HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Jagan Focus On Ap State Tourism

పర్యాటకాన్ని పరుగులు పెట్టించండి : ఏపీ సీఎం జగన్

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో టూరిజం కుంటుపడింది. ఏపీలో పర్యాటక కేంద్రాలు పెద్దగా లేకపోవడంతో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఏపీకి పెద్దగా రావడం లేదు.

  • Author : Balu J Date : 28-10-2021 - 11:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో టూరిజం కుంటుపడింది. ఏపీలో పర్యాటక కేంద్రాలు పెద్దగా లేకపోవడంతో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఏపీకి పెద్దగా రావడం లేదు. గత ప్రభుత్వ హాయంలో పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ రకాల కార్యక్రమాలను రూపొందించారు. గత రెండున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో ఎలాంటి టూరిజం కార్యక్రమాలు జరగడం లేదు.రాష్ట్రంలో టూరిజంకి కేంద్రంగా ఉన్న బోటింగ్ సైతం ఆగిపోయింది. 2019 సెప్టెంబర్ 15 న తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదం జరిగింది. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకు బోటింగ్ను నిలిపివేశారు. అయితే తాజాగా నవంబర్ 7వ తేదీన నుంచి పాపికొండలకు బోట్లు నడిపేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తుంది. ఇప్పటి వరకు టూరిజం ద్వారా పెద్దగా ఆదాయం రాకపోవడంతో ఏపీ ప్రభుత్వం టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది.ఈ సమావేశంలో టూరిజం ప్రాజెక్టులు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా చూడాలని, అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆధునిక సౌకర్యాల లభ్యత వల్ల పర్యాటకం మెరుగుపడుతుందని, ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని , పర్యాటక రంగంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడిన ప్రజలకు మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. విశాఖపట్నంలో లండన్-1 తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

వివిధ కంపెనీలు వివిధ పర్యాటక ప్రాజెక్టులపై రూ.2868.6 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్పై కనీసం రూ. 250 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటూ 48,000 మందికి ఉపాధి కల్పిస్తాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 1,564 కొత్త టూరిజం గదులు అందుబాటులోకి రానున్నాయి. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని వివిధ కంపెనీలు ప్రకటించాయి. ఒబెరాయ్ కంపెనీ విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీ హిల్స్, పిచ్చుకలంకలో ఒబెరాయ్ విలాస్ పేరుతో రిసార్ట్లను ఏర్పాటు చేయనుంది. హయత్ గ్రూప్ విశాఖపట్నంలోని శిల్పారామంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించనుంది. తాజ్ వరుణ్ బీచ్ పేరుతో విశాఖపట్నంలో మరో హోటల్ అండ్ సర్వీస్ అపార్ట్మెంట్ రానుంది. విశాఖపట్నంలో టన్నెల్ అక్వేరియం, స్కై టవర్ నిర్మాణం, విజయవాడలో హయత్ ప్యాలెస్ హోటల్, జ్ఞానగిరి, అనంతపురం జిల్లా పెనుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద ఇస్కాన్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • cm jagan
  • foucs
  • tourism

Related News

Nagababu

Nagababu : ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని నాగబాబు క్లారిటీ

Nagababu : ఐదు, ఆరు ఏళ్ల తర్వాత రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే, తన దృష్టిలో జనసేన ప్రధాన కార్యదర్శిగా కంటే

  • Pawan Kalyan Gift To Bcrick

    Blind Cricketers : అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు నింపిన పవన్ కళ్యాణ్

  • Tamil Nadu

    Accident : ఏపీలో రోడ్డు ప్రమాదాల కారణంగా నిన్న ఒక్కరోజే ఏపీలో 16 మంది మృతి

  • Chandrababu

    CBN : ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం – సీఎం చంద్రబాబు

  • Yarlagadda Hst2

    Gannavaram : బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

Latest News

  • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

  • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

  • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

  • ఆస్ట్రేలియాలో కాల్పుల ఘ‌ట‌న‌.. అనుమానితుడు హైద‌రాబాద్ వాసి!

  • జనవరి నెలలో శుభ ఘడియలు ఇవే!

Trending News

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

    • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd