HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Chief Minister Slams Rival Over Rally Deaths

Chief Minister Jagan Mohan Reddy: ఎనిమిది మంది మృతికి చంద్రబాబే కారణం: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) నెల్లూరులోని కందుకూరులో నిర్వహించిన రోడ్‌షోలో ఎనిమిది మంది మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పబ్లిసిటే ఈ విషాదానికి దారితీసిందని ఆయన అన్నారు. దీనితో పాటు, చంద్రబాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Author : Gopi Date : 31-12-2022 - 10:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Jagan
Cm Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) నెల్లూరులోని కందుకూరులో నిర్వహించిన రోడ్‌షోలో ఎనిమిది మంది మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పబ్లిసిటే ఈ విషాదానికి దారితీసిందని ఆయన అన్నారు. దీనితో పాటు, చంద్రబాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మృతుల పట్ల జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఇది విచారకరమైన సంఘటన అని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

శుక్రవారం నర్సీపట్నంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎనిమిది మందిని చంపడం చాలా హేయమైనది, అవమానకరం. తమ వాహనాన్ని బారికేడ్‌గా మలచుకుని ఎనిమిది మందిని చంపేశారు.. ఇంత దారుణంగా ఉంటుందా?” టీడీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బాబు గతంలో కూడా ఇలాగే చేశారన్నారు. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా 29 మంది మృతికి కారణమయ్యాడని, ఇది తనకు కొత్తేమీ కాదని, కేవలం తన పబ్లిసిటీని మాత్రమే పట్టించుకుంటాడని సీఎం జగన్ అన్నారు. అంతేకాకుండా 8 మంది మరణించిన ఒక రోజు తర్వాత ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా కావలి పట్టణంలో మరో రోడ్‌షో చేపట్టారని విమర్శించారు. ఎనిమిది మంది అమాయకుల మరణానికి నైతిక బాధ్యత వహించే బదులు టీడీపీ అధినేత ప్రజలపై నిందలు మోపారని అన్నారు.

Also Read: Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

రాజకీయ ప్రయోజనాల కోసం చనిపోయిన వారి కులాలను నాయుడు ప్రస్తావించడంపై ముఖ్యమంత్రి జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాలంటే షూటింగ్, డైలాగ్, డ్రోన్ షాట్, డ్రామా కాదన్నారు. రాజకీయాలు అంటే రైతులు, సామాజికంగా అణగారిన వర్గాల కుటుంబాల్లో మార్పు తీసుకురాగలమని అన్నారు. తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దఎత్తున వక్తలు, భారీ హోర్డింగ్‌లు, బైక్‌ ర్యాలీలు పెద్దఎత్తున ఆందోళనలు సృష్టించి పోలీసులను అడ్డుకోవడంలో ప్రధాన పాత్ర పోషించారని, దీంతో ఈ ఘటనకు దారి తీసిందని, కందుకూరు టౌన్‌ పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 174 కింద కేసు నమోదు చేశారని తెలిపారు. కందుకూరు పట్టణంలోని శివాలయం వీధిలో ఈ ఘటన చోటుచేసుకుందని, ప్రధాన రహదారుల్లో ర్యాలీని అనుమతించామని, చిన్నరోడ్లలో కూడా ర్యాలీని చేపట్టారని, దీనిపై విచారణకు డీఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తామని నెల్లూరు ఎస్పీ విజయరావు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Chief Minister
  • ap politics
  • chandrababu
  • CM Jagan Reddy
  • Nellore
  • Rally Deaths

Related News

Free Mineral Water Plant Inaugurated in Lakshmipuram

Lakshmipuram: లక్ష్మీపురంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం..

పేదలకు వరంలా మౌనిక చారిటబుల్ ట్రస్ట్ సేవలు.. రాపూరు: పేద ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని నెల్లూరు ఆర్డీవో నాగ సంతోషిణి అనూష కొనియాడారు. శుక్రవారం రాపూరులోని 10వ వార్డు లక్ష్మీపురం కాలనీలో మౌనిక చారిటబుల్ ట్రస్ట్, దేవీ సీ ఫుడ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd