HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ap Govt To Introduce 3 Capitals Bill On Last Day Of Assembly Session

AP Assembly : విశాఖ నుంచి పాల‌న! అసెంబ్లీ చివ‌రి రోజు 3 రాజ‌ధానుల బిల్లు?

మూడు రాజ‌ధానుల‌పై స‌మ‌గ్ర బిల్లును జ‌గ‌న్ ప్ర‌భుత్వం సిద్ధం చేస్తోంది. వ‌ర్షాకాల స‌మావేశాల చివరి రోజు బిల్లును ప్ర‌వేశ పెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది.

  • By CS Rao Published Date - 04:50 PM, Fri - 16 September 22
  • daily-hunt
Vizag Jagan
Vizag Jagan

మూడు రాజ‌ధానుల‌పై స‌మ‌గ్ర బిల్లును జ‌గ‌న్ ప్ర‌భుత్వం సిద్ధం చేస్తోంది. వ‌ర్షాకాల స‌మావేశాల చివరి రోజు బిల్లును ప్ర‌వేశ పెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. అధికార వికేంద్ర‌క‌ర‌ణ‌పై గురువారం సుదీర్ఘంగా వివ‌రించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బిల్లును సిద్ధం చేయిస్తున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం. ఇప్ప‌టికే మూడు రాజ‌ధానుల‌పై క్లారిటీగా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ స‌మావేశాల్లోనే బిల్లుకు ఆమోదం తెల‌ప‌డానికి సిద్ధం అయ్యార‌ట‌. ప్ర‌స్తుతం మండ‌లిలోనూ వైసీపీ స‌భ్యులు మెజార్టీ ఉన్నారు. దీంతో గ‌తంలో మాదిరిగా సాంకేతిక సమ‌స్య‌లు ఉండ‌వ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

పరిపాల‌న రాజ‌ధానిగా విశాఖ‌ప‌ట్నం ఖాయ‌మంటూ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ శుక్ర‌వారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి విశాఖ నుంచి ప‌రిపాల‌న ఉంటుంద‌ని ఆయ‌న వెల్ల‌డించ‌డం ఉద్యోగులు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ప‌లు కార్యాల‌యాల‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను విశాఖ‌లో చేశార‌ని తెలుస్తోంది. మూడు ప్రాంతాల్లోని సెంటిమెంట్ ను గ‌మ‌నించిన త‌రువాత మూడు రాజ‌ధానుల‌కు వెళ్లాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టత‌తో ఉంది. ఆ మేర‌కు మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ వ్యాఖ్య‌లు చేశారని తెలుస్తోంది.

మూడు రాజ‌ధానుల బిల్లును ఈ స‌మావేశాల్లోనే ఆమోదించాల‌ని క‌ర్నూలు బార్ అసోసియేష‌న్ డిమాండ్ చేస్తోంది. ఆ మేర‌కు గ‌త రెండు రోజులుగా ఆందోళ‌న కొనసాగిస్తోంది. న్యాయ రాజ‌ధాని క‌ర్నూలు త‌ర‌లించాల‌ని డిమాండ్ చేస్తూ అక్క‌డి న్యాయ‌వాదులు రెండు రోజులుగా ధ‌ర్నాలు చేస్తున్నారు. బిల్లు పెట్టే వ‌ర‌కు ఈ ఆందోళ‌న కొన‌సాగిస్తామ‌ని క‌ర్నూలు బార్ అసోసియేష‌న్ భీష్మించింది. మ‌రో వైపు ఉత్త‌రాంధ్ర‌లోని మంత్రులు అమ‌ర్నాథ్‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం, మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ ఆయా ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల్ని ప‌రిపాల‌నా రాజ‌ధానిగా విశాఖ‌ప‌ట్నం ఉండాల‌ని డిమాండ్ చేసేలా స‌మాయాత్తం చేస్తున్నారు.

అమ‌రావ‌తి నుంచి అర‌స‌వెల్లికి రైతులు చేస్తోన్న మ‌హాపాద‌యాత్ర 2.0 ఉత్త‌రాంధ్ర‌పై దండ‌యాత్ర‌గా వైసీపీ మంత్రులు భావిస్తున్నారు. ప్రాంతాల మ‌ధ్య చిచ్చు పెట్టేలా మ‌హాపాద‌యాత్ర ఉంద‌ని అసెంబ్లీ వేదిక‌గా సీఎం జ‌గన్మోహ‌న్ రెడ్డి కూడా విమ‌ర్శ‌ల‌కు దిగారు. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని చూస్తుంటే రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో వీలున్నంత సెంటిమెంట్ ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం ప్ర‌భుత్వం చేస్తున్న‌ట్టుగా ఉంద‌ని టీడీపీ భావిస్తోంది. మూడు ప్రాంతాల మ‌ధ్య అల‌జ‌డి రేపి, అదే స‌మ‌యంలోనే మూడు రాజ‌ధానుల స‌మ‌గ్ర బిల్లును మ‌రోసారి అసెంబ్లీలో ఆమోదింప చేయ‌డానికి జ‌గ‌న్ ఆదేశించిన‌ట్టు అధికారిక వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 capitals issue
  • Amaravathi Capital
  • AP Assembly Sessions
  • Visakhapatnam
  • YS Jagan Mohan Reddy

Related News

People have immense faith in the judicial system: CM Chandrababu

Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు

న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకమే ప్రజలు కోర్టులను ఆశ్రయించడానికి కారణమని అన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ‘మధ్యవర్తిత్వం’ (Mediation) ఒక సమర్థవంతమైన మార్గమని పేర్కొన్నారు. వివాదాలను న్యాయపరంగానే కాక, సామరస్యపూరితంగా పరిష్కరించేందుకు ఇది ఉత్తమమని అభిప్రాయపడ్డారు.

  • Controversy in AP Endowment Department.. The stage is set for the dismissal of the Assistant Commissioner!

    AP : దేవాదాయ శాఖలో వివాదం..అసిస్టెంట్ కమిషనర్ పై వేటుకు రంగం సిద్ధం!

  • Glass bridge ready for tourists on Kailashgiri in Visakhapatnam..Here is the video of the glass bridge!

    Glass Bridge : పర్యాటకుల కోసం విశాఖ కైలాసగిరిపై గాజు వంతెన సిద్ధం..అద్దాల వంతెన వీడియో ఇదిగో!

  • AP tops in exports of pharma and aqua products: CM Chandrababu

    AP: ఫార్మా, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీదే అగ్రస్థానం : సీఎం చంద్రబాబు

  • Ap Assembly Sessions

    AP Assembly Sessions : వచ్చే నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

Latest News

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd