HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >A Permanent Solution Should Be Found To The Annamayya Project Woes Apcc Chief Sharmila

Sharmila: అన్నమయ్య ఇక అనాథ ప్రాజెక్టేనా?: వైఎస్ షర్మిల

అలాగే అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.

  • By Gopichand Published Date - 08:35 PM, Mon - 1 September 25
  • daily-hunt
YS Sharmila
YS Sharmila

Sharmila: అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఐదు సంవత్సరాలు గడిచినా, పునర్నిర్మాణానికి దిక్కులేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ‘అనాథ ప్రాజెక్ట్’గా మార్చివేశాయని ఆమె విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు దుర్ఘటనలో 39 మందిని బలిగొన్న ఈ ఘోర విపత్తులో జరిగిన నష్టాన్ని పూడ్చే మనసు ప్రభుత్వాలకు లేదని ఆమె ఆవేదన చెందారు. ఐదు గ్రామాలు కొట్టుకుపోయినా పునరావాసానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, సర్వం కోల్పోయిన నిరాశ్రయులను నేటికీ ఆదుకున్నది లేదని ఆమె అన్నారు.

గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ. 800 కోట్లతో మరమ్మత్తులు చేస్తామని హడావిడి చేశారే తప్ప ప్రాజెక్టును కట్టింది లేదని వైఎస్ షర్మిల అన్నారు. పునరుద్ధరణ పేరుతో మూడు ఏళ్లు గడిపారే తప్పా, తట్టెడు మట్టి కూడా వేయలేదని ఆమె దుయ్యబట్టారు. బాధిత కుటుంబాలకు ఇళ్లు అందలేదని, చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు దక్కలేదని పేర్కొన్నారు. ఇసుక మాఫియాతో ప్రాజెక్టుకు గండి పడితే అసెంబ్లీ వేదికగా హై లెవెల్ కమిటీలు, దర్యాప్తు అంటూ జగన్ కాలయాపన చేశారే తప్పా ఉద్ధరించింది శూన్యమని విమర్శించారు.

Also Read: Justice Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బలపర్చాలి: మంత్రి

అలాగే అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. రాజంపేటకు రెండు సార్లు వచ్చిపోయినా ప్రాజెక్టు పనులకు మోక్షం లభించలేదని, రూ. 340 కోట్లతో మరమ్మత్తులు అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. డ్యామ్ నిర్మాణం కోసం సర్వేల పేరుతో సీఎం చంద్రబాబు కూడా కాలయాపన చేస్తున్నారని షర్మిల అన్నారు. రాజంపేట వేదికగా మళ్లీ మాయమాటలు చెప్పారు తప్ప ప్రాజెక్టు నిర్మాణంపై దిశా నిర్దేశం లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వైఎస్ షర్మిల అన్నారు. అన్నమయ్య కన్నీటి వ్యధకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లుగా నీటి నిల్వ లేక 30 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదని, లక్ష మందికి తాగునీరు లభించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పూర్తి స్థాయి నిధులు కేటాయించి అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేయాలని, డ్యామ్ ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు హామీల మేరకు పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు షర్మిల తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh news
  • APCC Chief Sharmila
  • CM Chandrababu
  • Kadapa
  • ys jagan
  • ys sharmila

Related News

Hinduja Group

Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మ‌రో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

ఇది రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ స్థాపనకు అనంతపురం, కర్నూలు, అమరావతిని హిందుజా పరిశీలించనుంది.

  • CM Chandrababu

    CM Chandrababu: కాశీబుగ్గలో తొక్కిసలాట.. ప్రైవేటు వ్యక్తుల చర్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

  • Stampede In Srikakulam Kasi

    Srikakulam Temple Stampede: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు

  • Ap House Land Is Now Yours

    AP Govt Good News : రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం చంద్రబాబు

  • Ap Swarnandhra Centers

    Swarnandhra Centers : మరో మార్పు దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు

Latest News

  • PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

  • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

  • Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఏ రాశి వారు ఎలాంటి వ‌స్తువులు దానం చేయాలో తెలుసా?

  • Suryakumar Yadav: సూర్య‌కుమార్‌, హారిస్ రౌఫ్‌కు షాకిచ్చిన ఐసీసీ!

  • SIR : SIRకు వ్యతిరేకంగా బెంగాల్లో భారీ ర్యాలీ

Trending News

    • India Post Payments Bank: ఇక‌పై ఇంటి నుండే ఆ సర్టిఫికేట్ పొందవచ్చు!

    • Rs 2,000 Notes: మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా రూ. 2 వేల నోట్లు!?

    • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

    • Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!

    • Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd