HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Ys Jagan Repeats Chandrababu Naidu Mistakes

AP Politics : చంద్ర‌బాబు త‌ర‌హాలో జ‌గ‌న్

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల‌ను ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా చేస్తున్నారా? అంటే ఔను అనే వాళ్లు ఎక్కువ‌గా తార‌స‌ప‌డుతున్నారు.

  • Author : CS Rao Date : 29-09-2022 - 12:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Babu Jagan
Babu Jagan

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల‌ను ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా చేస్తున్నారా? అంటే ఔను అనే వాళ్లు ఎక్కువ‌గా తార‌స‌ప‌డుతున్నారు. ఎందుకంటే, మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని 2019 ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఎంత ధీమాతో ఉన్నారో, అదే ధీమా ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిలోనూ క‌నిపిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి , రాజ‌ధాని అంశం రాష్ట్రంలోని 80శాతం ఓట‌ర్లు అనుకూలంగా ఉన్నార‌ని ఆనాడు చంద్ర‌బాబు భ్ర‌మ‌ప‌డ్డారు. అంత‌కు మించిన భ్ర‌మ‌ల్లో ఉంటోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 175 స్థానాల్లోనూ ఎందుకు గెల‌వ‌కూడ‌దంటూ ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కు, కో ఆర్డినేట‌ర్లు, ఇంచార్జిల‌కు క్లాస్ పీకుతున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో వాస్త‌వాలు భిన్నంగా ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌.

గెలుపు మీద ధీమాతో నీరు-చెట్టు ప్రోగ్రామ్ కింద ప‌లు ప‌నుల‌ను ఆనాడు టీడీపీ క్యాడ‌ర్ ద్వారా చంద్ర‌బాబు హడావుడిగా చేయించారు. ఆయ‌న మీద న‌మ్మ‌కంతో వేలాది మంది ఆ పార్టీ క్యాడ‌ర్ కాంట్రాక్ట‌ర్లుగా మారిపోయారు. అప్పులు చేసి కొంద‌రు, ఇళ్ల‌లోని బంగారాన్ని తాక‌ట్టు పెట్టి మ‌రికొంద‌రు అభివృద్ధి ప‌నులు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో నిధులు విడుద‌ల చేస్తార‌ని విశ్వసించారు. సీన్ క‌ట్ చేస్తే, పసుపు-కుంకుమ కింద సుమారు రూ. 20వేల కోట్ల వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు పంచారు. కొంద‌రికి పోస్ట్ డేటెడ్ చెక్కులు పంపిణీ చేశారు. ఫ‌లితంగా గ్రామ‌, మండ‌ల స్థాయిలోని లీడ‌ర్లు కం కాంట్రాక్ట‌ర్లు రోడ్డున ప‌డ్డారు. ఫ‌లితంగా 2019 ఎన్నిక‌ల్లో పోలింగ్ కేంద్రాల వ‌ద్ద నిల‌బ‌డే వాళ్లే లేకుండా పోయారు. దీంతో 23 మంది ఎమ్మెల్యేల‌కు టీడీపీ ప‌రిమితం అయింది.

ప్ర‌స్తుతం వైసీపీలోని ప‌రిస్థితి కూడా ఆనాడు టీడీపీ క్యాడ‌ర్ త‌ర‌హాలోనే ఉంది. మూడేళ్లుగా కాంట్రాక్టులు చేసిన లీడ‌ర్లు కం కాంట్రాక్ట‌ర్లు అప్పులు పాల‌య్యారు. ప్ర‌భుత్వం కాంట్రాక్టు బిల్లుల‌ను క్లియ‌ర్ చేయ‌క‌పోవ‌డంతో మౌనంగా ఉండిపోతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల మాట‌ల‌ను న‌మ్ముకుని కాంట్రాక్టులు చేసి చాలా మంది వైసీపీ ద్వితీయ‌శ్రేణి లీడ‌ర్లు రోడ్డున ప‌డ్డారు. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ కార‌ణంగా ప్ర‌జ‌ల‌తో ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వైసీపీ కొత్త విధానాల వల్ల క్యాండర్ ఆశలు అన్నీ కొట్టుకుపోయాయి. నామినేటెడ్ పదవుల విషయంలో కూడా వారికి తీరని అన్యాయం జరిగింది. పదేళ్ల పాటు భుజాల మీద మోసి అన్నీ అరగదీసుకున్న క్యాడర్ వైసీపీకి దూర‌మ‌వుతూ వ‌స్తోంది.

ముచ్చటగా మూడేళ్ల పాలన పూర్తి చేసుకుని వైసీపీ నాలుగవ ఏట అడుగుపెట్టింది. అయితే ఈ మూడేళ్ళలో క్యాడర్ చేదుని మింగుతూ పడుతూ లేస్తూ అలా సాగుతోంది. ఎప్పటికైనా తమకు ముక్తీ మోక్షం ఉంటాయన్న ఆశతోనే సాగుతోంది. కానీ వారు ఊహించినది ఏమీ జరగడంలేదు. కనీసం వారికి వైసీపీ పెద్దలు, ఎమ్మెల్యేలు కీలక నేతల నుంచి కూడా దగ్గరకు తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు.ఈ పరిణామంతో ఒక్కసారిగా క్యాడర్ స్తబ్దుగా మారిపోయింది. ఇలాంటి ప‌రిస్థితి 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీలో ఉంది. ఇప్పుడు వైసీపీలో క‌నిపిస్తోంది. అంటే, 2024 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో చంద్ర‌బాబు త‌ర‌హాలో మిగులుతార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

`ఒక్కసారి అవ‌కాశం ఇస్తే మ‌రో 30ఏళ్లు సీఎంగా ఉండేలా పాల‌న అందిస్తా. 2029 వ‌ర‌కు మ‌రో పార్టీకి అవ‌కాశం ఉండ‌దు.` ఇదీ ఒక‌ప్పుడు వైసీపీ చీఫ్ చెప్పిన మాట‌లు. కానీ, ఇప్పుడు క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయ‌ని బుధ‌వారం సిట్టింగ్ ల‌కు జ‌గ‌న్ ఇచ్చిన ఫైన‌ల్ వార్నింగ్ ఆధారంగా స్ప‌ష్టం అవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • TDP chandrababu naidu
  • tdp vs ysrcp
  • YS Jagan Mohan Reddy

Related News

Arava Sridhar Janasena Mla

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై జనసేన జనసేన అధిష్టానం సీరియస్‌

JanaSena Party  ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీధర్‌పై ఓ మహిళ చేసిన ఆరోపణలు, విడుదల చేసిన వీడియోల నేపథ్యంలో ఈ అంశంపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. విచారణ పూర్తయ్యేంత వరకు శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు జనసేన పార్ట

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • అల్లు అరుణ్ కు జోడి గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ?

  • బంగారం డిమాండ్ ఢమాల్

  • ఫోన్ ట్యాపింగ్ పై గతంలో KCR చేసిన వ్యాఖ్యలు ఇవే..!!

  • క్యాస్టింగ్ కౌచ్ పై చిరు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన తమ్మారెడ్డి

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

Trending News

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd