోన్నతులు పొందారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు మినహా మిగిలిన వారందరికీ సెప్టెంబర్ 1న కొత్త పే స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పదోన్నతి పొందిన వారి ఫైలును ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి పదోన్నతులు మంజూరు కాగానే కొత్త పే స్కేల్ ప్రకారం వారికి కూడా జీతాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ అనుమతినిస్తుందని అధికారులు తెలిపారు. వారంలోగా ప్రభుత్వ ఆమోదం లభిస్తే వారికి కూడా సెప్టెంబర్ 1న కొత్త పే స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లిస్తామని, లేకుంటే అక్టోబర్ 1 నుంచి కొత్త జీతాలు ఇస్తామని, ఆర్టీసీ ఉద్యోగులందరికీ బకాయిలతో సహా జీతాలు చెల్లిస్తామని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Tags
Related News
Chandrababu : తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా.. చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా?
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చని, తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేమని చెప్పారు.