AP CID: ఏపీ సీఐడీకి భంగపాటు
ఏపీ సీఐడీకి న్యాయస్థానాల్లో తరచూ భంగపడుతోంది. అరెస్ట్ చేసిన వాళ్లను జైళ్లకు పంపించలేక పోతున్నారు
- By CS Rao Published Date - 01:32 PM, Fri - 4 November 22
ఏపీ సీఐడీకి న్యాయస్థానాల్లో తరచూ భంగపడుతోంది. అరెస్ట్ చేసిన వాళ్లను జైళ్లకు పంపించలేక పోతున్నారు. అంటే, బలమైన కారణాలతో నిందితులను అరెస్ట్ చేయడంలేదని అర్థం. రిమాండ్ విధించకుండా న్యాయస్థానాల నిర్ణయం తీసుకోవడం వెనుక ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారని టీడీపీ చేస్తోన్న ఆరోపణలకు బలాన్ని ఇస్తోంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అరెస్ట్ విషయంలోనూ సీబీఐ భంగపడింది.
అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేశ్ రిమాండ్ కు విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా ఈ కేసులో అయ్యన్నతో పాటు రాజేశ్ కు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి ఈ కేసులో సీఐడీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టవచ్చంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేవలం 2 సెంట్ల భూమి ఆక్రమణకు అయ్యన్న, ఆయన ఇద్దరు కుమారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించారన్న ఆరోపణల కింద గురువారం తెల్లవారుజామున అయ్యన్నతో పాటు రాజేశ్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Amaravati: అమరావతి పై `సుప్రీం` ఆశ
నిందితులిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రానికి విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును పరిశీలించిన న్యాయమూర్తి నిందితులపై మోపిన ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని తేల్చారు. దీంతో అక్కడికక్కడే బెయిల్ మంజూరు చేయడంతో పాటు నిందితులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సీఐడీని కోర్టు ఆదేశించింది.
Related News
AIMIM Chief: ఏపీ రాజకీయాలపై ఒవైసీ జోస్యం.. జగన్ కు జైకొట్టిన ఎంఐఎం చీఫ్
AIMIM Chief: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగిస్తారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)తో చేతులు కలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచారం