HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ap Budget 2024 Ysrcp Mlc Varudu Kalyanis Strong Criticism Of Ap Budget

AP Budget 2024: ఏపీ బడ్జెట్ పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఘాటు వ్యాఖ్యలు..

వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఏపీ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనేక పథకాలు ప్రకటించినా, వాటికి బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయించలేదని ఆరోపించారు. రైతులకు హామీ ఇచ్చిన రూ. 20 వేల బడ్జెట్‌లో కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, అలాగే ఇతర పథకాలకు నిధులు సరిపోలేదని ఆమె మండిపడ్డారు.

  • By Kode Mohan Sai Published Date - 05:48 PM, Mon - 11 November 24
  • daily-hunt
Varudu Kalyani Comments On Ap Budget
Varudu Kalyani Comments On Ap Budget

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆమె, కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాటు ఒటాన్ బడ్జెట్ అమలు చేసి, దేశ చరిత్రలోనే ఎవరూ చేయని చెత్తరికార్డును నెలకొల్పిందన్నారు. “ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా” అన్నట్లు కూటమి బడ్జెట్ ఉందని, ఎన్నో పథకాలు ప్రకటించినప్పటికీ, వాటికి నిధులు కేటాయించలేదన్నారు. ప్రజలను మోసం చేసినట్లు కూటమి ప్రభుత్వం పాలనపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

రైతులకు ప్రతి సంవత్సరం 20వేలు ఇస్తామని మాటలు చెప్పారు కానీ, కేవలం రూ.5 వేల కోట్లే నిధులు కేటాయించారని ఆమె ఆరోపించారు. అలాగే, “తల్లికి వందనం” పథకానికి కేవలం రూ.5300 కోట్లు కేటాయించడం ఏ మూలకూ సరిపోదని ఆమె చెప్పారు. ఈ బడ్జెట్ ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన వాగ్దానంకి, నిధుల కేటాయింపు లోపం మరియు పథకాల అమలులో గందరగోళం ఉందని ఆమె పేర్కొన్నారు.

ఏపీ బడ్జెట్‌పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర విమర్శలు:

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సగం సగం కేటాయించి ప్రజలను మభ్యపెడుతున్నది అన్నారు.

మహాశక్తి పథకం కింద మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ, ఆ పథకానికి నిధులు కేటాయించలేదన్నారు. అలాగే, 50 లక్షల నిరుద్యోగులకు నెలకు 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, నిధుల కేటాయింపు లేదు అని ఆమె ప్రశ్నించారు.

ఉచిత బస్సు సౌకర్యం కోసం కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని, ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు కూడా నిధులు కేటాయించలేదని చెప్పారు.

వాలంటీర్లకు గౌరవ వేతనం రూ. 10 వేల వరకు పెంచాలని హామీ ఇచ్చినప్పటికీ, ఆ పెంపుదల గురించి కూడా ఏది స్పష్టత లేదని అన్నారు. రైతుల పంటలకు ధరల స్థిరీకరణ నిధికి సంబంధించిన అంశం కూడా బడ్జెట్‌లో గుర్తించబడలేదు అని ఆమె ప్రశ్నించారు. లారీ, ఆటో, టాక్సీ డ్రైవర్లకు, మత్స్యకారుల భరోసా పథకానికి కూడా నిధులు కేటాయించలేదని ఆమె ప్రశ్నించారు.

ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం అనుచితంగా మభ్యపెడుతూ, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. ప్రజలను నిట్టనిలువుగా మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరాటం చేస్తుందంటూ ఆమె స్పష్టం చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Budget 2024
  • AP Budget 2024-2025
  • AP MLC Varudu Kalyani
  • Nara Chandrababu Naidu
  • tdp
  • Varudu Kalyani
  • ysrcp

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • If you don't come to the assembly, there will be by-elections: Raghuramakrishna Raju warns Jagan

    AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

    Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

  • Lokesh's satire on Jagan

    Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్‌ పై లోకేశ్ సెటైర్

  • Ys Jagan

    YS Jagan : జగన్ పిచ్చికి పరాకాష్ట.. వీఐపీ పాస్ ఉంటేనే దర్శనమిస్తాడట..!

Latest News

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

Trending News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd