HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Chandrababu Naidu Letter To Union Minister Piyush Goyal

CM Chandrababu: యూఎస్ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌ర‌పండి.. కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు చంద్ర‌బాబు లేఖ‌

కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు.

  • By News Desk Published Date - 10:18 PM, Sun - 6 April 25
  • daily-hunt
Chandrababu Naidu
Chandrababu Naidu

CM Chandrababu: కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవ‌ల ప‌లు దేశాల‌పై ప్ర‌తీకార సుంకాలు విధించిన విష‌యం తెలిసిందే. భార‌త‌దేశం నుంచి అమెరికాకు ఉత్ప‌త్తి అయ్యే దిగుమ‌తుల‌పై 27శాతం సంకాల‌ను విధిస్తున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు. ట్రంప్ నిర్ణ‌యం ప‌ట్ల ఆక్వా ఉత్ప‌త్తుల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. భార‌త్ నుంచి ఇత‌ర‌ దేశాల‌కు ఎగుమ‌తి అవుతున్న మాంస ఉత్ప‌త్తుల్లో రొయ్య‌ల‌ది మూడో స్థానం. ఏపీలోని ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నుంచే సింహ‌భాగం ఆక్వా ఉత్ప‌త్తులు ఎగుమ‌తి అవుతున్నాయి. ట్రంప్ నిర్ణ‌యంతో రొయ్య‌ల సాగు దారుల‌కు న‌ష్టాలు వాటిల్లే ప‌రిస్థితి ఏర్ప‌డింది. తాజాగా విష‌యంపై వివ‌రిస్తూ కేంద్ర మంత్రికి సీఎం చంద్ర‌బాబు లేఖ రాశారు.

Also Read: PM Modi: డీఎంకే ప్ర‌భుత్వంపై ప్ర‌ధాని మోదీ ప‌రోక్ష విమ‌ర్శ‌లు.. సంత‌క‌మైనా త‌మిళంలో చేయండంటూ..

భారతదేశం నుంచి వెళ్లే సముద్రపు ఆహార ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం 27 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల విలువైన సముద్రపు ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వీటిలో రొయ్యలే 92 శాతం వాటా కలిగి ఉన్నాయి. అమెరికా దేశానికి రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారత్‌పై 27 శాతం దిగుమతి సుంకం విధించడంతో ఆక్వా రైతాంగం నష్టపోతోంది. ఈక్వెడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10 శాతం పన్ను మాత్రమే విధిస్తోంది అమెరికా. ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ.. వారికి అనుకూలంగా మారుతోంది. దీనికి తోడు మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77 శాతం కౌంటర్‌ వెయిలింగ్ డ్యూటీ భారాన్ని మోస్తున్నారు. అన్ని సుంకాలను కలుపుకుంటే ఈక్వెడార్‌కు భారతదేశానికి మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20 శాతం ఉంటోంద‌ని చంద్ర‌బాబు లేఖ‌లో పేర్కొన్నారు.

Also Read: BRS Silver Jubilee: బీఆర్ఎస్‌కు మరో షాక్.. రజతోత్సవ సభకు అనుమతి డౌటే ?

సుంకాల నుంచి ఆక్వా ఉత్ప‌త్తులు మిన‌హాయింపు పొందేలా యూఎస్ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని చంద్ర‌బాబు లేఖ‌లో కేంద్ర మంత్రిని కోరారు. ఏపీ జీడీపీలో మ‌త్స్య‌రంగం కీల‌కంగా ఉంద‌న్న చంద్ర‌బాబు.. సంక్షోభ స‌మ‌యంలో ఆక్వా రైతుల‌కు అండ‌గా ఉండాల‌ని కోరారు. అధిక సుంకాల వ‌ల్ల మ‌న ఆర్డ‌ర్ల‌ను ఇత‌ర దేశాలు ర‌ద్దు చేసుకుంటాయ‌ని, ఏపీ శీత‌ల గిడ్డంగుల్లోనూ నిల్వ కోసం స్థ‌లం లేద‌ని, ఆక్వా రైతులు గంద‌ర‌గోళంగా ఉన్నార‌ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

మ‌రోవైపు ఇంకా పంట సిద్ధంగా ఉంది. 27శాతం సుంకాల కారణంగా రైతుల నుంచి పంట సేకరించడం ఎగుమతిదారులు నిలిపివేశారు. ఈ పరిణామాలు రాష్ట్ర ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు ఇలా అందరికీ సమస్యలు ఎదురయ్యాయి. సుంకాల నుంచి రొయ్యలను మినహాయింపు జాబితాలో చేర్చేలా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరుతున్నా. సకాలంలో మీరు దీనిపై జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తే ఆక్వాపై ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధిని కాపాడవచ్చు అంటూ లేఖ రాశారు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aqua sector
  • chandrababu naidu
  • Donald Trump
  • Retaliatory tariffs
  • Union Minister Piyush Goyal

Related News

Nuclear Testing

Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం 'ట్రూత్ సోషల్'లో ఒక పోస్ట్ చేస్తూ అణు ఆయుధాల పరీక్షను తక్షణమే ప్రారంభించాలని తాను ఆదేశించినట్లు తెలిపారు. ట్రంప్ తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు.

  • Donald Trump

    Warning Bell : ట్రంప్ కు వార్నింగ్ బెల్!

Latest News

  • Pakistan: పాకిస్తాన్‌లో మహిళల భద్రతపై ఆందోళన.. నాలుగేళ్లలో 7,500 కంటే ఎక్కువ హత్యలు!

  • Isro Moon Maps: చంద్రయాన్-2 పెద్ద విజయం.. చంద్రుని ధ్రువ ప్రాంతాల హై-క్వాలిటీ డేటా విడుదల చేసిన ఇస్రో!

  • Y+ Security: లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడికి వై+ భద్రత.. ఏంటి ఈ భద్రతా వ్యవస్థ?

  • IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు!

  • Electric Two-Wheeler: రూ. 65వేల‌కే ఎలక్ట్రిక్ టూ-వీలర్.. కేవలం 1000 మందికి మాత్ర‌మే ఛాన్స్‌!

Trending News

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd