Amaravati: అమరావతి పై `సుప్రీం` ఆశ
అమరావతి రాజధానిపై విచారణ చేసేందుకు సుప్రీం కోర్టు సిద్ధం అయింది. చీఫ్ జస్టిస్ లలిత్ ప్రయోగించిన `నాగ్ బిఫోర్ మీ`ని దాటింది.
- By CS Rao Published Date - 01:25 PM, Fri - 4 November 22
అమరావతి రాజధానిపై విచారణ చేసేందుకు సుప్రీం కోర్టు సిద్ధం అయింది. చీఫ్ జస్టిస్ లలిత్ ప్రయోగించిన `నాగ్ బిఫోర్ మీ`ని దాటింది. సుప్రీం కోర్టు జడ్జిలు కేఎం జోసెఫ్, రుషికేష్ రాయ్ తో కూడిన బెంచ్ కు అమరావతి ఇష్యూ చేరింది. ఆ మేరకు సుప్రీం కోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
వాస్తవంగా ఈనెల ఒకటో తేదీన సుప్రీం కోర్టు విచారణ జరపాలి. ఆ దిశగా ఆందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, చీఫ్ జస్టిస్ లలిత్ మరో బెంచ్ కు మార్చాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. తాను లేని బెంచ్ కు బదిలీ చేయాలని సూచించారు. ఆ మేరకు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పున సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం అమరావతి రాజధాని మీద స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.
Also Read: Kodali Nani: చంద్రబాబు పవన్ కల్యాణ్ మర్డర్ కు ప్లాన్ : కొడాలి నాని!
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మీద జరిగే విచారణలో తమనూ ఇంప్లీడ్ చేయాలని అమరావతి జేఏసీ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. అంతేకాదు, పలువురు వ్యక్తిగతంగా వేసిన ఇంప్లీడ్ పిటిషన్లను కూడా ఈ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. వీటిన్నిటిపైన శుక్రవారం సుప్రీం కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉందని ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తం మీద అమరావతి రాజధాని వ్యవహారం సుప్రీంకు ఎక్కడంతో ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.
Related News
TDP : తిరువూరు టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాస్.. త్వరలో అధికారికంగా ప్రకటించనున్న అధిష్టానం
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలో తమ దూకుడిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలను