HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ap Cm Jagan Focus On Ap State Tourism

పర్యాటకాన్ని పరుగులు పెట్టించండి : ఏపీ సీఎం జగన్

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో టూరిజం కుంటుపడింది. ఏపీలో పర్యాటక కేంద్రాలు పెద్దగా లేకపోవడంతో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఏపీకి పెద్దగా రావడం లేదు.

  • By Balu J Published Date - 11:08 AM, Thu - 28 October 21
  • daily-hunt

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో టూరిజం కుంటుపడింది. ఏపీలో పర్యాటక కేంద్రాలు పెద్దగా లేకపోవడంతో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఏపీకి పెద్దగా రావడం లేదు. గత ప్రభుత్వ హాయంలో పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ రకాల కార్యక్రమాలను రూపొందించారు. గత రెండున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో ఎలాంటి టూరిజం కార్యక్రమాలు జరగడం లేదు.రాష్ట్రంలో టూరిజంకి కేంద్రంగా ఉన్న బోటింగ్ సైతం ఆగిపోయింది. 2019 సెప్టెంబర్ 15 న తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదం జరిగింది. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకు బోటింగ్ను నిలిపివేశారు. అయితే తాజాగా నవంబర్ 7వ తేదీన నుంచి పాపికొండలకు బోట్లు నడిపేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తుంది. ఇప్పటి వరకు టూరిజం ద్వారా పెద్దగా ఆదాయం రాకపోవడంతో ఏపీ ప్రభుత్వం టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది.ఈ సమావేశంలో టూరిజం ప్రాజెక్టులు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా చూడాలని, అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆధునిక సౌకర్యాల లభ్యత వల్ల పర్యాటకం మెరుగుపడుతుందని, ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని , పర్యాటక రంగంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడిన ప్రజలకు మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. విశాఖపట్నంలో లండన్-1 తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

వివిధ కంపెనీలు వివిధ పర్యాటక ప్రాజెక్టులపై రూ.2868.6 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్పై కనీసం రూ. 250 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటూ 48,000 మందికి ఉపాధి కల్పిస్తాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 1,564 కొత్త టూరిజం గదులు అందుబాటులోకి రానున్నాయి. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని వివిధ కంపెనీలు ప్రకటించాయి. ఒబెరాయ్ కంపెనీ విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీ హిల్స్, పిచ్చుకలంకలో ఒబెరాయ్ విలాస్ పేరుతో రిసార్ట్లను ఏర్పాటు చేయనుంది. హయత్ గ్రూప్ విశాఖపట్నంలోని శిల్పారామంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించనుంది. తాజ్ వరుణ్ బీచ్ పేరుతో విశాఖపట్నంలో మరో హోటల్ అండ్ సర్వీస్ అపార్ట్మెంట్ రానుంది. విశాఖపట్నంలో టన్నెల్ అక్వేరియం, స్కై టవర్ నిర్మాణం, విజయవాడలో హయత్ ప్యాలెస్ హోటల్, జ్ఞానగిరి, అనంతపురం జిల్లా పెనుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద ఇస్కాన్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • cm jagan
  • foucs
  • tourism

Related News

Urea Black Market

Urea Shortage : ప్రభుత్వ అవినీతి వల్లే యూరియా కొరత – బొత్స

Urea Shortage : యూరియా కొరతతో పాటు, ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యమైందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదని ఆయన విమర్శించారు

  • Ap Egg

    Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • Ap Universal Health Policy

    Universal Health Policy : యూనివర్సల్ హెల్త్ పాలసీ పూర్తి వివరాలు!

  • Glass bridge ready for tourists on Kailashgiri in Visakhapatnam..Here is the video of the glass bridge!

    Glass Bridge : పర్యాటకుల కోసం విశాఖ కైలాసగిరిపై గాజు వంతెన సిద్ధం..అద్దాల వంతెన వీడియో ఇదిగో!

Latest News

  • Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

  • Kutami Super 6 : అనంతపురంలో ఈ నెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ

  • Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్

  • TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?

  • Venezuela : కరేబియన్‌లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd