Bengaluru: భార్య పిల్లల్ని చంపేసి తాను ఆత్మహత్య
బెంగళూరులో అత్యంత దారుణమైన విషాదం చోటుచేసుకుంది. 31 ఏళ్ల సాఫ్ట్వేర్ తన భార్యను, ఇద్దరు కూతుళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన గురువారం వెలుగు చూసింది.
- By Praveen Aluthuru Published Date - 07:47 PM, Thu - 3 August 23
Bengaluru: బెంగళూరులో అత్యంత దారుణమైన విషాదం చోటుచేసుకుంది. 31 ఏళ్ల సాఫ్ట్వేర్ తన భార్యను, ఇద్దరు కూతుళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన గురువారం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన వీరార్జున విజయ్, తన భార్య (హేమావతి) పిల్లలతో కలిసి బెంగుళూరులో ఉంటున్నారు. ఆరేళ్లక్రితమే వీరికి వివాహం జరిగింది. అయితే రెండు మూడు రోజులుగా వీరి అపార్ట్మెంట్ నుంచి రాకపోకలు జరగలేదు. ఈ రోజు వారి అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా కుటుంబ సభ్యుల మృతదేహాలు కనిపించాయి. అయితే ఈ ఘటన జూలై 31న జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎఫ్ఎస్ఎల్ నిపుణుల బృందం వచ్చి విచారణ చేపట్టింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా భార్య వయసు 29 సంవత్సరాలు, సంవత్సరంన్నర పాప, మరోపాపకు 8 నెలలు.
Also Read: Aloo Batani Pulao: ఎంతో స్పైసీగా ఉండే ఆలు బఠాణి పులావ్.. తయారీ విధానం?
Related News
TTD: “గోవింద కోటి” రాసిన బెంగుళూరుకు చెందిన కీర్తన, విఐపి బ్రేక్ లో శ్రీవారి దర్శనం
TTD: మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన విద్యార్థిని కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది. ఈ సందర్భంగా కీర్తన మీడియాతో మాట్లాడుతూ, తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానినన్నారు. మా కులదై�