Siddham in Palnadu: 15 లక్షల మందితో పల్నాడులో సిద్ధం సభ
వచ్చే నెల మూడో తేదీన పల్నాడులో సిద్ధాం సభ జరగనుంది, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పల్నాడు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ సభకు 15 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 02:56 PM, Tue - 27 February 24
Siddham in Palnadu: వచ్చే నెల మూడో తేదీన పల్నాడులో సిద్ధాం సభ జరగనుంది, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పల్నాడు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ సభకు 15 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మార్చ్ 3న పల్నాడులో సిద్ధాం సభ జరగనుంది. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సభను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. గతంలో జరిగిన మూడు సిద్దం సభలకు హాజరైన జనసందోహం మాదిరిగానే ప్రజలను సమీకరించి సభను విజయవంతం చేయాలని క్యాడర్ను కోరారు. సభకు హాజరైన ప్రజలను చూసి ప్రతిపక్ష పార్టీలు భయపడేలా ఉండాలన్నారు. రాబోయే సభకు భారీ సంఖ్యలో ప్రజలను సమీకరించడం ప్రాముఖ్యతపై అనైల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశం రాజకీయ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలని అన్నారు.
తాజాగా టీడీపీ జనసేన కూటమి సీట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టాడని అన్నారు. హోల్ సేల్ గా కాపులను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తాకట్టుపెట్టారని వ్యాఖ్యానించారు.
Alslo Read: KCR : కేటీఆర్, హరీష్ రావు, కవితతో కేసీఆర్ భేటీ.. వ్యూహ రచన షురూ..!
Related News
Rise Survey on AP : ఏపీలో కూటమిదే విజయం
కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు స్థానాల్లో గెలువనున్నాయని , అధికార వైసీపీ పార్టీ 41 నుంచి 54 స్థానాల లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది