HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cabinet Meeting Green Signal For Investments Worth 2 Lakh Crores

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్

  • Author : Vamsi Chowdary Korata Date : 14-05-2026 - 9:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
Chandrababu

రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా, భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు అమరావతి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో సుమారు రూ.2.01 లక్షల కోట్ల విలువైన 25 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేయనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 39,067 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

ఇప్పటికే 17వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆమోదం పొందిన ఈ ప్రతిపాదనలకు కేబినెట్ తుది ఆమోదం తెలపనుంది. వీటిలో అత్యంత కీలకమైనదిగా విశాఖపట్నంలో రూ.1.08 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ ప్రాజెక్టు ఉంది. ఐటీ, డిజిటల్ మౌలిక వసతుల రంగంలో ఈ ప్రాజెక్టు విశాఖకు మరింత ప్రాధాన్యం చేకూర్చనుంది.

ఇవే కాకుండా, శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.51,300 కోట్లతో రిలయన్స్ ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్, కడప జిల్లాలో రూ.12,297 కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు, తిరుపతి జిల్లాలో రూ.2,508 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ యూనిట్, శ్రీసిటీలో రూ.6,100 కోట్లతో అపోలో టైర్స్ యూనిట్ వంటి భారీ ప్రాజెక్టులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

అలానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేసిన పొదుపు చర్యల సూచనలపైనా కేబినెట్ సమావేశం అనంతరం ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రభుత్వ వ్యయ నియంత్రణ చర్యలపై సమీక్షించి తగు సూచనలు చేయనున్నారని సమాచారం. జిల్లా పర్యటనల సమయంలో తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోగా, ఇదే నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అనుసరించే పరిస్థితి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adani Energy
  • Andhra Pradesh Investments
  • AP Cabinet Meeting
  • AP CM Chandrababu Naidu
  • Apollo Tyres
  • google ai data center
  • Royal Enfield
  • solar power plant

Related News

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd