HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Air India Flight Leaves 17 Passengers At Vijayawada Airport Takes Off 4 Hours Prior

Air India Flight: ముందే వెళ్లిపోయిన ఫ్లైట్.. ఎయిర్ ఇండియాపై ప్రయాణికుల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ విమానాశ్రయం నుంచి కువైట్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) నిర్ణీత సమయానికి నాలుగు గంటల ముందే బయలుదేరింది. దీంతో 17 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండిపోయారు.

  • Author : Gopichand Date : 30-03-2023 - 10:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indian Aviation History
Indian Aviation History

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ విమానాశ్రయం నుంచి కువైట్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) నిర్ణీత సమయానికి నాలుగు గంటల ముందే బయలుదేరింది. దీంతో 17 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండిపోయారు. ఈ ఘటన బుధవారం జరిగింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX-695 విజయవాడ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 1:10 గంటలకు కువైట్‌కు బయలుదేరాల్సి ఉంది. కానీ ఉదయం 9:55 గంటలకు బయలుదేరింది.

ఫ్లైట్ వెళ్లిన కొద్దిసేపటికి కువైట్ వెళ్లేందుకు 17 మంది ప్రయాణికులు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం 1:10 నిమిషాలకు వెళ్లాల్సిన విమానం ముందే వెళ్లడమేంటంటూ ఎయిర్ ఇండియా సిబ్బందిన నిలదీశారు. ఫ్లైట్ ఉదయం 9:55 నిమిషాలకే బయల్దేరుతుందని మెసేజ్ పెట్టామని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. తమకు ఎలాంటి మెసేజ్‌లు రాలేదని ఎయిర్ ఇండియాపై వారు అసహనం వ్యక్తం చేశారు.

Also Read: Durantho Express: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్.. బొలెరో ధ్వంసం

ఈ సమాచారాన్ని ప్రయాణికులకు అందించినట్లు ఎయిర్ ఇండియా అధికారులు చెబుతున్నారు. అయితే తమకు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు వాపోయారు. ఏజెంట్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి ఏజెంట్ల ద్వారా రీషెడ్యూల్ గురించి సమాచారం లేదు. ఆ ప్రయాణికులు కువైట్ వెళ్లేందుకు వచ్చే వారం వరకు వేచి ఉండాల్సి ఉంటుందని గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. రీషెడ్యూల్ తర్వాత బుక్ చేసుకున్న ప్రయాణికులు మాత్రమే విమానం ఎక్కారు.

తిరుచ్చి నుంచి విజయవాడకు ఉదయం 9 గంటలకు చేరుకున్న విమానం 9.55 గంటలకు కువైట్‌కు బయలుదేరింది. ఈ విమానం తిరుచ్చి నుంచి విజయవాడకు మధ్యాహ్నం 12.15 గంటలకు చేరుకుని 1.10 గంటలకు కువైట్‌కు బయలుదేరుతుందని ముందుగా ప్రకటించారు. అంతర్జాతీయ కార్యకలాపాలలో అసాధారణం కాదని, కొన్ని సమస్యల కారణంగా విమానయాన సంస్థ బయలుదేరే సమయాన్ని రీషెడ్యూల్ చేసిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానయాన సంస్థ కొంతమంది ప్రయాణీకులకు సమాచారాన్ని అందించిందని కూడా ఆయన పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • air india
  • Andhrapradesh
  • Aviation
  • Kuwait
  • vijayawada airport

Related News

Political Party Banner

తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం

Political Party Banner : తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర తమిళనాడు యువకులు అన్నా డీఎంకే ఫ్లెక్సీతో హల్చల్ చేయడం కలకలం రేపింది. నిబంధనలు ఉల్లంఘించి ఆలయం వద్ద రాజకీయ ప్రకటనలు చేయడంపై టీటీడీ స్పందించింది. ఫ్లెక్సీని ప్రదర్శించి, రీల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు, స్విమ్స్ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తూ, రోగుల సహాయకుల కోసం కొత్త సౌకర్యాలు ప్రారంభ

  • Renamed Grama Ward Sachival

    AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

  • Bullet Railway Andhra Prade

    ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

  • Special Trains Sankranti 20

    దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

  • Farmers Drumstick

    ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

Latest News

  • నీళ్లు తాగే విషయంలో పొరపాటు చేస్తే క్యాన్సర్ వ‌స్తుందా?!

  • అరటిపండు తింటే లాభమా నష్టమా..డాక్టర్ చెప్పిన రహస్యాలు ఇవే

  • సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • ‘వీబీ జీ రామ్‌ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

  • రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

Trending News

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd