AP High Court : ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు నోటీసులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది ప్రమేయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన
- By Prasad Published Date - 07:33 AM, Thu - 30 November 23
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ “వై ఏపీ నీడ్స్ జగన్ ” కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది ప్రమేయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిల్పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహా ఆరుగురు ప్రతివాదులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ నోటీసులు జారీ చేసింది. . మంగళగిరికి చెందిన జర్నలిస్టు కె. వెంకయ్య పార్టీ కార్యక్రమానికి ప్రచారం చేయడానికి రాష్ట్ర ఖజానా నుండి డబ్బు ఖర్చు చేయడాన్ని సవాలు చేశారు. అయితే ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం ఉద్దేశించబడిందని ప్రభుత్వ తరుపున న్యాయవాది వి.మహేశ్వర రెడ్డి కోర్టుకు తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముతో రాజకీయ ప్రచారం నిర్వహిస్తున్నారని పిటిషనర్ తెలిపారు.. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని ప్రచారం చేసేందుకు రూ.20 కోట్లు కేటాయిస్తూ జిఒ నెంబర్ 7ను జారీ చేసినట్లు పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి అధికారికంగా కోరినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాదులు వివరించారు. ఈ ఉత్తర్వులు సర్వీస్ రూల్స్ కు విరుద్ధమని న్యాయవాదులు పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు పిల్పై ప్రతివాదులకు నోటీసులు పంపి తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
We’re now on WhatsApp. Click to Join.
మరో కేసులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్ఆర్) కుంభకోణంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిసెంబర్ 1కి వాయిదా వేసింది. మరో కేసులో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలో చిరుతపులి దాడి చేసి చంపిన లక్ష్మి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం చెల్లించకపోవడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోనే అత్యంత ధనిక దేవాలయం టీటీడీ అయినప్పటికీ ఇంత మొత్తం ఎందుకు చెల్లించలేదని కోర్టు ప్రశ్నించింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీతో పాటు ఇతరులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Telangana Elections : ప్రారంభమైన తెలంగాణ పోలింగ్.. ఖమ్మంలో ఓటుహక్కు వినియోగించుకున్న తుమ్మల
Related News
YS Sharmila : 2024 మేనిఫెస్టో లో ప్రత్యేక హోదా ప్రస్తావన ఏది?
సీఎం జగన్ 2019 మేనిఫెస్టో లో ప్రవేశ పెట్టి నెరవేర్చని అంశాలు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు.