HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Jagan Focus On Ap State Tourism

పర్యాటకాన్ని పరుగులు పెట్టించండి : ఏపీ సీఎం జగన్

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో టూరిజం కుంటుపడింది. ఏపీలో పర్యాటక కేంద్రాలు పెద్దగా లేకపోవడంతో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఏపీకి పెద్దగా రావడం లేదు.

  • Author : Balu J Date : 28-10-2021 - 11:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో టూరిజం కుంటుపడింది. ఏపీలో పర్యాటక కేంద్రాలు పెద్దగా లేకపోవడంతో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఏపీకి పెద్దగా రావడం లేదు. గత ప్రభుత్వ హాయంలో పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ రకాల కార్యక్రమాలను రూపొందించారు. గత రెండున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో ఎలాంటి టూరిజం కార్యక్రమాలు జరగడం లేదు.రాష్ట్రంలో టూరిజంకి కేంద్రంగా ఉన్న బోటింగ్ సైతం ఆగిపోయింది. 2019 సెప్టెంబర్ 15 న తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదం జరిగింది. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకు బోటింగ్ను నిలిపివేశారు. అయితే తాజాగా నవంబర్ 7వ తేదీన నుంచి పాపికొండలకు బోట్లు నడిపేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తుంది. ఇప్పటి వరకు టూరిజం ద్వారా పెద్దగా ఆదాయం రాకపోవడంతో ఏపీ ప్రభుత్వం టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది.ఈ సమావేశంలో టూరిజం ప్రాజెక్టులు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా చూడాలని, అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆధునిక సౌకర్యాల లభ్యత వల్ల పర్యాటకం మెరుగుపడుతుందని, ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని , పర్యాటక రంగంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడిన ప్రజలకు మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. విశాఖపట్నంలో లండన్-1 తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

వివిధ కంపెనీలు వివిధ పర్యాటక ప్రాజెక్టులపై రూ.2868.6 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్పై కనీసం రూ. 250 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటూ 48,000 మందికి ఉపాధి కల్పిస్తాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 1,564 కొత్త టూరిజం గదులు అందుబాటులోకి రానున్నాయి. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని వివిధ కంపెనీలు ప్రకటించాయి. ఒబెరాయ్ కంపెనీ విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీ హిల్స్, పిచ్చుకలంకలో ఒబెరాయ్ విలాస్ పేరుతో రిసార్ట్లను ఏర్పాటు చేయనుంది. హయత్ గ్రూప్ విశాఖపట్నంలోని శిల్పారామంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించనుంది. తాజ్ వరుణ్ బీచ్ పేరుతో విశాఖపట్నంలో మరో హోటల్ అండ్ సర్వీస్ అపార్ట్మెంట్ రానుంది. విశాఖపట్నంలో టన్నెల్ అక్వేరియం, స్కై టవర్ నిర్మాణం, విజయవాడలో హయత్ ప్యాలెస్ హోటల్, జ్ఞానగిరి, అనంతపురం జిల్లా పెనుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద ఇస్కాన్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • cm jagan
  • foucs
  • tourism

Related News

Gade Venkatreddy

Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవ

  • Tdp Mla Bandaru Sravani

    Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

  • ACB raids

    ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

  • Online Petrol

    Petrol Price : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ప‌దిరోజుల్లో నాలుగు సార్లు

Latest News

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd