HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Emplyoees No 1 In Govt Funds Misuse

AP Employees: దేశంలోనే ఏపీ ఉద్యోగులు నెంబ‌ర్ 1 భోక్త‌లు

భార‌త దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్ర‌భుత్వం మొత్తం ఖ‌ర్చులో ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్ల వాటా ఎక్కువగా ఉంది. మిగులు బ‌డ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రం వాటా 21శాతం ఉండ‌గా, ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్ల వాటా 36శాతం ఉంది.

  • Author : CS Rao Date : 14-12-2021 - 12:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Copy
Ap Copy

భార‌త దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్ర‌భుత్వం మొత్తం ఖ‌ర్చులో ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్ల వాటా ఎక్కువగా ఉంది. మిగులు బ‌డ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రం వాటా 21శాతం ఉండ‌గా, ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్ల వాటా 36శాతం ఉంది. అంటే తెలంగాణ ఉద్యోగుల కంటే 15శాతం అద‌నంగా ల‌బ్ది పొందుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఇంకా అద‌న‌పు ల‌బ్ది కోసం 14.29 శాతం ఫిట్ మెంట్ కు సిఫార‌స్సు చేయ‌డం ఏపీ రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించ‌డానికి ఉద్యోగ సంఘాల నేత‌లు కంక‌ణం క‌ట్టుకున్నారు.

పీఆర్సీని అమ‌లు చేస్తే 10వేల కోట్ల‌కు పైగా భారం ప‌డ‌నుంది. ఇప్ప‌టికే జీతాలు, పెన్ష‌న్ల రూపంలో 68,340 కోట్లు ఉద్యోగుల‌కు ఖ‌ర్చు పెడుతున్నారు. ఇదంతా బ‌డ్జ‌ట్ లెక్క ప్ర‌కారం నిర‌ర్థ‌క‌ ఖ‌ర్చు కింద చూపిస్తారు. ఏ మాత్రం తిరిగిరాని ఖ‌ర్చుల కింద 68 వేల కోట్ల‌ను ఉద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తోంది. ఉద్యోగ నేత‌ల డిమాండ్ ప్ర‌కారం పీఆర్సీ అమ‌లు చేస్తే మ‌రో 10వేల కోట్ల ఖ‌ర్చు క‌లుస్తోంది. అంటే, 78వేల కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్ల కింద ఏపీ ప్ర‌భుత్వం భ‌రించాల్సి ఉంటుంది. అంటే, రాబోయే రోజుల్లో ఉద్యోగుల జీతాల‌కు ప్ర‌తి నెలా అప్పులు చేయాల్సిన దుస్థితికి ఏపీ ప్ర‌భుత్వం వెళ్ల‌నుంది.

ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం సుమారు 6.50లక్ష‌ల కోట్ల‌కు వ‌ర‌కు అప్పులు చేసింది. ఉన్న ఆస్తుల‌ను అమ్మ‌కానికి పెట్టింది. వివిధ ప్ర‌భుత్వ సంస్థ‌ల నుంచి వ‌చ్చే రాబ‌డిని ష్యూరిటీ కింద చూపిస్తూ అప్పులు తీసుకొచ్చారు. ఆర్బీఐ నిబంధ‌న‌ల‌ను ఎప్పుడో దాటేసింది. ఎఫ్ ఆర్ బీఎం నిబంధ‌న‌ల‌ను ప‌క్క‌న పెడుతూ అప్పులు చేసింది. ఆ విష‌యం ఉద్యోగుల‌కు తెలుసు. పైగా రెండేళ్లుగా జీతాలు ఇంట్లో కూర్చుని తీసుకున్నారు. వారానికి ఐదు రోజుల ప‌నిదినాలు. ఉచిత భోజ‌న, వ‌స‌తులు, ప్ర‌యాణాలు..వైద్యం ఇలా అన్నీ ఫ్రీగా ఉద్యోగులు అనుభ‌విస్తున్నారు. ఇంకా వాళ్ల‌కు సామాన్యుల మీద క‌నిక‌రం లేకుండా పీఆర్సీతో పాటు 71 డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం ముందు ఉంచారు.

11వ ఆర్థిక సంఘం నివేదిక ప్ర‌కారం 2018-19లో జీతాలు, పెన్షన్ల కోసం రూ.52,513 కోట్లు ఖర్చు చేశార‌ని సీఎం జ‌గ‌న్ కు ఇచ్చిన నివేదిక‌లో పొందుప‌రిచారు. తాజాగా 2020-21 నాటికి జీతాలు, పెన్షన్ల వ్యయం రూ.67,340 కోట్లకు చేరింద‌ని వివ‌రించారు. ఎస్ ఓ ఆర్ లో న‌మోదు చేసిన వివ‌రాల ప్ర‌కారం 2018-19లో జీతాలు 84 శాతం ఉంద‌తి. గ‌త ఆర్థిక ఏడాది 2020-21లో జీతాలు, పెన్షన్లు ఎస్ఓఆర్ లో 111 శాతానికి చేరింది.
ప్రభుత్వ మొత్తం ఖర్చులో జీతాలు, పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమ‌ని చీఫ్ సెక్ర‌ట‌రీ స‌మీర్ శ‌ర్మ ఇచ్చిన నివేదిక స్ప‌ష్టం చేసింది. జీతాలు, పెన్షన్ల వ్యయం 2020-21 లో 36 శాతానికి పెరిగింది. 2020-21లో తెలంగాణలో జీతాలు, పెన్షన్ల వ్యయం 21 శాతమేనని నివేదిక‌లో పొందుప‌రిచారు. . ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్ కమిటీ 14.29 శాతం ఫిట్ మెంట్ సిఫారసు చేస్తూ సీఎస్ ఆధ్వ‌ర్యంలోని క‌మిటీ నివేదిక ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap employees
  • ys jagan

Related News

YS Jagan Announces Padayatra

పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్

YS Jagan Announces Padayatra మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రపై జగన్ కీలక ప్రకటన చేశారు. బుధవారం రోజున ఏలూరు నియోజకవర్గం నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాదయాత్ర ఎప్పటి నుంచి చేపడతాననే దానిపై జగన్ క్లారిటీ ఇచ్చారు. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఏడాదిన్నర రోజులు ప్రజల్లో ఉంటానని తెలిపారు. ఇకపై ప్రతి

    Latest News

    • భోజనం తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది?

    • కారు ఉన్న‌వారు ఈ ప‌నులు చేస్తున్నారా?

    • దావోస్ సదస్సులో ప్రేమాయణం… కెమెరాకు చిక్కిన ట్రూడో, కేటీ పెర్రీల రొమాంటిక్ కపుల్

    • రిష‌బ్ పంత్ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌.. ఐపీఎల్‌కు దూరం?

    • చిరంజీవికి కూతురిగా ‘కృతిశెట్టి’ నిజామా ?

    Trending News

      • వాట్సాప్ వినియోగ‌దారుల‌కు మ‌రో గుడ్ న్యూస్‌.. జూమ్‌, గూగుల్ మీట్‌కు గ‌ట్టి పోటీ?!

      • మీ భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌లో ఈ మార్పులు గ‌మ‌నిస్తున్నారా?

      • దేశంలో మ‌రోసారి నోట్ల ర‌ద్దు.. ఈసారి రూ. 500 వంతు?!

      • ఐపీఎల్‌లోకి గూగుల్ ఎంట్రీ.. బీసీసీఐకి భారీ లాభం?!

      • విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌కు షాక్ ఇవ్వ‌నున్న బీసీసీఐ?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd