AP Special Status: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమే: ఏపీ బీజేపీ
ప్రజల్లో విశ్వాసం నింపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర బీజేపీ దృష్టి సారించింది. గత ఎన్నికల్లో ఓట్ల శాతం కనిష్ట స్థాయికి చేరినందున రాష్ట్రంలో పార్టీ ఇమేజ్ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తోంది.
- By Praveen Aluthuru Published Date - 10:47 PM, Tue - 5 March 24
AP Special Status: ప్రజల్లో విశ్వాసం నింపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర బీజేపీ దృష్టి సారించింది. గత ఎన్నికల్లో ఓట్ల శాతం కనిష్ట స్థాయికి చేరినందున రాష్ట్రంలో పార్టీ ఇమేజ్ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై చర్చించేందుకు పార్టీ సమావేశాలు నిర్వహించింది.
రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి లేవనెత్తుతున్నాయని అభిప్రాయపడింది. అందుకే పార్టీ జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని, అయితే ప్యాకేజీకి సమానమైన ప్రత్యేక ప్యాకేజీకి కట్టుబడి ఉన్నామని బీజేపీ చెప్తుంది. మరి బీజేపీ నిర్ణయాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారో చూడాలి. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తుంది. మరోవైపు అధికార పార్టీ వైసీపీ ప్రత్యేక హోదా విషయంపై స్పష్టత ఇవ్వకుండా పాలన కొనసాగిస్తుంది.
తాజా సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలన్నీటికీ కేంద్రం నిధులిస్తుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఘనత తీసుకుంటోందని ప్రజలకు వివరించాలని బీజేపీ భావిస్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తొందరపాటు చూపబోదనే తెలిపారు పురందేశ్వరి. ప్రజల అభీష్టాలకు వ్యతిరేకంగా బీజేపీ ఏమీ చేయదని స్పష్టం చేసిందామె. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోపై సీరియస్ గా వ్యహరించబోతుంది. దళితులు, బలహీన వర్గాలు మరియు రైతుల సంక్షేమం మరియు అభివృద్ధికి పెద్దపీట వేయనున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, నీటిపారుదల కోసం చర్యలు, పరిశ్రమలను ఆకర్షించే విధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల మధ్య రోడ్డు అనుసంధానం, ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడం, బ్యాంకు రుణాల గురించి మేనిఫెస్టోలో పొందుపర్చనున్నారు.
Also Read: AP Politics: ధర్మవరం బరిలో పరిటాల శ్రీరామ్
Related News
Raghunandan Rao : గల్లీలో.. ఢిల్లీలో లేని.. కారును గెలిపిస్తే మిగిలేది శూన్యమే: రఘునందన్ రావు
Raghunandan Rao:మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ జరిగిన కిసాన్ మోర్చా(kisan morcha) సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, రెవంత్రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని ఆయన అన్నారు. We’re now